Movie News

చిన్న సినిమాకు పెద్ద బిజినెస్

జాతి రత్నాలు.. కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకుల చర్చల్లో ఎక్కడ చూసినా ఈ సినిమానే ఉంటోంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎప్పుడో ఏడాది కిందట మొదలైంది. కానీ సినిమా పూర్తి కావడంలో కొంత ఆలస్యం జరగ్గా.. కరోనా విరామం సినిమా మరింత లేటయ్యేలా చేసింది. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక తొందరపడకుండా వెయిట్ చేసి, ఇప్పుడు మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కాస్ట్ అండ్ క్రూ ప్రకారం చూస్తే ఇది చిన్న సినిమానే. కానీ దీనికి బిజినెస్ మాత్రం పెద్ద స్థాయిలోనే జరిగింది.

‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.11 కోట్లు పలికాయట. ఈ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తమే. సినిమా మొదలైనపుడు ఐదారు కోట్ల బిజినెస్ చేస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాకు మంచి క్రేజ్ రావడంతో దానికి రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

‘జాతిరత్నాలు’ ప్రోమోలు మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌ లాగా కనిపిస్తోందీ చిత్రం. టీజర్, ట్రైలర్ రెండూ కూడా చాలా ఫన్నీగా ఉండి సినిమాపై అంచనాలు పెంచాయి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో అతడి బ్రాండ్ డా సినిమాకు ప్లస్ అయింది.

‘జాతిరత్నాలు’ స్యూర్ షాట్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీలోకి ఆల్రెడీ వెళ్లిపోయింది. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి చాలా బాగుందంటూ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు అనూహ్యమైన స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి కానుకగా.. మార్చి 11న ‘శ్రీకారం’; ‘గాలి సంపత్’ చిత్రాలకు పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

This post was last modified on March 7, 2021 2:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

1 hour ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

2 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago