Movie News

దిల్ రాజు సమర్పించు.. శాకుంతలం

టాలీవుడ్లో సాహసాలకు పెట్టింది పేరైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకడు. ‘సొగసు చూడతరమా’ లాంటి వైవిధ్యమైన సినిమాతో అతను దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత ‘బాల రామాయణం’ లాంటి సాహసోపేత సినిమా తీశాడు. ఆపై ‘ఒక్కడు’తోనూ అతను పెద్ద రిస్కే చేశాడు. అప్పుడు అతడికి వేరే నిర్మాతల అండ దొరికింది కానీ.. కెరీర్లో ఒక దశలో తనను ఎవ్వరూ నమ్మలేని స్థితిలో ‘రుద్రమదేవి’ లాంటి భారీ ప్రాజెక్టును నెత్తికెత్తుకుని సొంత బేనర్లో రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీయడం గుణకే చెల్లింది.

దీని తర్వాత ‘హిరణ్య కశ్యప’ పేరుతో మరో భారీ చిత్రం తీయాలనుకున్నాడు. దానికి రూ.200 కోట్ల బడ్జెట్ అంచనాలు కూడా సిద్ధం చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యమైంది. అయినా వెనుకడుగు వేయకుండా సొంత బేనర్లో ‘శాకుంతలం’ పేరుతో మరో భారీ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకు శ్రీకారం చుట్టాడు.

‘రుద్రమదేవి’ సినిమాకు గుణ లాభాలేమీ అందుకున్నది లేదు. అతి కష్టం మీద పెట్టుబడి అయితే వెనక్కి తెచ్చుకున్నాడు. అయినా ఇప్పుడు భారీ ఖర్చుతో కూడుకున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ముందుకు రావడం ఆశ్చర్యమే. ఇప్పుడు ఆయనకు ఆర్థిక వనరులు ఎలా సమకూరుతాయో అని అంతా సందేహం వ్యక్తం చేశారు. కానీ ఆ లోటు తీర్చడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు సిద్ధమయ్యారు.

సోమవారం ‘శాకుంతలం’ సినిమా ముహూర్త వేడుక నిర్వహించారు. ఇందులో దిల్ రాజు పాల్గొన్నాడు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి కూడా ఈ రోజే వెల్లడైంది. ‘దిల్ రాజు సమర్పించు’.. అంటూ సినిమాకు ట్యాగ్ పడిపోయింది. నిర్మాతగా మాత్రం గుణశేఖర్ కూతురు నీలిమ పేరే వేశారు. రాజు ఈ చిత్రానికి ఫైనాన్స్ మాత్రమే చేస్తున్నారు. లాభ నష్టాలు గుణనే చూసుకోవాలి. పెట్టుబడి పెట్టినందుకు రాజు కోరుకున్నది ఇవ్వాలి. ఆ మేరకు ఒప్పందం జరిగినట్లుంది. ఎలాగైతేనేం రాజు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడంటే గుణకు కొండంత అండ దొరికినట్లే.

This post was last modified on March 15, 2021 3:32 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

51 minutes ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

51 minutes ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

55 minutes ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago