టాలీవుడ్లో చాలామంది హీరోలకు తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన, పెద్ద స్టార్లను చేసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. రవితేజ పెద్ద హీరో అయ్యాడంటే అది పూరి తీసిన ‘ఇడియట్’ వల్లే. మహేష్ బాబు సూపర్ స్టార్ స్టేటస్ సాధించి, ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి కారణమైన ‘పోకిరి’ పూరి సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ను అరంగేట్ర సినిమాతోనే స్టార్ను చేసిన ఘనత కూడా పూరీదే.
ఇంకా చాలామంది హీరోలకు పెద్ద హిట్లు ఇచ్చాడు పూరి. కానీ తన కొడుకు పూరి ఆకాశ్ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు. టీనేజీలో ‘ఆంధ్రా పోరి’ లాంటి అనవసర సినిమా చేయించాడు. తర్వాత తాను పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలో ‘మెహబూబా’ లాంటి పేలవమైన సినిమాతో అతణ్ని హీరోగా లాంచ్ చేశాడు. దీంతో ఆకాశ్ అడుగులు తడబడ్డాయి. అతను హీరోగా ఏమాత్రం నిలదొక్కుకుంటాడో అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇలాంటి తరుణంలో తన స్క్రిప్టుతోనే మళ్లీ ఆకాశ్ రీలాంచింగ్కు రంగం సిద్ధం చేశాడు పూరి. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వంలో రెండేళ్ల కిందట ‘రొమాంటిక్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. రిలీజ్కు రెడీ అవుతున్నట్లే కనిపించింది. ఫుల్ రొమాంటిక్గా ఉన్న పోస్టర్లకు తోడు ఒక హాట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ఇక థియేటర్లలోకి దిగడమే తరువాయి అనుకున్నారు. ఈలోపు కరోనా అడ్డం పడింది. ఆ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది.
లాక్ డౌన్ టైంలో ‘రొమాంటిక్’ ఓటీటీలో రిలీజవుతుందని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఈ సినిమా ఊసే లేదు. ‘రొమాంటిక్’ ఏ దశలో ఉందో కూడా తెలియట్లేదు. పూరి ఈ సినిమా గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు. దాని సంగతేంటో తేల్చకుండానే ఆకాశ్ కొత్త సినిమాను మొదలుపెట్టారు. ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ఆకాశ్ హీరోగా ‘చోర్ బజార్’ అనే సినిమా తీయనున్నాడు. ఆ దర్శకుడి ట్రాక్ రికార్డూ ఏమీ బాగా లేదు. ఆకాశ్ పరిస్థితీ అంతంతమాత్రంగా ఉంది. అసలు ‘రొమాంటిక్’ సంగతేంటో తేల్చకుండా పూరి ఇలాంటి ప్రాజెక్టును లైన్లో పెట్టాడేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి పూరి ఏం సమాధానం చెబుతాడో?
This post was last modified on February 18, 2021 7:09 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…