మొత్తానికి రెండు జాతీయ పార్టీల పరిస్ధితి చాలా దయనీయంగా తయారైంది. కూటముల్లోని పెద్దన్నలు ఇచ్చిన సీట్లను తీసుకుని పోటీ చేయటం తప్ప వేరే దిక్కేలేకుండా పోయింది. ఇదంతా ఏ రాష్ట్రంలో ? జాతీయ పార్టీలేవి ? అనే విషయాలపై ఇప్పటికే ఓ క్లారిటి వచ్చేసుంటుంది. అవును తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్ధితి గురించే చెప్పకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ పరిస్దితి అంటే గతకాలపు వైభవాలు కాబట్టి తాజా పరిస్ధితి ఇలాగైపోయిందని సరిపెట్టుకోవచ్చు.
కానీ బీజేపీ పరిస్ధితి అలాకాదే. గడచిన ఏడేళ్ళుగా కేంద్రంలో బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. దేశంలో మోడి కత్తికి ఎదురన్నదే లేకుండా పోయింది. జయలలిత మరణం తర్వాత తెరవెనుక నుండి తమిళనాడులో చక్రం తిప్పుతున్నది బీజేపీనే అనే ప్రచారం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి పార్టీకి కూడా ఇంతటి దయనీయ పరిస్దితి ఏమిటో ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.
తొందరలో జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో పోటీ చేయబోతున్న బీజేపీ 20 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. బీజేపీ ఇంకా ఎక్కువ సీట్లు అడిగినా అన్నాడీఎంకే చీఫ్, సీఎం పళనిస్వామి స్పందించలేదట. అసలు ఇప్పుడిచ్చిన సీట్లే చాలా ఎక్కువన్నట్లుగా మాట్లాడటంతో బీజేపీ నేతలు ఏమీ చేయలేకపోయారట. దాంతో ఇచ్చిన సీట్లను మాట్లాడకుండా తీసుకుని పోటీకి రెడీ అయిపోతున్నారు. అయితే సీట్ల సర్దుబాటు విషయం ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదు.
ఇక డీఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీ 25 సీట్లలో పోటీ చేస్తోంది. నిజానికి కాంగ్రెస్ నేతలు 30 సీట్లకు మించే డిమాండ్ చేసింది. అయితే ఇన్ని సీట్లిచ్చిందే ఎక్కువని డీఎంకే చీఫ్ స్టాలిన్ తెగేసి చెప్పారట. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో 43 సీట్లు కేటాయించి తప్పు చేశామని చెప్పారట. కాబట్టి ఈసారి ఆ తప్పు చేయదలచుకోలేదని స్పష్టంగా చెప్పారట. సరే కూటముల్లోని మిగిలిన పార్టీల పోటీ విషయం ఎలాగున్నా రెండు జాతీయ పార్టీలు మాత్రం వెనక సీట్లకే పరిమితమైపోయిన విషయం అర్ధమైపోతోంది.
This post was last modified on March 12, 2021 9:33 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…