Movie News

‘రాధేశ్యామ్’పై ఏమంటున్నారు?

ఎదురు చూపులకు తెరదించుతూ ‘రాధేశ్యామ్’ గ్లింప్స్‌తో ప్రభాస్ అభిమానులను పలకరించింది చిత్ర బృందం. ఈ సందర్భంగానే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఐతే మినీ టీజర్‌ లాగా కనిపించిన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలకు తగ్గట్లు లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా మన వాళ్ల సంగతేమో కానీ.. ప్రభాస్ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ ఈ టీజర్ పట్ల తీవ్ర నిరాశ, విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

‘రాధేశ్యామ్’ పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలు ముందు నుంచి అందుతున్నప్పటికీ టీజర్ మరీ క్లాస్‌‌గా ఉండటం, ప్రభాస్ నుంచి ఆశించే మాస్ అంశాలు లేకపోవడం పట్ల నార్త్ ఇండియాలో ప్రధానంగా అతడికి ఫాలోయింగ్ ఉన్న మాస్ వర్గాల్లో సినిమా పట్ల నిరాసక్తత వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక లవ్ స్టోరీలను ఇష్టపడేవాళ్లను సైతం ఈ ఫస్ట్ గ్లింప్స్ ఏమంత ఎగ్జైట్ చేయలేదు.

ఏదో ఆశిస్తే మరీ సింపుల్‌గా తేల్చేశారనే అభిప్రాయాలు మెజారిటీ ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ ఏమంత గొప్పగా లేదు. ఇక అతడికి రాసిన డైలాగ్ కూడా సాధారణంగా అనిపించింది. విజువల్‌గా, ఆర్ఆర్ పరంగానూ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఓవరాల్‌గా ‘రాధేశ్యామ్’ సినిమా స్థాయికి తగ్గ ఫస్ట్ గ్లింప్స్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు ఊరించి, హైప్ ఇవ్వడం దేనికన్న కౌంటర్లు పడుతున్నాయి.

ముఖ్యంగా ఇతర భాషల వాళ్లే ఈ టీజర్‌ను ఎక్కువగా విమర్శిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం కొందరు ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ పట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌తో ఇంప్రెషన్ మార్చకుంటే సినిమాకు ఆశించిన హైప్ రాదని వారు అభిప్రాయపడుతున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణం రాజుతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on February 14, 2021 8:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ 22 : రంగం సిద్ధం

పుష్ప 2 ది రూల్ తో ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు రంగం…

43 minutes ago

మొదటి పరీక్షలో బుచ్చిబాబు మార్కులెన్ని

ఒక చిన్న టీజర్ కోసం ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూడటం మెగా ఫ్యాన్స్ కు పెద్ది విషయంలోనే జరిగింది. కొత్త…

2 hours ago

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల…

2 hours ago

కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…

2 hours ago

హ్యాండ్సప్!.. అమెరికా రోడ్డెక్కిన జనం!

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……

2 hours ago