తెలుగులో గత రెండు దశాబ్దాల్లో హీరోగా అనూహ్యమైన ఎదుగుదల అంటే విజయ్ దేవరకొండదే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన అతను.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా అతడి ఇమేజ్ మారిపోయింది. పెద్ద స్టార్ అయిపోయాడు.
విజయ్ లుక్స్, అతడి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ తరానికి అచ్చమైన ప్రతినిధిలా కనిపిస్తాడు విజయ్. బయట అతడి ప్రవర్తన, మాటతీరు కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. యూత్లో ఫాలోయింగ్ పెరగడానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు విజయ్ తరహాలోనే మరో యంగ్ హీరో చాలా తక్కువ వ్యవధిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అతనే నవీన్ పొలిశెట్టి.
నవీన్ ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. ఆరేడేళ్ల ముందు నుంచే సినిమాలు చేస్తున్నాడు. 1 నేనొక్కడినే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో అతను నటించాడు. హిందీలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ బ్రేక్ రావడానికి చాలా టైం పట్టేసింది. రెండేళ్ల కిందట ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ యువ నటుడి ప్రతిభ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ఆ సర్ప్రైజ్ హిట్తో నవీన్ పేరు మార్మోగింది.
ఇప్పుడు జాతిరత్నాలు సినిమాతో నవీన్ క్యాలిబర్ ఏంటన్నది మరింతగా జనాలకు తెలిసిందే. ఈ సినిమాలో అతను చేసిన శ్రీకాంత్ పాత్ర గురించి.. అందులో అతడి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాతో అతడికి వచ్చిన క్రేజ్ కూడా అసామాన్యమైనది. ఒక్కసారిగా కోట్లమందికి అతను ఇష్టుడిగా మారిపోయాడు. నవీన్ రియల్ టాలెంట్ ఇంత కాలానికి జనాలకు తెలిసిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అతడిపై పేరున్న దర్శకులు కళ్లు పడ్డట్లే ఉన్నాయి. మున్ముందు అతడికి పెద్ద అవకాశాలే వచ్చేలా ఉన్నాయి. చూస్తుంటే విజయ్ దేవరకొండ తరహాలోనే అతను పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తున్నాడు.
This post was last modified on March 14, 2021 10:11 am
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…