మున్ముందు ఈ ఏడాది భారీ చిత్రాలు చాలానే రాబోతున్నప్పటికీ.. ఉప్పెన ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టుబడి-రాబడి పరంగా చూసుకుంటే భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ.25 కోట్ల పెట్టుబడితో సినిమా తీస్తే.. థియేట్రికల్ రన్ ద్వారానే దానికి రెట్టింపు షేర్ రాబట్టబోతోంది ఉప్పెన. ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం ఆ మైలురాయిని దాటబోతోంది. ఉప్పెన జోరు ఈ వారం కూడా ఆగేట్లు కనిపించడం లేదు.
థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయమే కాక మైత్రీ సంస్థకు డిజిటల్, శాటిలైట్, రీమేక్ హక్కుల రూపంలోనూ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడేట్లుంది. ఈ మొత్తం కలిపితే మైత్రీ అధినేతలకు ఈ సినిమా ద్వారా వచ్చిన లాభం దాదాపు రూ.45 కోట్ల దాకా ఉండబోతోందని సమాచారం. అందులోంచి సుకుమార్కు సైతం వాటా రూపంలో పెద్ద మొత్తంలో దక్కనుందట.
నిజానికి సుక్కుకు ఉప్పెన సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ లేదు. ఆయన కథ అందించడం, మాటలు రాయడం లాంటివేమీ చేయలేదు. అలాగే ఈ చిత్రానికి డబ్బులు కూడా పెట్టలేదు. కానీ స్క్రిప్టు చర్చల్లో కీలకంగా ఉన్నారు. దాన్ని సరిదిద్దారు. మేకింగ్ను పర్యవేక్షించారు. రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించారు. తన శిష్యుడిని వెనుక ఉండి నడిపించారు. అలాగే ఈ సినిమా పోస్టర్ల మీద సుకుమార్ రైటింగ్స్ అని ఆయన బేనర్ పేరు వేసి ప్రమోషన్కు ఆయన బ్రాండును బాగానే వాడుకున్నారు.
ఐతే ఉప్పెన సినిమాకు స్క్రిప్టు, ప్రమోషన్లో ఉపయోగపడినందుకు గాను ఇప్పుడు సుకుమార్కు రూ.10 కోట్ల దాకా ముట్టినట్లు సమాచారం. మైత్రీ వాళ్లు సంతోషంగానే ఆయనకు వాటా కింద ఈ మొత్తం అందిస్తున్నారట. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా భారీ విజయాన్నందుకోవడంతో సుకుమార్ ప్రతిష్ట కూడా ఎంతో పెరిగింది. అది ఆయనకు మరింతగా కలిసొచ్చే విషయమే.
This post was last modified on February 27, 2021 10:07 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…