ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇండియాలోకి అడుగుపెట్టడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఇక్కడ ఆ సంస్థ దూకుడు మామూలుగా లేదు. ఆ సంస్థ దగ్గరున్న భారీ అంతర్జాతీయ కంటెంట్కు తోడు.. ఇండియన్ కంటెంట్ను బాగా పెంచడానికి భారీ ప్రణాళికలతోనే దూసుకెళ్తోంది. కరోనా-లాక్డౌన్ నెట్ఫ్లిక్స్కు బాగా కలిసొచ్చి ఇండియాలో సబ్స్క్రిప్షన్లు పెరిగాయి. ఈ ఊపులో ఇండియన్ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ మీద ఆ సంస్థ భారీగానే పెట్టుబడులు పెట్టి మరింత విస్తరించే పనిలో పడింది.
హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ పెద్ద ఎత్తున కంటెంట్ జనరేట్ చేస్తోంది. తెలుగులోనూ ఇటీవలే ‘పిట్టకథలు’తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో థియేటర్లు పున:ప్రారంభం అయి మామూలుగానే నడుస్తున్న నేపథ్యంలో మిగతా ఓటీటీల జోరు కొంత తగ్గినట్లే ఉంది కానీ.. నెట్ ఫ్లిక్స్ మాత్రం కొత్త ఏడాదిలో భారీగా కంటెంట్ ఇవ్వబోతోందన్న స్పష్టమైంది.
సినిమాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తంగా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్లో 41 కొత్త రిలీజ్లు ఉండబోతుండటం విశేషం. వాటి వివరాలను నెట్ ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘జగమే తంత్రం’తో పాటు సిద్దార్థ్-అరవింద్ స్వామి-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాంథాలజీ ఫిలిం ‘నవరస’తో పాటు హిందీలో తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హసీనా దిల్ రుబా’, రకుల్ ప్రీత్-అర్జున్ కపూర్ల ‘సర్దార్ కా గ్రాండ్ సన్’, బాబీ డియోల్-అర్జున్ రాంపాల్ల థ్రిల్లర్ మూవీ ‘పెంట్ హౌస్’.. ఇలా ఈ జాబితాలో పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
ఇవి కాక ఢిల్లీ క్రైమ్-2, అరణ్యక్, ఫైండింగ్ అనామిక, మసాబా మసాబా-2 లాంటి పేరున్న వెబ్ సిరీస్లు చాలానే నెట్ ఫ్లిక్స్ అందించబోతోంది. వీటి షెడ్యూల్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే డేట్లు ప్రకటించనున్నారు. ‘జగమే తంత్రం’ ముందుగా రిలీజయ్యేలా కనిపిస్తోంది. ఐతే ఈ 41 రిలీజ్ల్లో తెలుగు నుంచి ఏ సినిమా, సిరీస్ కానీ లేకపోవడమే విచారకరం.
This post was last modified on March 4, 2021 5:43 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…