హిందీలో గత కొన్నేళ్లలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ‘అంధాదున్’ ఒకటి. ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ ఒక వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో జీవనోపాధి కోసం హీరో అంధుడిగా నటిస్తూ ఉంటాడు. అతను తన కళ్ల ముందు జరిగిన ఓ హత్యను చూస్తే ఏంటి పరిస్థితి అనే కథాంశంతో ఆద్యంతో ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం.
ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. అతడి సరసన నభా నటేష్ నటిస్తోంది. ఒరిజినల్లో టబు చేసిన అత్యంత కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది. మేర్లపాక గాంధీ తెలుగు వెర్షన్ను డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాకు రీమేక్ చాన్నాళ్ల ముందే కన్ఫమ్ అయింది. ఆ చిత్రం తాజాగా సెట్స్ మీదికి వెళ్లింది.
కానీ తమిళ ‘అంధాదున్’ విషయంలో అక్కడి ప్రేక్షకుల్లో ఏమాత్రం ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అందుక్కారణం కాస్ట్ అండ్ క్రూనే. 50వ పడికి చేరువ అవుతున్న సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడు అనగానే సగం ఆసక్తి చచ్చిపోయింది. ఇక టబు పాత్రకు సిమ్రాన్ను ఎంచుకోవడమూ చాలామందికి నచ్చలేదు. సిమ్రాన్ ఈ మధ్య పూర్తిగా గ్లో కోల్పోయింది. ఆమెలో ఆకర్షణ అంతా పోయింది. ఇక ఈ సినిమాకు ముందు జేజే ఫ్రెడరిక్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు.
కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో అతణ్ని తప్పించేశారు. ప్రారంభోత్సవం రోజు.. తాను ఈ సినిమాలో భాగం కాదంటూ అతను ప్రకటించాడు. ప్రశాంత్ తండ్రి.. ఒకప్పటి విలన్ అయిన త్యాగరాజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. కొడుకు హీరోగా ఆయన కొన్ని సినిమాలు తీశాడు కానీ.. అవేవీ అంతగా ఆడలేదు. ఆయన్ని ఔట్ డేటెడ్ డైరెక్టర్ అంటుంటారు. అలాంటి వ్యక్తి ‘అంధాదున్’ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ను ఏం డీల్ చేస్తాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా పట్ల తమిళ ప్రేక్షకులు ముందే పెదవి విరిచేస్తున్నారు.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…