మంచు వారి బాక్సాఫీస్ జర్నీ కొన్నేళ్లుగా ఎలా సాగుతోందో అందరికీ తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి.. అలాగే మంచు మోహన్ బాబు.. వీళ్లలో ఎవరి సినిమాలూ గత కొన్నేళ్లలో ఓ మాదిరిగా కూడా ఆడలేదు. విష్ణు పరిస్థితి అయితే మరీ దారుణం. చివరగా అతడి నుంచి వచ్చిన ‘ఓటర్’ సినిమా రిలీజైనట్లు అసలు జనాలకు తెలియనే తెలియదు. దాని కంటే ముందు వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో విష్ణు కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ వచ్చేసింది.
ఐతే ఈసారి సేఫ్గా ఏదైనా చిన్న సినిమా చేసుకోకుండా ‘మోసగాళ్ళు’ అనే హాలీవుడ్ సినిమా చేశాడు. ఇది ప్రధానంగా ఇంగ్లిష్లో తెరకెక్కిన సినిమా కావడం విశేషం. ముందు హాలీవుడ్లోనే రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడేమో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇది చూసి తెలుగులోనే మార్కెట్ లేని మంచు విష్ణు.. పాన్ ఇండియా రిలీజ్ అంటాడేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఐతే ‘మోసగాళ్ళు’ ట్రైలర్ చూస్తే ఇది విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది. సినిమా రేసీగా.. ఉత్కంఠ భరితంగా సాగేలా అనిపించింది. విష్ణు గత సినిమాల్లో లేని క్వాలిటీ ఇందులో అగుపించింది. ఇక ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి విష్ణుకు ధీమా ఇస్తున్నది కాజల్ అగర్వాల్. ఆమె పాన్ ఇండియా స్టార్. తమిళం, హిందీలో ఆమె బాగా పాపులర్. ఆమె కోసమైనా ఇతర భాషల ప్రేక్షకులు ఈ చూస్తారని విష్ణు ఆశిస్తుండొచ్చు.
ఇందులో ముఖ్య పాత్రలు చేసిన సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్లు సైతం వేరే భాషల వాళ్లకు తెలుసు. తన సినిమా మీద కూడా భరోసా ఉండటంతో విష్ణు సాహసం చేస్తున్నట్లున్నాడు. ఈ చిత్రానికి తెలుగేతర భాషల్లో ‘అను అండ్ అర్జున్’, ‘అర్జున్ అండ్ అను’ అనే టైటిళ్లు కూడా ఖరారు చేశారు. ఈ నెల 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు విష్ణు. ఈసారైనా మంచు హీరోకు సక్సెస్ అందుతుందేమో చూడాలి మరి.
This post was last modified on March 3, 2021 10:43 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…