సినిమా రిలీజ్ రోజు దానికి హైప్ పెంచడానికి సీక్వెల్ తీయబోతున్నామని.. ఇతర భాషల్లోకి రీమేక్ కాబోతోందని ప్రకటనలు ఇవ్వడం మామూలే. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి గిమ్మిక్కులు ప్లే చేస్తుంటారు. కానీ తర్వాత చూస్తే అలాంటిదేమీ ఉండదు. కొన్ని సినిమాల మేకర్స్ మాటలు మాత్రమే నిజమవుతుంటాయి. మరి శుక్రవారం రిలీజైన కొత్త సినిమా ‘ప్లే బ్యాక్’ టీం చేసిన అనౌన్స్మెంట్ సంగతేంటో తెలియదు. సుకుమార్ మిత్రుడైన హరిప్రసాద్ జక్కా రూపొందించిన చిత్రమిది.
ఇంతకుముందు ఆయన సుకుమార్ అన్న కొడుకు అశోక్ను హీరోగా పెట్టి ‘దర్శకుడు’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘ప్లే బ్యాక్’ తీశాడు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం. 1993 కాలంలో ఉన్న అమ్మాయి.. 2019లో ఉన్న అబ్బాయికి ఫోన్ ద్వారా లైన్ కలిపితే ఎలా ఉంటుందన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ తరహా సినిమాలను ‘క్రాస్ టైం టెలిఫోన్ కాన్వర్జేషన్’ జానర్గా పరిగణిస్తారు. ఇండియాలో ఈ జానర్లో తెరకెక్కిన తొలి చిత్రంగా ‘ప్లే బ్యాక్’ను చిత్ర బృందం ప్రచారం చేసుకుంది. ఐతే మనకు ఈ జానర్ కొత్త కానీ.. విదేశాల్లో ఇది బాగా పాపులర్. కొరియాలో వందలకొద్దీ ఈ జానర్లో సినిమాలు రావడం విశేషం. హాలీవుడ్నూ ఆ టైపు సినిమాలున్నాయి. నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న జర్మన్ సిరీస్ ‘డార్క్’ కూడా ఈ జానర్లో తెరకెక్కిందే. ‘ప్లే బ్యాక్’కు ‘డార్క్’ సిరీసే స్ఫూర్తి అని.. దానికిది కాపీ అని కూడా అంటున్నారు.
ఐతే కాన్సెప్ట్ అయితే తెలుగు ప్రేక్షకులకు కొత్త కావడంతో కొంత మేర ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సినిమా పర్వాలేదు అంటున్నారు. ఈ ఐడియా బాగున్నప్పటికీ.. దీన్ని అనుకున్నంత బాగా ప్రెజెంట్ చేయలేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఐతే ఈ చిన్న సినిమాకు ప్రచారం కల్పించి జనాల్లోకి తీసుకెళ్లడం కోసమో ఏమో.. ‘ప్లే బ్యాక్’ను వివిధ భారతీయ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. జెమిని ఫిలిమ్స్ వాళ్లు ఈ రీమేక్లను తీయబోతుండటం ప్రకటించడంతో కేవలం ప్రచారం కోసమే ఈ ప్రకటన చేశారని అనుకోవడానికి లేదు. మరి నిజంగా అన్న మాట ప్రకారం ఈ చిత్రాన్ని వివిధ భారతీయ భాషల్లో రీమేక్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on March 6, 2021 7:24 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…