అక్కినేని నాగచైతన్య కొత్తగా ‘థ్యాంక్ యు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఏ సందర్భం లేకపోయినా.. ఈ సినిమా పేరు ఇప్పుడు ఉన్నట్లుండి ట్విట్టర్లో ఇండియా లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడేమీ అప్డేట్ లేదు. దాని ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి రాబోతున్నట్లు సంకేతాలు కూడా రాలేదు. అసలు ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తున్నది అక్కినేని అభిమానులు కూడా కాదు. ఆ పని చేస్తున్నది, ‘థ్యాంక్’ సినిమాను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. ఎందుకిలా అనిపిస్తోందా..? ఆ విశేషాలేంటో చూద్దాం పదండి.
‘థ్యాంక్ యు’ సినిమాలో చైతూ మహేష్ బాబుకు వీరాభిమానిగా నటిస్తున్నాడు. టీనేజీలో ఉన్నపుడు మహేష్ అంటే పడి చచ్చేలా ఉంటుందట అతడి క్యారెక్టర్. ఇప్పటికే చైతూ మీసం గడ్డం తీసేసి, చిన్న కుర్రాడిలా మారిన లుక్ ఒకటి ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లుక్తోనే తాజాగా షూట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆ సన్నివేశం ప్రేక్షకులను దాదాపు రెండు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లబోతోంది. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ టైంలో మహేష్ అభిమానిగా చైతూ చేసిన సందడిని ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఒక థియేటర్ ముందు మహేష్ బాబు భారీ కటౌట్ పెట్టి.. దాన్ని చైతూనే ఆవిష్కరించే సన్నివేశం తీసింది ‘థ్యాంక్ యు’ టీం ఈ మధ్యే. చైతూ కటౌట్ పైకి నిచ్చెన ద్వారా వెళ్లడం.. పైన తెరను తీసి మహేష్ కటౌట్ను ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం.. వీడియోలో కనిపిస్తోంది. సంబంధిత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూసి మహేష్ అభిమానులు నోస్టాల్జిక్ ఫీలింగ్లోకి వెళ్లిపోతున్నారు. ‘ఒక్కడు’ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ‘థ్యాంక్ యు’లో మహేష్ రెఫరెన్స్ పట్ల చాలా ఖుషీగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులు.. ఈ సినిమా పేరును ట్రెండ్ చేస్తూ, రిలీజ్ టైంలో తమ సపోర్ట్ ఫుల్గా చైతూకు ఇస్తామని హామీ ఇస్తుండటం విశేషం.
This post was last modified on March 9, 2021 8:24 am
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…