మహాశివరాత్రికి కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించినపుడు బాక్సాఫీస్ లీడర్ అవుతుందని అందరూ అంచనా వేసింది శ్రీకారం సినిమానే. ఈ సినిమాకే ప్రి రిలీజ్ బజ్ ఎక్కువగా ఉంటుందని.. అడ్వాన్స్ బుకింగ్స్.. ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నారు. కానీ రిలీజ్ ముంగిట, ఆ తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జాతిరత్నాలు దెబ్బకు శ్రీకారం సినిమానే నిలిచే పరిస్థితి కనిపించడం లేదు.
మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. శ్రీకారం సినిమాకు వీకెండ్లో ఆశించిన వసూళ్లు లేవు. జాతిరత్నాలు హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. అదనంగా షోలు వేసినా ఫుల్ అయ్యే పరిస్థితి ఉంది. అదే సమయంలో శ్రీకారం చిత్రానికి ఫుల్స్ లేవు. ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈ చిత్రానికి థియేటర్లు పెద్ద సంఖ్యలోనే ఇచ్చినా.. ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేదు. శ్రీకారం పరిస్థితి అయినా పర్వాలేదు కానీ.. ఈ వారం వచ్చిన మరో సినిమా గాలి సంపత్ పరిస్థితి దయనీయం.
ఈ వారం మూడు సినిమాల్లో ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించనిది గాలి సంపత్ సినిమానే. ఐతే సినిమా మీద భరోసాతో పోటీకి నిలిపారు మేకర్స్. ఐతే ఈ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్ టాక్ రాలేదు. జాతిరత్నాలు, శ్రీకారం రూపంలో మంచి ఆప్షన్లు ఉండగా.. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి జనాలు ఎందుకు వెళ్తారు? దీంతో వీకెండ్లోనే ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు వాషౌట్ అన్న సంగతి తొలి రోజే నిర్ణయమైపోయింది. శనివారం పరిస్థితి చూశాక ఆ విషయం ఖరారైపోయింది.
ఇక గత వారం వచ్చిన ఎ1 ఎక్స్ప్రెస్కు కూడా జాతిరత్నాలు మంగళం పాడేసింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి వారాంతంలో ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. వీకెండ్ అయ్యాక వసూళ్లు తగ్గాయి. గురువారం కొత్త సినిమాల రాకతో ఎ1 ఎక్స్ప్రెస్ వైపు జనాలు చూడ్డం మానేశారు. ముఖ్యంగా జాతిరత్నాలు దెబ్బకు ఈ సినిమా కథ సమాప్తం అయినట్లయింది.
This post was last modified on March 14, 2021 10:06 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…