సినీ రంగంలో పైకి అందరూ స్నేహంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఒకరి విజయాన్ని ఒకరు ఓర్వలేరని.. ఒకరి వెనుకాల ఒకరు గోతులు తవ్వుతుంటారని అంటారు. ఒక హీరో హిట్టు కొడితే సంతోషించేవాళ్ల కంటే అసూయతో రగిలిపోయే వాళ్లే ఎక్కువ అని ఇండస్ట్రీ జనాలే అంటుంటారు. ఐతే కొందరు హీరోలు మాత్రం ఇలాంటి వాటికి మినహాయింపుగా ఉంటారు. వాళ్లను చూస్తే అజాత శత్రువు అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ.. అందరి వాడిలా పేరు తెచ్చుకుని.. నిష్కల్మషంగా కనిపించే అలాంటి హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు టాలీవుడ్లో అతడి హవా ఎలా సాగిందో తెలిసిందే. విరామం లేకుండా సినిమాలు చేస్తూ అడపా దడపా హిట్లు కొడుతూ కెరీర్లో దూసుకెళ్తుండేవాడు. అతడి సినిమాలు వేరే చిత్రాలకు పోటీగా ఎవరూ భావించేవారు కాదు. నరేష్ ప్రధానంగా చేసేవి కామెడీ సిినిమాలు కాబట్టి అందరూ వాటిని ఎంజాయ్ చేసేవాళ్లు. అందరూ అతణ్ని ఇష్టపడేవాళ్లు.
కాబట్టే నరేష్ ఎనిమిదేళ్లుగా హిట్టు లేక ఇబ్బంది పడుతుంటే.. అందరూ బాధ పడ్డవాళ్లే. తమను ఎంతో నవ్వించిన నరేష్కు ఒక హిట్టు పడితే చూడాలని ప్రేక్షకులు ఎలా కోరుకున్నారో.. ఇండస్ట్రీ జనాలు కూడా అంతే ఆశించారు. ఇప్పుడు ‘నాంది’ సినిమాతో అతను విజయాన్నందుకుంటే అందరూ ఆనందిస్తున్నవాళ్లే. ‘నాంది’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రిలీజ్ రోజు నరేష్ ఎంత ఉద్వేగానికి గురయ్యాడో తెలిసిందే. ఆ ఉద్వేగంలో కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నాడు. అది చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఎమోషనల్ అయిపోయారు.
ఆ తర్వాత అందరూ ఈ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. పాజిటివ్ ట్వీట్లు వేసి సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇధి సినిమాకు బాగానే కలిసొచ్చింది. ‘నాంది’కి అంతకంతకూ కలెక్షన్లు పెరిగాయి. ప్రేక్షకుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ‘బుక్ మై షో’లో ఈ చిత్రానికి 93 పర్సంట్ రేటింగ్ వచ్చిందంటే వాళ్లు ఈ సినిమాకు ఎంతగా సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 1, 2021 8:37 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…