కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. అక్కినేని నాగార్జునతో మెగా కుర్రాడు వైష్ణవ్ తేజ్ పని చేయనున్నాడు. ఈ మెగాస్టార్ చిన్న మేనల్లుడితో సినిమా నిర్మించడానికి నాగ్ సన్నాహాలు పూర్తి చేశాడు. ‘మనం ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నాగ్ నిర్మించబోయే సినిమాలో వైష్ణవ్ నటించనున్న విషయాన్ని ఇక అధికారికంగానే ప్రకటించబోతున్నారు. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
తాను హీరోగా సొంత బేనర్లో సినిమాలు చేయడమే కాక.. అప్పుడప్పుడూ బయటి యంగ్ హీరోలను పెట్టి సినిమాలు తీస్తుంటాడు నాగ్. ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి’ నుంచి ‘రంగుల రాట్నం’ వరకు ఇలా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు నిర్మించాడు. ఐతే ‘రంగుల రాట్నం’తో గట్టి ఎదురు దెబ్బ నాగ్.. కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఐతే ఓ మంచి కథ తన దగ్గరికి రావడం, ‘ఉప్పెన’తో ఘనంగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ ఆ కథకు సరిపోతాడనిపించడంతో చిరంజీవిని అడగడం, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వైష్ణవ్ తేజ్ అందుకోబోయే పారితోషకం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైష్ణవ్కు నాగ్ రూ.3 కోట్ల దాకా పారితోషకం ఇచ్చే అవకాశాలున్నాయట.
ఎందుకంటే వైష్ణవ్ ఇప్పుడు ఆ మొత్తంలోనే డిమాండ్ చేసే స్థితిలో ఉన్నాడు. తొలి సినిమా ‘ఉప్పెన’కు పుచ్చుకున్నది 50 లక్షల రూపాయలే. ఐతే ‘ఉప్పెన’ సినిమా భారీ విజయం సాధించడం, వైష్ణవ్కు మంచి పేరు రావడంతో డిమాండ్కు తగ్గట్లే అతను రెమ్యూనరేషన్ అడుగుతున్నట్లు తెలిసింది. బయటి నిర్మాతలనైతే వైష్ణవ్ ఈ మేరకే డిమాండ్ చేస్తున్నాడట. నాగ్ కూడా ఆ మేరకే అతడికి పారితోషకం ఇచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on February 26, 2021 10:13 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…