అక్కినేని నాగచైతన్య కొత్తగా ‘థ్యాంక్ యు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఏ సందర్భం లేకపోయినా.. ఈ సినిమా పేరు ఇప్పుడు ఉన్నట్లుండి ట్విట్టర్లో ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడేమీ అప్డేట్ లేదు. దాని ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి రాబోతున్నట్లు సంకేతాలు కూడా రాలేదు. అసలు ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తున్నది అక్కినేని అభిమానులు కూడా కాదు. ఆ పని చేస్తున్నది, ‘థ్యాంక్’ సినిమాను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. ఎందుకిలా అనిపిస్తోందా..? ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
‘థ్యాంక్ యు’ సినిమాలో చైతూ మహేష్ బాబుకు వీరాభిమానిగా నటిస్తున్నాడు. టీనేజీలో ఉన్నపుడు మహేష్ అంటే పడి చచ్చేలా ఉంటుందట అతడి క్యారెక్టర్. ఇప్పటికే చైతూ మీసం గడ్డం తీసేసి, చిన్న కుర్రాడిలా మారిన లుక్ ఒకటి ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లుక్తోనే తాజాగా షూట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ సన్నివేశం ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లబోతోంది. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ టైంలో మహేష్ అభిమానిగా చైతూ చేసిన సందడిని ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూనే ఆవిష్కరించే సన్నివేశం తీసింది ‘థ్యాంక్ యు’ టీం ఈ మధ్యే. చైతూ కటౌట్ పైకి నిచ్చెన ద్వారా వెళ్లడం.. పైన తెరను తీసి మహేష్ కటౌట్ను ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం.. వీడియోలో కనిపిస్తోంది. సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూసి మహేష్ అభిమానులు నోస్టాల్జిక్ ఫీలింగ్లోకి వెళ్లిపోతున్నారు. ‘ఒక్కడు’ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ‘థ్యాంక్ యు’లో మహేష్ రెఫరెన్స్ పట్ల చాలా ఖుషీగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులు.. ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తూ, రిలీజ్ టైంలో తమ సపోర్ట్ ఫుల్గా చైతూకు ఇస్తామని హామీ ఇస్తుండటం విశేషం.
This post was last modified on March 9, 2021 8:24 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…