హిందీలో గత కొన్నేళ్లలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ‘అంధాదున్’ ఒకటి. ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్ ఒక వినూత్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో జీవనోపాధి కోసం హీరో అంధుడిగా నటిస్తూ ఉంటాడు. అతను తన కళ్ల ముందు జరిగిన ఓ హత్యను చూస్తే ఏంటి పరిస్థితి అనే కథాంశంతో ఆద్యంతో ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం.
ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. అతడి సరసన నభా నటేష్ నటిస్తోంది. ఒరిజినల్లో టబు చేసిన అత్యంత కీలక పాత్రలో తమన్నా నటిస్తోంది. మేర్లపాక గాంధీ తెలుగు వెర్షన్ను డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాకు రీమేక్ చాన్నాళ్ల ముందే కన్ఫమ్ అయింది. ఆ చిత్రం తాజాగా సెట్స్ మీదికి వెళ్లింది.
కానీ తమిళ ‘అంధాదున్’ విషయంలో అక్కడి ప్రేక్షకుల్లో ఏమాత్రం ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. అందుక్కారణం కాస్ట్ అండ్ క్రూనే. 50వ పడికి చేరువ అవుతున్న సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో కథానాయకుడు అనగానే సగం ఆసక్తి చచ్చిపోయింది. ఇక టబు పాత్రకు సిమ్రాన్ను ఎంచుకోవడమూ చాలామందికి నచ్చలేదు. సిమ్రాన్ ఈ మధ్య పూర్తిగా గ్లో కోల్పోయింది. ఆమెలో ఆకర్షణ అంతా పోయింది. ఇక ఈ సినిమాకు ముందు జేజే ఫ్రెడరిక్ అనే యువ దర్శకుడిని పెట్టుకున్నారు.
కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో అతణ్ని తప్పించేశారు. ప్రారంభోత్సవం రోజు.. తాను ఈ సినిమాలో భాగం కాదంటూ అతను ప్రకటించాడు. ప్రశాంత్ తండ్రి.. ఒకప్పటి విలన్ అయిన త్యాగరాజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. కొడుకు హీరోగా ఆయన కొన్ని సినిమాలు తీశాడు కానీ.. అవేవీ అంతగా ఆడలేదు. ఆయన్ని ఔట్ డేటెడ్ డైరెక్టర్ అంటుంటారు. అలాంటి వ్యక్తి ‘అంధాదున్’ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ను ఏం డీల్ చేస్తాడన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా పట్ల తమిళ ప్రేక్షకులు ముందే పెదవి విరిచేస్తున్నారు.
This post was last modified on March 10, 2021 6:22 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…