ఓవైపు సౌత్ సినిమాలు.. ముఖ్యంగా తెలుగు చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఇక్కడ థియేటర్లు రీస్టార్ట్ అయిన కొంత కాలానికే వసూళ్లు ఊపందుకున్నాయి. సంక్రాంతికి ఎలా బాక్సాఫీస్ షేక్ అయిందో చూశాం. ఫిబ్రవరి-మార్చి లాంటి అన్ సీజన్లోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు వసూఝళ్ల మోత మోగుతోంది. గత నెలలో ‘ఉప్పెన’, ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ సినిమాలకు అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టాలీవుడ్లో కంటే ముందే.. అక్టోబరులో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు వచ్చినపుడే అక్కడ స్క్రీన్లు తెరిచారు. సినిమాలు నడిపిస్తున్నారు. కొత్త చిత్రాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావట్లేదు. ఏ సినిమాకూ పాజిటివ్ టాక్ రావట్లేదు. జనాల సందడి అసలేమాత్రం ఉండట్లేదు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘ఇందు కీ జవాని’; ‘మేడం చీఫ్ మినిస్టర్’ చిత్రాలకు కనీస స్పందన కరవైంది. ఇప్పుడు హార్రర్ కామెడీ ఫిలిం ‘రూహి’తో అయినా బాక్సాఫీస్ పరిస్థితి మారుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. ‘దడక్’, ‘గుంజన్ సక్సేనా’ లాంటి హిట్ల తర్వాత జాన్వి నటించిన చిత్రమిది. ఇంతకుమందు సూపర్ హిట్టయిన ‘స్త్రీ’ తరహాలో హార్రర్ కామెడీగా ఈ సినిమాను రూపొందించారు. రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషించాడు. ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పూర్తి తిరస్కారం ఎదురైంది. సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అసలు సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్యా చాలా తక్కువ. దేశవ్యాప్తంగాఈ చిత్రానికి తొలి రోజు రూ.3 కోట్ల గ్రాస్ కూడా రాలేదు. షేర్ కోటిన్నర లోపే ఉంది. ఈ మొత్తంతో డిస్ట్రిబ్యూటర్లు ఏం చేసుకోవాలి. సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే శని, ఆదివారాల్లో కూడా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. వేసవి మొదలు కాబోతోంది. ‘రూహి’ సినిమాతో బాక్సాఫీస్కు ఊపొస్తే తర్వాత మరిన్ని చిత్రాలను రిలీజ్ చేస్తారనుకుంటే.. భవిష్యత్తుపై భయాలు రేకెత్తించే ఫలితాన్నందుకునేలా ఉందీ చిత్రం.
This post was last modified on March 12, 2021 10:53 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…