ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇండియాలోకి అడుగుపెట్టడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఇక్కడ ఆ సంస్థ దూకుడు మామూలుగా లేదు. ఆ సంస్థ దగ్గరున్న భారీ అంతర్జాతీయ కంటెంట్కు తోడు.. ఇండియన్ కంటెంట్ను బాగా పెంచడానికి భారీ ప్రణాళికలతోనే దూసుకెళ్తోంది. కరోనా-లాక్డౌన్ నెట్ఫ్లిక్స్కు బాగా కలిసొచ్చి ఇండియాలో సబ్స్క్రిప్షన్లు పెరిగాయి. ఈ ఊపులో ఇండియన్ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ మీద ఆ సంస్థ భారీగానే పెట్టుబడులు పెట్టి మరింత విస్తరించే పనిలో పడింది.
హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ పెద్ద ఎత్తున కంటెంట్ జనరేట్ చేస్తోంది. తెలుగులోనూ ఇటీవలే ‘పిట్టకథలు’తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో థియేటర్లు పున:ప్రారంభం అయి మామూలుగానే నడుస్తున్న నేపథ్యంలో మిగతా ఓటీటీల జోరు కొంత తగ్గినట్లే ఉంది కానీ.. నెట్ ఫ్లిక్స్ మాత్రం కొత్త ఏడాదిలో భారీగా కంటెంట్ ఇవ్వబోతోందన్న స్పష్టమైంది.
సినిమాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తంగా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్లో 41 కొత్త రిలీజ్లు ఉండబోతుండటం విశేషం. వాటి వివరాలను నెట్ ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘జగమే తంత్రం’తో పాటు సిద్దార్థ్-అరవింద్ స్వామి-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాంథాలజీ ఫిలిం ‘నవరస’తో పాటు హిందీలో తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హసీనా దిల్ రుబా’, రకుల్ ప్రీత్-అర్జున్ కపూర్ల ‘సర్దార్ కా గ్రాండ్ సన్’, బాబీ డియోల్-అర్జున్ రాంపాల్ల థ్రిల్లర్ మూవీ ‘పెంట్ హౌస్’.. ఇలా ఈ జాబితాలో పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
ఇవి కాక ఢిల్లీ క్రైమ్-2, అరణ్యక్, ఫైండింగ్ అనామిక, మసాబా మసాబా-2 లాంటి పేరున్న వెబ్ సిరీస్లు చాలానే నెట్ ఫ్లిక్స్ అందించబోతోంది. వీటి షెడ్యూల్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే డేట్లు ప్రకటించనున్నారు. ‘జగమే తంత్రం’ ముందుగా రిలీజయ్యేలా కనిపిస్తోంది. ఐతే ఈ 41 రిలీజ్ల్లో తెలుగు నుంచి ఏ సినిమా, సిరీస్ కానీ లేకపోవడమే విచారకరం.
This post was last modified on March 4, 2021 5:43 pm
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…