‘ఉప్పెన’ చిత్రానికి పట్టిన గ్రహణం ఇంకో మూడు రోజుల్లోనే వీడబోతోంది. గత ఏడాది ఏప్రిల్ 2న రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడటం.. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నా మంచి టైమింగ్ కోసం ఎదురు చూడటం.. ఈ క్రమంలో పది నెలలకు పైగా కాలం గడిచిపోవడం తెలిసిందే. ఎట్టకేలకు వేలెంటైన్స్ డే వీకెండ్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు అనుకున్న దాని కంటే మంచి హైపే వచ్చింది. కొత్త దర్శకుడితో కొత్త నటీనటులు చేసిన ఓ చిత్రానికి ఇలాంటి హైప్ రావడం ఆనందమే.. కానీ అంచనాలు మరీ ఎక్కువైపోతే వాటిని అందుకోవడమూ సవాలే.
కాగా ఈ సినిమాలో ఒక షాకింగ్ పాయింట్ ఉందని ముందు నుంచి చర్చ జరుగుతోంది. మొన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి సైతం ‘డేంజర్ పాయింట్’ అంటూ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ డేంజర్ పాయింట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లోనే కాదు.. సోషల్ మీడియాలో సైతం గట్టి ప్రచారమే జరుగుతోంది.
మొన్నటి దాకా సీక్రెట్లా ఉన్నది ఇప్పుడు అందరి చర్చల్లోకి వచ్చేసింది. తన కూతురిని ఒక పేదింటి కుర్రాడు ప్రేమించడం ఇష్టం లేని విలన్.. అతను సంసారానికి పనికి రాకుండా చేయడమే ఇందులోని షాకింగ్ పాయింట్. దీని గురించి కొంచెం పచ్చిగానే సినిమాలో చూపించారని తెలుస్తోంది. ఈ పాయింట్ జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమే. ఒక కొత్త హీరోను డెబ్యూ సినిమాలో ఇలా చూపించడం షాకింగే. అందుకు ఒప్పుకున్న వైష్ణవ్ తేజ్కు, మెగా ఫ్యామిలీకి అభినందనలు చెప్పాల్సిందే.
ఐతే సినిమాలో ఈ పాయింట్ చూసి ప్రేక్షకులు షాకవడం ఖాయం. దీన్ని జీర్ణించుకోలేకపోతే సినిమా తేడా కొట్టొచ్చు కూడా. ఈ భయంతోనే చిత్ర బృందమే ఈ పాయింట్ను లీక్ చేసిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీని గురించి ఓ చర్చ జరిగి ముందే జనాలు ప్రిపేర్డ్గా ఉంటే తెరపై ఏం జరిగినా షాకవ్వరు. సస్పెన్స్లా దాచి ఉంచడం వల్ల ఏదైనా తేడా కొట్టినా కొట్టొచ్చని ముందే ప్రేక్షకులను ప్రిపేర్ చేశారేమో అనిపిస్తోంది. మరి సినిమాలో ఈ పాయింట్ పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…