జాతి రత్నాలు.. కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకుల చర్చల్లో ఎక్కడ చూసినా ఈ సినిమానే ఉంటోంది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎప్పుడో ఏడాది కిందట మొదలైంది. కానీ సినిమా పూర్తి కావడంలో కొంత ఆలస్యం జరగ్గా.. కరోనా విరామం సినిమా మరింత లేటయ్యేలా చేసింది. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక తొందరపడకుండా వెయిట్ చేసి, ఇప్పుడు మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. కాస్ట్ అండ్ క్రూ ప్రకారం చూస్తే ఇది చిన్న సినిమానే. కానీ దీనికి బిజినెస్ మాత్రం పెద్ద స్థాయిలోనే జరిగింది.
‘జాతిరత్నాలు’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.11 కోట్లు పలికాయట. ఈ సినిమా స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తమే. సినిమా మొదలైనపుడు ఐదారు కోట్ల బిజినెస్ చేస్తే ఎక్కువ అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమాకు మంచి క్రేజ్ రావడంతో దానికి రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
‘జాతిరత్నాలు’ ప్రోమోలు మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో రాని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోందీ చిత్రం. టీజర్, ట్రైలర్ రెండూ కూడా చాలా ఫన్నీగా ఉండి సినిమాపై అంచనాలు పెంచాయి. రిలీజ్ ముంగిట ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో అతడి బ్రాండ్ డా సినిమాకు ప్లస్ అయింది.
‘జాతిరత్నాలు’ స్యూర్ షాట్ హిట్ అనే టాక్ ఇండస్ట్రీలోకి ఆల్రెడీ వెళ్లిపోయింది. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి చాలా బాగుందంటూ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు అనూహ్యమైన స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి కానుకగా.. మార్చి 11న ‘శ్రీకారం’; ‘గాలి సంపత్’ చిత్రాలకు పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
This post was last modified on March 7, 2021 2:35 pm
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…