అల్లరి నరేష్ ముఖంలో చాన్నాళ్ల తర్వాత చిరునవ్వులు చూస్తున్నారు అభిమానులు. ఎప్పుడో 2012లో వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత.. ఎనిమిదేళ్ల విరామానంతరం అతడి ఖాతాలో ఓ హిట్టు పడేలా కనిపిస్తోంది. ‘నాంది’ సినిమాకు యావరేజ్ టాక్ రాగా.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే అందుకునేలా సాగుతోందీ చిత్రం. రెండు రోజుల వ్యవధిలో ఈ చిత్రం రూ.1.2 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను రూ.2.3 కోట్లకు అమ్మారు నిర్మాత సతీశ్ వేగేశ్న. చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం కాదనే అనిపిస్తోంది.
ఈ వారం విడుదలైన మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే ‘నాంది’కి మెరుగైన టాక్ వచ్చింది. ఒకప్పుడు తమనెంతగానో అలరించిన అల్లరి నరేష్కు చాలా ఏళ్లుగా హిట్టు లేదే అనే సానుభూతి ప్రేక్షకుల్లో ఉంది. చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి ఓ మంచి సినిమా రావడంతో జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. పాజిటివ్ టాక్ను స్ప్రెడ్ చేస్తున్నారు. బుక్ మై షోలో ఈ చిత్రానికి 93 శాతం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందంటే ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరగడం విశేషం.
నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే దాదాపుగా పూర్తయింది. టీజర్ బాగుండటంతో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. లాభానికే సినిమాను అమ్ముకునే అవకాశం వచ్చినా.. నరేష్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి, అతడి మార్కెట్ మళ్లీ పుంజుకోవడానికి అవకాశమిచ్చే సినిమా అని ఆపారు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ చేశారు. నిర్మాత అత్యాశకు పోకుండా తక్కువ రేట్లకే సినిమాను అమ్మాడు. దీని వల్ల బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం అయ్యేలా లేదు. బయ్యర్లకు లాభాలు దక్కితే సినిమా ‘హిట్’ స్టేటస్ అందుకుంటుంది. అప్పుడు డిజిటల్, శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. మంచి రేట్లు వచ్చే అవకాశముంది. ఈ రకంగా చూస్తే థియేట్రికల్ రిలీజ్ కోసం ఇన్నాళ్లు ఆగి, తక్కువ రేట్లకు సినిమాను ఇవ్వడం ద్వారా నిర్మాత తెలివైన పని చేసినట్లే.
This post was last modified on February 21, 2021 2:02 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…