సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు నెలల నుంచి ఇంటికే పరిమితం అయి ఉన్నాడు. కరోనా-లాక్ డౌన్ టైంలోనూ ఆయన ఆరు నెలలకు పైగా ఇంట్లోనే ఉన్నారు. బయటికే రాలేదు. కానీ అప్పుడు దాని గురించి పెద్ద చర్చ లేదు. అప్పుడు రజినీ మాత్రమే కాదు.. చాలామంది సెలబ్రెటీలు, ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లు ఇళ్లు దాటి బయటికి రాలేదు.
ఐతే కరోనా బ్రేక్ తర్వాత రజినీకాంత్ అభిమానులను కలవడం, రాజకీయ పార్టీ పెట్టడంపై చర్చించడం, త్వరలోనే పార్టీ మొదలవుతుందని ప్రకటించడం.. ఈలోపు ‘అన్నాత్తె’ షూటింగ్ పూర్తి చేద్దామని రంగంలోకి దిగడం, కానీ యూనిట్లో కొందరు కరోనా బారిన పడటంతో రజినీ కంగారు పడిపోవడం, అన్నింటికంటే తన ఆరోగ్యం ముఖ్యమన్న భావనతో రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించడం, తిరిగి ఇంటికి పరిమితం కావడం, అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడటం తెలిసిన సంగతులే. కరోనా ప్రభావం చాలా వరకు తగ్గినా కూడా తాను రాజకీయాల్లోకి రాబోనన్న ప్రకటనతో ఆగ్రహంతో ఉన్న అభిమానులకు భయపడే రజినీ బయటికి రావట్లేదని భావించారు.
ఐతే దీపావళికి ‘అన్నాత్తె’ రిలీజ్ అని ప్రకటించేసిన నేపథ్యంలో రజినీ ఇంకెన్నో రోజులు ఇంటికి పరిమితం అయ్యే పరిస్థితి లేదు. అందుకే ఆయన బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. నేరుగా షూటింగ్కు వెళ్లకుండా, అలాగని అభిమానులను నేరుగా కలవకుండా వారికి తన దర్శనం కల్పించాలని అనుకున్నారు. ఇందుకు ఇళయరాజా కొత్త స్టూడియో ఆరంభం ఆయనకు ఉపయోగపడింది. చెన్నైలో ఇన్నాళ్లూ రికార్డింగ్స్ జరుపుకున్న స్టూడియో యాజమాన్యంతో గొడవ నేపథ్యంలో ఇళయరాజా.. ఆ వివాదానికి తెరదించుతూ కొత్తగా స్టూడియో కట్టుకున్నారు. దాన్ని ఇటీవలే ఆరంభించారు. దాని గురించి రజినీకి కూడా సమాచారం ఇచ్చారు. ఆ స్టూడియో చూసేందుకు రజినీ వచ్చారు.
కరోనా జాగ్రత్తలు మరిచిపోకుండా మాస్క్ ధరించి ఆయన ఇళయరాజా స్టూడియోలో అడుగు పెట్టారు. స్టూడియో అంతా కలియ తిరిగారు. ఇసై జ్ఞాని పాటల రికార్డింగ్ను దగ్గరుండి చూశారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాకు చేరేలా చూసినట్లున్నారు రజినీ. రాజకీయం విషయమై నిరాశతో ఉన్నప్పటికీ రజినీ మళ్లీ ఇలా కనిపించడం మెజారిటీ అభిమానులను సంతోషపరుస్తోంది.
This post was last modified on February 17, 2021 5:40 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…