Movie News

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నవీన్ చేసుంటే..

నవీన్ పొలిశెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ఒక్కసారిగా మంచి ఫాలోయింగ్ సంపాదించి బిజీ అయిపోయిన నటుడు. నిజానికి ఈ సినిమా చేయడానికి ఏడెనిమిదేళ్ల ముందు నుంచి అతను తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ అతడి ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘1 నేనొక్కడినే’ లాంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ అతడికి పెద్దగా పేరు రాలేదు. ఉత్తరాదిన మాత్రం అతడికి షార్ట్ ఫిలిమ్స్, ‘చిచ్చోరే’ లాంటి సినిమాలతో మంచి పేరే వచ్చింది. తెలుగులో మాత్రం బ్రేక్ రావడానికి చాలా టైం పట్టేసింది.

ఐతే నాగ్ అశ్విన్ ప్రణాళిక వర్కవుట్ అయి ఉంటే నవీన్‌కు చాలా ముందుగానే బ్రేక్ వచ్చేదట. అతను దర్శకుడిగా పరిచయం అయిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాకు ముందు హీరోగా అనుకున్నది నవీన్‌నే అట. కానీ కొన్ని కారణాల వల్ల అతడితో ఆ సినిమా చేయలేదని నాగ్ అశ్విన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘నిజానికి నవీన్‌ను నేనే హీరోగా పరిచయం చేయాల్సింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నవీన్, విజయ్ దేవరకొండలతో తక్కువ బడ్జెట్లో చేయడానికి ప్రణాళికలు వేసుకున్నా. అనుకోకుండా మాకు నాని దొరికాడు. దీంతో ఆ సినిమా స్థాయి పెరిగింది. అనుదీప్ ఐదేళ్ల కిందట తీసిన ఒక షార్ట్ ఫిలిం చూసి మంచి కథ ఉంటే చెప్పు చేద్దామని చెబితే.. రెండేళ్ల కిందట ‘జాతిరత్నాలు’ స్టోరీ చెప్పాడు. అప్పుడు ఈ సినిమాకు నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పర్ఫెక్ట్ అనిపించింది. రెండేళ్ల ముందే నవీన్‌కు ఈ కథ చెప్పాం. అతను అప్పటికి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత చేస్తానన్నాడు. మా అదృష్టం కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్టయి నవీన్ స్థాయి పెరిగి ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.

ముందు ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ అనే టైటిల్ అనుకోలేదని.. ఆణిముత్యాలు, సుద్దపూసలు అనే పేర్లు పరిశీలించామని.. చివరికి ‘జాతిరత్నాలు’ అయితే క్యాచీగా ఉంటుందని, జనాల్లోకి సులువుగా వెళ్తుందని ఆ పేరు ఖరారు చేశామని అశ్విన్ వెల్లడించాడు.

This post was last modified on March 7, 2021 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago