ప్రతిభకు లోటు లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కథే చెప్పాలని చూస్తాడు. రాజమౌళి సహా చాలామంది పెద్ద దర్శకులకు అతనన్నా, తన సినిమాలన్నా చాలా అభిమానం. ఎందరో యువ దర్శకులకు అతను ఆదర్శం. ఆయన శిష్యులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అయినా సరే.. చంద్రశేఖర్ యేలేటి కెరీర్ ఎప్పుడూ సవ్యంగా సాగింది లేదు. ఒక సినిమా చేశాక.. ఇంకో సినిమా కోసం అభిమానులకు ఎదురు చూపులు తప్పవు. సినిమా సెట్ చేసుకోవడానికి ఆయన ప్రతిసారీ కష్టపడుతూనే ఉంటారు.
ఐతే, అనుకోకుండా ఒక రోజు సినిమాలతో తనపై భారీగా అంచనాలు పెంచిన యేలేటి.. ‘ఒక్కడున్నాడు’ దగ్గర్నుంచి స్ట్రగలువుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. మధ్యలో తనే నిర్మాతగా మారి ‘ప్రయాణం’ అనే సినిమా తీసిన యేలేటికి ఆశించిన ప్రయోజనం దక్కలేదు. మనమంతా సినిమాకు ముందు, తర్వాత ఆయన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది.
మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘మనమంతా’ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్నందుకోకపోవడంతో యేలేటి మరో సినిమా చేజిక్కించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏవేవో కాంబినేషన్లు అనుకున్నాక చివరికి నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్లో ‘చెక్’ చేశాడు. యేలేటిని నమ్మి మంచి బడ్జెట్లోనే ఈ సినిమా తీశారు ఆనంద్ ప్రసాద్. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. వీకెండ్లో కొంత జోరు చూపించిన ‘చెక్’ తర్వాత చల్లబడిపోయింది. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ప్రకారం చూస్తే ఇది డిజాస్టరే. యేలేటి కెరీర్లోనే వీకెస్ట్ మూవీ ఇదే అని తేల్చేశారు.
మంచి మంచి సినిమాలు తీసినపుడే యేలేటికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సినిమాలు సెట్ కాలేదు. అలాంటిది ‘చెక్’ లాంటి డిజాస్టర్ తర్వాత ఆయన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. నిజానికి ‘చెక్’ కంటే ముందు మైత్రీ మూవీ మేకర్స్తో ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. ‘చెక్’ బాగా ఆడితే ఒక స్టార్ హీరోతో యేలేటి దర్శకత్వంలో సినిమా చేయాలని మైత్రీ అధినేతలు భావించారు. కానీ ‘చెక్’ తేడా కొట్టడంతో స్టార్ హీరో సంగతి దేవుడెరుగు. మీడియం రేంజ్ హీరోతో అయినా సినిమా చేస్తారా.. అసలు యేలేటికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా అన్నది సందేహంగా మారింది.
This post was last modified on March 5, 2021 7:41 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…