అక్కినేని నాగచైతన్య కొత్తగా ‘థ్యాంక్ యు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఏ సందర్భం లేకపోయినా.. ఈ సినిమా పేరు ఇప్పుడు ఉన్నట్లుండి ట్విట్టర్లో ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడేమీ అప్డేట్ లేదు. దాని ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి రాబోతున్నట్లు సంకేతాలు కూడా రాలేదు. అసలు ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తున్నది అక్కినేని అభిమానులు కూడా కాదు. ఆ పని చేస్తున్నది, ‘థ్యాంక్’ సినిమాను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. ఎందుకిలా అనిపిస్తోందా..? ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
‘థ్యాంక్ యు’ సినిమాలో చైతూ మహేష్ బాబుకు వీరాభిమానిగా నటిస్తున్నాడు. టీనేజీలో ఉన్నపుడు మహేష్ అంటే పడి చచ్చేలా ఉంటుందట అతడి క్యారెక్టర్. ఇప్పటికే చైతూ మీసం గడ్డం తీసేసి, చిన్న కుర్రాడిలా మారిన లుక్ ఒకటి ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లుక్తోనే తాజాగా షూట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ సన్నివేశం ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లబోతోంది. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ టైంలో మహేష్ అభిమానిగా చైతూ చేసిన సందడిని ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూనే ఆవిష్కరించే సన్నివేశం తీసింది ‘థ్యాంక్ యు’ టీం ఈ మధ్యే. చైతూ కటౌట్ పైకి నిచ్చెన ద్వారా వెళ్లడం.. పైన తెరను తీసి మహేష్ కటౌట్ను ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం.. వీడియోలో కనిపిస్తోంది. సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూసి మహేష్ అభిమానులు నోస్టాల్జిక్ ఫీలింగ్లోకి వెళ్లిపోతున్నారు. ‘ఒక్కడు’ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ‘థ్యాంక్ యు’లో మహేష్ రెఫరెన్స్ పట్ల చాలా ఖుషీగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులు.. ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తూ, రిలీజ్ టైంలో తమ సపోర్ట్ ఫుల్గా చైతూకు ఇస్తామని హామీ ఇస్తుండటం విశేషం.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…