‘జాతిరత్నాలు’ సినిమా సెట్స్ మీద ఉన్నపుడు ఇదేదో చిన్న సైజు సినిమా అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచనాలకు పెద్ద సినిమాల రికార్డులూ బద్దలైపోతున్నాయి. ముఖ్యంగా ఏడాదిగా స్తబ్దుగా ఉన్న యుఎస్ మార్కెట్లో ఈ సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ తర్వాత యుఎస్లో రిలీజైన అన్ని సినిమాల్లోకి అత్యధిక ప్రిమియర్ వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ‘జాతిరత్నాలు’ రికార్డు నెలకొల్పడం విశేషం.
ఈ చిత్రానికి బుధవారం ప్రిమియర్స్లో ఏకంగా 1.33 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. కరోనా బ్రేక్ తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ప్రిమియర్స్ నుంచి లక్షల డాలర్లు రాబట్టలేదు. ఇప్పటిదాకా తమిళ చిత్రం ‘మాస్టర్’దే అత్యధిక ప్రిమియర్స్ వసూళ్ల రికార్డు. ఆ చిత్రం 93 వేల డాలర్లు వసూలు చేసింది. దాన్ని అలవోకగా కొట్టేయడమే కాదు.. లక్ష డాలర్ల మార్కును కూడా అధిగమించింది ‘జాతిరత్నాలు’.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలు మాత్రమే యుఎస్లో ప్రభావం చూపాయి. ‘ఉప్పెన’ ఫుల్ రన్లో దాదా 2 లక్షల డాలర్లు కలెక్ట్ చేసింది. దాన్ని ప్రిమియర్స్ + డే 1 వసూళ్లతోనే దాటేయబోతోంది ‘జాతిరత్నాలు’. లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ సినిమా హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రం కూడా ఆ ఘనతను అందుకోలేకపోయింది.
దేశీయ మార్కెట్ పుంజుకున్నా యుఎస్ మార్కెట్ డల్లుగా ఉండటంతో నిర్మాతలు నిరాశలో ఉన్నారు. ఒకప్పుడు బంగారు బాతులా కనిపించిన ఈ టెరిటరీ ఇలా తయారైందేమిటి అని బాధ పడుతున్నారు. ఇలాంటి టైంలో ‘జాతిరత్నాలు’ వేసవికి రాబోయే భారీ చిత్రాల్లో ఆశలు పెంచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘జాతిరత్నాలు’ దూకుడు మామూలుగా లేదు. ఈ రోజే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటి రేపట్నుంచి లాభాలు అందించేలా కనిపిస్తోంది.
This post was last modified on March 13, 2021 1:54 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…