బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేదు. ఎక్కడైనా హీరోలదే హవా. నూటికి 70-80 సినిమాల్లో హీరోల పాత్రల ముందు హీరోయిన్ల క్యారెక్టర్లు తేలిపోతుంటాయి. నామమాత్రంగా అనిపిస్తాయి. మిగతా 20-30 శాతం సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయి తప్ప అందులో హీరోలను డామినేట్ చేసేవి ఒకటీ అరా మాత్రమే ఉంటాయి. హీరోయిన్లు పెర్ఫామ్ చేయడానికి, వాళ్లు ఎక్కువ హైలైట్ కావడానికి స్కోప్ ఉండేది లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్రమే. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ డామినేషన్ అనేది అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.
తెలుగులో శేఖర్ కమ్ముల సినిమాలు ఈ కోవకే చెందుతాయి. ఆనంద్, గోదావరి, ఫిదా.. ఇలా శేఖర్ చిత్రాలు చాలా వాటిలో హీరో కంటే కూడా హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. నటిగానే కాక డ్యాన్సర్గానూ మంచి పేరున్న సాయిపల్లవి ఫిదాలో ఎంత హైలైట్ అయిందో.. ఆ సినిమాకు ఎంత ఆకర్షణగా నిలిచిందో తెలిసిందే. హీరో వరుణ్ మీద ఆ సినిమాలో ఆమె స్పష్టమైన పైచేయి సాధించింది.
ఇప్పుడు మరోసారి కమ్ములతో లవ్ స్టోరి సినిమా చేస్తున్న సాయిపల్లవి.. ఈసారి హీరోను పూర్తిగా పక్కకు నెట్టేసేలా కనిపిస్తోంది. ప్రోమోల్లో ఆమె డామినేషన్ మామూలుగా లేదు. ఇప్పుడు సారంగ దరియా పాట ప్రోమో, లిరికల్ వీడియో చూశాక ఈ సినిమాలో నాగచైతన్య.. సాయిపల్లవి ముందు నిలవగలడా అని సందేహాలు కలుగుతున్నాయి. గత సినిమాలతో పోలిస్తే చైతూ ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. బాగానే పెర్ఫామ్ చేసినట్లున్నాడు కూడా.
ఐతే ఎంత బాగా చేసినా.. సాయిపల్లవి పెర్ఫామెన్స్తో పోల్చి చూస్తే చైతూ తక్కువగా కనిపించొచ్చు. పాటల్లో ఆమె డామినేషన్ తట్టుకోవడం కష్టమే. సారంగ దరియా పాట చూస్తే ఇది ఫిదాలో వచ్చిండే పాటను మించి వైరల్ అయ్యేలా ఉంది. సినిమాలో పూర్తి పాట చూసి జనాలు ఆగడం కష్టమే. ఈ పాటలో డ్యాన్స్.. మిగతా సినిమాలో పెర్ఫామెన్స్తో ఓవరాల్గా సాయిపల్లవే హైలైట్ అయి చైతూ కనిపించకుండా చేసేస్తుందేమో అన్నది అక్కినేని అభిమానుల భయం. మరి చైతూ ఈ గండాన్ని అధిగమిస్తాడో?
This post was last modified on March 2, 2021 10:16 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…