ఎదురు చూపులకు తెరదించుతూ ‘రాధేశ్యామ్’ గ్లింప్స్తో ప్రభాస్ అభిమానులను పలకరించింది చిత్ర బృందం. ఈ సందర్భంగానే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఐతే మినీ టీజర్ లాగా కనిపించిన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలకు తగ్గట్లు లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా మన వాళ్ల సంగతేమో కానీ.. ప్రభాస్ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ ఈ టీజర్ పట్ల తీవ్ర నిరాశ, విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
‘రాధేశ్యామ్’ పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలు ముందు నుంచి అందుతున్నప్పటికీ టీజర్ మరీ క్లాస్గా ఉండటం, ప్రభాస్ నుంచి ఆశించే మాస్ అంశాలు లేకపోవడం పట్ల నార్త్ ఇండియాలో ప్రధానంగా అతడికి ఫాలోయింగ్ ఉన్న మాస్ వర్గాల్లో సినిమా పట్ల నిరాసక్తత వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక లవ్ స్టోరీలను ఇష్టపడేవాళ్లను సైతం ఈ ఫస్ట్ గ్లింప్స్ ఏమంత ఎగ్జైట్ చేయలేదు.
ఏదో ఆశిస్తే మరీ సింపుల్గా తేల్చేశారనే అభిప్రాయాలు మెజారిటీ ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ గ్లింప్స్లో ప్రభాస్ లుక్ ఏమంత గొప్పగా లేదు. ఇక అతడికి రాసిన డైలాగ్ కూడా సాధారణంగా అనిపించింది. విజువల్గా, ఆర్ఆర్ పరంగానూ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఓవరాల్గా ‘రాధేశ్యామ్’ సినిమా స్థాయికి తగ్గ ఫస్ట్ గ్లింప్స్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు ఊరించి, హైప్ ఇవ్వడం దేనికన్న కౌంటర్లు పడుతున్నాయి.
ముఖ్యంగా ఇతర భాషల వాళ్లే ఈ టీజర్ను ఎక్కువగా విమర్శిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం కొందరు ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ పట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్తో ఇంప్రెషన్ మార్చకుంటే సినిమాకు ఆశించిన హైప్ రాదని వారు అభిప్రాయపడుతున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణం రాజుతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…