టాలీవుడ్లో చాలామంది హీరోలకు తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన, పెద్ద స్టార్లను చేసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. రవితేజ పెద్ద హీరో అయ్యాడంటే అది పూరి తీసిన ‘ఇడియట్’ వల్లే. మహేష్ బాబు సూపర్ స్టార్ స్టేటస్ సాధించి, ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి కారణమైన ‘పోకిరి’ పూరి సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ను అరంగేట్ర సినిమాతోనే స్టార్ను చేసిన ఘనత కూడా పూరీదే.
ఇంకా చాలామంది హీరోలకు పెద్ద హిట్లు ఇచ్చాడు పూరి. కానీ తన కొడుకు పూరి ఆకాశ్ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు. టీనేజీలో ‘ఆంధ్రా పోరి’ లాంటి అనవసర సినిమా చేయించాడు. తర్వాత తాను పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలో ‘మెహబూబా’ లాంటి పేలవమైన సినిమాతో అతణ్ని హీరోగా లాంచ్ చేశాడు. దీంతో ఆకాశ్ అడుగులు తడబడ్డాయి. అతను హీరోగా ఏమాత్రం నిలదొక్కుకుంటాడో అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇలాంటి తరుణంలో తన స్క్రిప్టుతోనే మళ్లీ ఆకాశ్ రీలాంచింగ్కు రంగం సిద్ధం చేశాడు పూరి. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వంలో రెండేళ్ల కిందట ‘రొమాంటిక్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. రిలీజ్కు రెడీ అవుతున్నట్లే కనిపించింది. ఫుల్ రొమాంటిక్గా ఉన్న పోస్టర్లకు తోడు ఒక హాట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ఇక థియేటర్లలోకి దిగడమే తరువాయి అనుకున్నారు. ఈలోపు కరోనా అడ్డం పడింది. ఆ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది.
లాక్ డౌన్ టైంలో ‘రొమాంటిక్’ ఓటీటీలో రిలీజవుతుందని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఈ సినిమా ఊసే లేదు. ‘రొమాంటిక్’ ఏ దశలో ఉందో కూడా తెలియట్లేదు. పూరి ఈ సినిమా గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు. దాని సంగతేంటో తేల్చకుండానే ఆకాశ్ కొత్త సినిమాను మొదలుపెట్టారు. ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ఆకాశ్ హీరోగా ‘చోర్ బజార్’ అనే సినిమా తీయనున్నాడు. ఆ దర్శకుడి ట్రాక్ రికార్డూ ఏమీ బాగా లేదు. ఆకాశ్ పరిస్థితీ అంతంతమాత్రంగా ఉంది. అసలు ‘రొమాంటిక్’ సంగతేంటో తేల్చకుండా పూరి ఇలాంటి ప్రాజెక్టును లైన్లో పెట్టాడేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి పూరి ఏం సమాధానం చెబుతాడో?
This post was last modified on February 18, 2021 7:09 pm
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…