మున్ముందు ఈ ఏడాది భారీ చిత్రాలు చాలానే రాబోతున్నప్పటికీ.. ఉప్పెన ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టుబడి-రాబడి పరంగా చూసుకుంటే భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ.25 కోట్ల పెట్టుబడితో సినిమా తీస్తే.. థియేట్రికల్ రన్ ద్వారానే దానికి రెట్టింపు షేర్ రాబట్టబోతోంది ఉప్పెన. ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం ఆ మైలురాయిని దాటబోతోంది. ఉప్పెన జోరు ఈ వారం కూడా ఆగేట్లు కనిపించడం లేదు.
థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయమే కాక మైత్రీ సంస్థకు డిజిటల్, శాటిలైట్, రీమేక్ హక్కుల రూపంలోనూ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడేట్లుంది. ఈ మొత్తం కలిపితే మైత్రీ అధినేతలకు ఈ సినిమా ద్వారా వచ్చిన లాభం దాదాపు రూ.45 కోట్ల దాకా ఉండబోతోందని సమాచారం. అందులోంచి సుకుమార్కు సైతం వాటా రూపంలో పెద్ద మొత్తంలో దక్కనుందట.
నిజానికి సుక్కుకు ఉప్పెన సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ లేదు. ఆయన కథ అందించడం, మాటలు రాయడం లాంటివేమీ చేయలేదు. అలాగే ఈ చిత్రానికి డబ్బులు కూడా పెట్టలేదు. కానీ స్క్రిప్టు చర్చల్లో కీలకంగా ఉన్నారు. దాన్ని సరిదిద్దారు. మేకింగ్ను పర్యవేక్షించారు. రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించారు. తన శిష్యుడిని వెనుక ఉండి నడిపించారు. అలాగే ఈ సినిమా పోస్టర్ల మీద సుకుమార్ రైటింగ్స్ అని ఆయన బేనర్ పేరు వేసి ప్రమోషన్కు ఆయన బ్రాండును బాగానే వాడుకున్నారు.
ఐతే ఉప్పెన సినిమాకు స్క్రిప్టు, ప్రమోషన్లో ఉపయోగపడినందుకు గాను ఇప్పుడు సుకుమార్కు రూ.10 కోట్ల దాకా ముట్టినట్లు సమాచారం. మైత్రీ వాళ్లు సంతోషంగానే ఆయనకు వాటా కింద ఈ మొత్తం అందిస్తున్నారట. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా భారీ విజయాన్నందుకోవడంతో సుకుమార్ ప్రతిష్ట కూడా ఎంతో పెరిగింది. అది ఆయనకు మరింతగా కలిసొచ్చే విషయమే.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…