మున్ముందు ఈ ఏడాది భారీ చిత్రాలు చాలానే రాబోతున్నప్పటికీ.. ఉప్పెన ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టుబడి-రాబడి పరంగా చూసుకుంటే భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ.25 కోట్ల పెట్టుబడితో సినిమా తీస్తే.. థియేట్రికల్ రన్ ద్వారానే దానికి రెట్టింపు షేర్ రాబట్టబోతోంది ఉప్పెన. ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం ఆ మైలురాయిని దాటబోతోంది. ఉప్పెన జోరు ఈ వారం కూడా ఆగేట్లు కనిపించడం లేదు.
థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయమే కాక మైత్రీ సంస్థకు డిజిటల్, శాటిలైట్, రీమేక్ హక్కుల రూపంలోనూ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడేట్లుంది. ఈ మొత్తం కలిపితే మైత్రీ అధినేతలకు ఈ సినిమా ద్వారా వచ్చిన లాభం దాదాపు రూ.45 కోట్ల దాకా ఉండబోతోందని సమాచారం. అందులోంచి సుకుమార్కు సైతం వాటా రూపంలో పెద్ద మొత్తంలో దక్కనుందట.
నిజానికి సుక్కుకు ఉప్పెన సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ లేదు. ఆయన కథ అందించడం, మాటలు రాయడం లాంటివేమీ చేయలేదు. అలాగే ఈ చిత్రానికి డబ్బులు కూడా పెట్టలేదు. కానీ స్క్రిప్టు చర్చల్లో కీలకంగా ఉన్నారు. దాన్ని సరిదిద్దారు. మేకింగ్ను పర్యవేక్షించారు. రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించారు. తన శిష్యుడిని వెనుక ఉండి నడిపించారు. అలాగే ఈ సినిమా పోస్టర్ల మీద సుకుమార్ రైటింగ్స్ అని ఆయన బేనర్ పేరు వేసి ప్రమోషన్కు ఆయన బ్రాండును బాగానే వాడుకున్నారు.
ఐతే ఉప్పెన సినిమాకు స్క్రిప్టు, ప్రమోషన్లో ఉపయోగపడినందుకు గాను ఇప్పుడు సుకుమార్కు రూ.10 కోట్ల దాకా ముట్టినట్లు సమాచారం. మైత్రీ వాళ్లు సంతోషంగానే ఆయనకు వాటా కింద ఈ మొత్తం అందిస్తున్నారట. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా భారీ విజయాన్నందుకోవడంతో సుకుమార్ ప్రతిష్ట కూడా ఎంతో పెరిగింది. అది ఆయనకు మరింతగా కలిసొచ్చే విషయమే.
This post was last modified on February 27, 2021 10:07 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…