నవీన్ పొలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ఒక్కసారిగా మంచి ఫాలోయింగ్ సంపాదించి బిజీ అయిపోయిన నటుడు. నిజానికి ఈ సినిమా చేయడానికి ఏడెనిమిదేళ్ల ముందు నుంచి అతను తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ అతడి ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘1 నేనొక్కడినే’ లాంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ అతడికి పెద్దగా పేరు రాలేదు. ఉత్తరాదిన మాత్రం అతడికి షార్ట్ ఫిలిమ్స్, ‘చిచ్చోరే’ లాంటి సినిమాలతో మంచి పేరే వచ్చింది. తెలుగులో మాత్రం బ్రేక్ రావడానికి చాలా టైం పట్టేసింది.
ఐతే నాగ్ అశ్విన్ ప్రణాళిక వర్కవుట్ అయి ఉంటే నవీన్కు చాలా ముందుగానే బ్రేక్ వచ్చేదట. అతను దర్శకుడిగా పరిచయం అయిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకు ముందు హీరోగా అనుకున్నది నవీన్నే అట. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో ఆ సినిమా చేయలేదని నాగ్ అశ్విన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘నిజానికి నవీన్ను నేనే హీరోగా పరిచయం చేయాల్సింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నవీన్, విజయ్ దేవరకొండలతో తక్కువ బడ్జెట్లో చేయడానికి ప్రణాళికలు వేసుకున్నా. అనుకోకుండా మాకు నాని దొరికాడు. దీంతో ఆ సినిమా స్థాయి పెరిగింది. అనుదీప్ ఐదేళ్ల కిందట తీసిన ఒక షార్ట్ ఫిలిం చూసి మంచి కథ ఉంటే చెప్పు చేద్దామని చెబితే.. రెండేళ్ల కిందట ‘జాతిరత్నాలు’ స్టోరీ చెప్పాడు. అప్పుడు ఈ సినిమాకు నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పర్ఫెక్ట్ అనిపించింది. రెండేళ్ల ముందే నవీన్కు ఈ కథ చెప్పాం. అతను అప్పటికి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత చేస్తానన్నాడు. మా అదృష్టం కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్టయి నవీన్ స్థాయి పెరిగి ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.
ముందు ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ అనే టైటిల్ అనుకోలేదని.. ఆణిముత్యాలు, సుద్దపూసలు అనే పేర్లు పరిశీలించామని.. చివరికి ‘జాతిరత్నాలు’ అయితే క్యాచీగా ఉంటుందని, జనాల్లోకి సులువుగా వెళ్తుందని ఆ పేరు ఖరారు చేశామని అశ్విన్ వెల్లడించాడు.
This post was last modified on March 7, 2021 2:26 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…