శేఖర్ కమ్ముల డైరెక్షన్లో భానుమతిగా పరిచయమై, అందర్నీ ‘ఫిదా’ చేసేసిన సాయిపల్లవి పుట్టినరోజు నేడు. ‘ఫిదా’ మూవీ తర్వాత ఈ హైబ్రీడ్ పిల్లకు టాలీవుడ్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే మిగిలిన హీరోయిన్లలా ఈ ఫాలోయింగ్ను ఇష్టమొచ్చినట్టుగా వాడుకోకుండా చాలా సెలక్టివ్గా పాత్రలను ఎంచుకుంటోంది సాయిపల్లవి.
ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్యంతో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ కాగా, మరోటి రానా దగ్గుపాటి హీరోగా రూపొందుతున్న ‘విరాట పర్వం’. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ‘విరాటపర్వం’ మూవీ షూటింగ్లో పెను ప్రమాదం నుంచి లక్కీగా ఎస్కేప్ అయ్యిందట సాయిపల్లవి అండ్ టీమ్.
‘విరాట పర్వం’ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం రానా దగ్గుపాటి పార్ట్కి సంబంధించిన 8 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. మావోయిస్ట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన 50 శాతం షూటింగ్ వికారాబాద్, వరంగల్, కేరళ అడవుల్లో తెరకెక్కించారు.
కొన్ని నెలల క్రితం కేరళ అడవుల్లో షూటింగ్ చేస్తున్న సమయంలో యూనిట్కు చిత్రమైన అనుభవం ఎదురైందట. షూటింగ్ ముగించుకుని హోటల్కి తిరిగి వస్తున్న సమయంలో ఏకంగా 20 ఏనుగులు ఎదురయ్యాయట. ఒక్కసారిగా ఏనుగుల గుంపును చూడగానే చిత్రయూనిట్కు గుండె ఆగిపోయినంత పనైందట. దాంతో షూటింగ్ సామానంతా ఎక్కడివక్కడ వదిలేసి, చెట్టుకొకరు పుట్టకొకరు పరుగెత్తారట.
అలా దాదాపు అరకిలోమీటరు పరుగెత్తి దాక్కున్నారట. నిజానికి ‘విరాటపర్వం’ షూటింగ్ జరిపిన ఏరియాలో ప్రతీరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఏనుగుల సంచారం ఉంటుంది. అయితే ఆ విషయం తెలియని చిత్రయూనిట్… షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి లక్కీగా ఎస్కేప్ అయ్యారు. ఈ సంఘటన జరిగిన సమయంలో హీరోయిన్ సాయిపల్లవితో పాటు డైరెక్టర్ వేణు ఉడుగుల, చిత్రయూనిట్ ఉన్నారు. ఇది జరగడానికి కొద్దిసేపటి ముందే రానా దగ్గుపాటి అక్కడి నుంచి వెళ్లాడట.
సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ‘అమరవీరులకు జోహార్లు’ అని రాసిఉన్న మావోయిస్టు స్థూపం దగ్గర… పల్లెటూరి పడుచు గెటప్లో కూర్చున్న సాయిపల్లవి పోస్టర్ను విడుదల చేసింది ‘విరాట పర్వం’ చిత్రయూనిట్.
This post was last modified on May 9, 2020 5:18 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…