టాలీవుడ్లో చాలామంది హీరోలకు తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన, పెద్ద స్టార్లను చేసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. రవితేజ పెద్ద హీరో అయ్యాడంటే అది పూరి తీసిన ‘ఇడియట్’ వల్లే. మహేష్ బాబు సూపర్ స్టార్ స్టేటస్ సాధించి, ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి కారణమైన ‘పోకిరి’ పూరి సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ను అరంగేట్ర సినిమాతోనే స్టార్ను చేసిన ఘనత కూడా పూరీదే.
ఇంకా చాలామంది హీరోలకు పెద్ద హిట్లు ఇచ్చాడు పూరి. కానీ తన కొడుకు పూరి ఆకాశ్ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు. టీనేజీలో ‘ఆంధ్రా పోరి’ లాంటి అనవసర సినిమా చేయించాడు. తర్వాత తాను పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలో ‘మెహబూబా’ లాంటి పేలవమైన సినిమాతో అతణ్ని హీరోగా లాంచ్ చేశాడు. దీంతో ఆకాశ్ అడుగులు తడబడ్డాయి. అతను హీరోగా ఏమాత్రం నిలదొక్కుకుంటాడో అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇలాంటి తరుణంలో తన స్క్రిప్టుతోనే మళ్లీ ఆకాశ్ రీలాంచింగ్కు రంగం సిద్ధం చేశాడు పూరి. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వంలో రెండేళ్ల కిందట ‘రొమాంటిక్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. రిలీజ్కు రెడీ అవుతున్నట్లే కనిపించింది. ఫుల్ రొమాంటిక్గా ఉన్న పోస్టర్లకు తోడు ఒక హాట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ఇక థియేటర్లలోకి దిగడమే తరువాయి అనుకున్నారు. ఈలోపు కరోనా అడ్డం పడింది. ఆ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది.
లాక్ డౌన్ టైంలో ‘రొమాంటిక్’ ఓటీటీలో రిలీజవుతుందని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఈ సినిమా ఊసే లేదు. ‘రొమాంటిక్’ ఏ దశలో ఉందో కూడా తెలియట్లేదు. పూరి ఈ సినిమా గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు. దాని సంగతేంటో తేల్చకుండానే ఆకాశ్ కొత్త సినిమాను మొదలుపెట్టారు. ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ఆకాశ్ హీరోగా ‘చోర్ బజార్’ అనే సినిమా తీయనున్నాడు. ఆ దర్శకుడి ట్రాక్ రికార్డూ ఏమీ బాగా లేదు. ఆకాశ్ పరిస్థితీ అంతంతమాత్రంగా ఉంది. అసలు ‘రొమాంటిక్’ సంగతేంటో తేల్చకుండా పూరి ఇలాంటి ప్రాజెక్టును లైన్లో పెట్టాడేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి పూరి ఏం సమాధానం చెబుతాడో?
This post was last modified on February 18, 2021 7:09 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…