మున్ముందు ఈ ఏడాది భారీ చిత్రాలు చాలానే రాబోతున్నప్పటికీ.. ఉప్పెన ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టుబడి-రాబడి పరంగా చూసుకుంటే భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ.25 కోట్ల పెట్టుబడితో సినిమా తీస్తే.. థియేట్రికల్ రన్ ద్వారానే దానికి రెట్టింపు షేర్ రాబట్టబోతోంది ఉప్పెన. ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం ఆ మైలురాయిని దాటబోతోంది. ఉప్పెన జోరు ఈ వారం కూడా ఆగేట్లు కనిపించడం లేదు.
థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయమే కాక మైత్రీ సంస్థకు డిజిటల్, శాటిలైట్, రీమేక్ హక్కుల రూపంలోనూ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడేట్లుంది. ఈ మొత్తం కలిపితే మైత్రీ అధినేతలకు ఈ సినిమా ద్వారా వచ్చిన లాభం దాదాపు రూ.45 కోట్ల దాకా ఉండబోతోందని సమాచారం. అందులోంచి సుకుమార్కు సైతం వాటా రూపంలో పెద్ద మొత్తంలో దక్కనుందట.
నిజానికి సుక్కుకు ఉప్పెన సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ లేదు. ఆయన కథ అందించడం, మాటలు రాయడం లాంటివేమీ చేయలేదు. అలాగే ఈ చిత్రానికి డబ్బులు కూడా పెట్టలేదు. కానీ స్క్రిప్టు చర్చల్లో కీలకంగా ఉన్నారు. దాన్ని సరిదిద్దారు. మేకింగ్ను పర్యవేక్షించారు. రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించారు. తన శిష్యుడిని వెనుక ఉండి నడిపించారు. అలాగే ఈ సినిమా పోస్టర్ల మీద సుకుమార్ రైటింగ్స్ అని ఆయన బేనర్ పేరు వేసి ప్రమోషన్కు ఆయన బ్రాండును బాగానే వాడుకున్నారు.
ఐతే ఉప్పెన సినిమాకు స్క్రిప్టు, ప్రమోషన్లో ఉపయోగపడినందుకు గాను ఇప్పుడు సుకుమార్కు రూ.10 కోట్ల దాకా ముట్టినట్లు సమాచారం. మైత్రీ వాళ్లు సంతోషంగానే ఆయనకు వాటా కింద ఈ మొత్తం అందిస్తున్నారట. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా భారీ విజయాన్నందుకోవడంతో సుకుమార్ ప్రతిష్ట కూడా ఎంతో పెరిగింది. అది ఆయనకు మరింతగా కలిసొచ్చే విషయమే.
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…
టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు…
తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వసూళ్లు రావడం అన్నది అనూహ్యమే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా…
వీకెండ్ వసూళ్లను ఘనంగా రాబట్టుకున్న లెనిన్ అసలు పరీక్ష మొదలుపెట్టింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద…
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…