మంచు వారి బాక్సాఫీస్ జర్నీ కొన్నేళ్లుగా ఎలా సాగుతోందో అందరికీ తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి.. అలాగే మంచు మోహన్ బాబు.. వీళ్లలో ఎవరి సినిమాలూ గత కొన్నేళ్లలో ఓ మాదిరిగా కూడా ఆడలేదు. విష్ణు పరిస్థితి అయితే మరీ దారుణం. చివరగా అతడి నుంచి వచ్చిన ‘ఓటర్’ సినిమా రిలీజైనట్లు అసలు జనాలకు తెలియనే తెలియదు. దాని కంటే ముందు వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో విష్ణు కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ వచ్చేసింది.
ఐతే ఈసారి సేఫ్గా ఏదైనా చిన్న సినిమా చేసుకోకుండా ‘మోసగాళ్ళు’ అనే హాలీవుడ్ సినిమా చేశాడు. ఇది ప్రధానంగా ఇంగ్లిష్లో తెరకెక్కిన సినిమా కావడం విశేషం. ముందు హాలీవుడ్లోనే రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడేమో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇది చూసి తెలుగులోనే మార్కెట్ లేని మంచు విష్ణు.. పాన్ ఇండియా రిలీజ్ అంటాడేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఐతే ‘మోసగాళ్ళు’ ట్రైలర్ చూస్తే ఇది విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది. సినిమా రేసీగా.. ఉత్కంఠ భరితంగా సాగేలా అనిపించింది. విష్ణు గత సినిమాల్లో లేని క్వాలిటీ ఇందులో అగుపించింది. ఇక ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి విష్ణుకు ధీమా ఇస్తున్నది కాజల్ అగర్వాల్. ఆమె పాన్ ఇండియా స్టార్. తమిళం, హిందీలో ఆమె బాగా పాపులర్. ఆమె కోసమైనా ఇతర భాషల ప్రేక్షకులు ఈ చూస్తారని విష్ణు ఆశిస్తుండొచ్చు.
ఇందులో ముఖ్య పాత్రలు చేసిన సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్లు సైతం వేరే భాషల వాళ్లకు తెలుసు. తన సినిమా మీద కూడా భరోసా ఉండటంతో విష్ణు సాహసం చేస్తున్నట్లున్నాడు. ఈ చిత్రానికి తెలుగేతర భాషల్లో ‘అను అండ్ అర్జున్’, ‘అర్జున్ అండ్ అను’ అనే టైటిళ్లు కూడా ఖరారు చేశారు. ఈ నెల 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు విష్ణు. ఈసారైనా మంచు హీరోకు సక్సెస్ అందుతుందేమో చూడాలి మరి.
This post was last modified on March 3, 2021 10:43 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…