హిందీలో గత కొన్నేళ్లలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ‘అంధాదున్’ ఒకటి. ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ ఒక వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో జీవనోపాధి కోసం హీరో అంధుడిగా నటిస్తూ ఉంటాడు. అతను తన కళ్ల ముందు జరిగిన ఓ హత్యను చూస్తే ఏంటి పరిస్థితి అనే కథాంశంతో ఆద్యంతో ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం.
ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. అతడి సరసన నభా నటేష్ నటిస్తోంది. ఒరిజినల్లో టబు చేసిన అత్యంత కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది. మేర్లపాక గాంధీ తెలుగు వెర్షన్ను డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాకు రీమేక్ చాన్నాళ్ల ముందే కన్ఫమ్ అయింది. ఆ చిత్రం తాజాగా సెట్స్ మీదికి వెళ్లింది.
కానీ తమిళ ‘అంధాదున్’ విషయంలో అక్కడి ప్రేక్షకుల్లో ఏమాత్రం ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అందుక్కారణం కాస్ట్ అండ్ క్రూనే. 50వ పడికి చేరువ అవుతున్న సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడు అనగానే సగం ఆసక్తి చచ్చిపోయింది. ఇక టబు పాత్రకు సిమ్రాన్ను ఎంచుకోవడమూ చాలామందికి నచ్చలేదు. సిమ్రాన్ ఈ మధ్య పూర్తిగా గ్లో కోల్పోయింది. ఆమెలో ఆకర్షణ అంతా పోయింది. ఇక ఈ సినిమాకు ముందు జేజే ఫ్రెడరిక్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు.
కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో అతణ్ని తప్పించేశారు. ప్రారంభోత్సవం రోజు.. తాను ఈ సినిమాలో భాగం కాదంటూ అతను ప్రకటించాడు. ప్రశాంత్ తండ్రి.. ఒకప్పటి విలన్ అయిన త్యాగరాజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. కొడుకు హీరోగా ఆయన కొన్ని సినిమాలు తీశాడు కానీ.. అవేవీ అంతగా ఆడలేదు. ఆయన్ని ఔట్ డేటెడ్ డైరెక్టర్ అంటుంటారు. అలాంటి వ్యక్తి ‘అంధాదున్’ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ను ఏం డీల్ చేస్తాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా పట్ల తమిళ ప్రేక్షకులు ముందే పెదవి విరిచేస్తున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…