మెగాస్టార్ చిరంజీవి వేదికల మీదికెక్కి మైక్ అందుకున్నాడంటే చాలు.. ఒక పట్టాన పట్టాన ప్రసంగాలు ముగించట్లేదు ఈ మధ్య. ముఖ్యంగా ఏదైనా సినిమా వేడుకకు వచ్చారంటే చిరు సుదీర్ఘ ప్రసంగాలు చేసేస్తున్నారు. అలాగని ఆయన ప్రసంగాలేమీ బోర్ కొట్టట్లేదు. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తన అనుభవాన్ని రంగరించి కొన్ని మంచి విషయాలు కూడా చెబుతున్నారు. ఇండస్ట్రీ జనాలను ఆలోచనలో పడేస్తున్నారు.
తాజాగా ‘ఉప్పెన’ ఆడియో వేడుకలోనూ చిరు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన ఈ విషయంపై టాలీవుడ్ సీరియస్గా దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘ఉప్పెన’ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కడం గురించి ఆయన మాట్లాడారు. ఇలాంటి సినిమాలు తెలుగులో అరుదైపోతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఒకప్పుడు తమిళ దర్శకుడు భారతీ రాజా పల్లెటూరి నేపథ్యంలో రస్టిక్గా ఉండే లవ్ స్టోరీలు తీసేవారని.. అవి చాలా గొప్పగా ఉండేవని.. వాటిలో ఆత్మ ఉండేదని.. ఇప్పుడు తెలుగులో ఇలాంటి సినిమాలు కరువైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రంగస్థలం’ తర్వాత ‘ఉప్పెన’లో ఆ ఫ్లేవర్ కనిపించిందని.. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మోడర్న్ సినిమా పేరుతో ఇప్పటి రచయితలు, దర్శకులు ఎంతసేపూ సిటీల చుట్టూనే తిరుగుతున్నారని, ఈ క్రమంలో మన మట్టి సినిమాలు మిస్ అయిపోతున్నామని చిరు అన్నారు.
ఆలోచించి చూస్తే చిరు చెప్పినది ఎంతో కీలకమైన విషయం అని అర్థమవుతోంది. ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పల్లెటూరి సినిమాలే వచ్చేవి. 80లు, 90ల్లోనూ ఆ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో మన నేటివిటీ కనిపించేది. తెలుగుదనం ఉట్టి పడేది. అవి మంచి విజయం సాధించాయి. కానీ 2000 తర్వాత మోడర్న్ సినిమాల పేరుతూ అందరూ సిటీల చుట్టూనే తిరగడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అవి మూసలా తయారయ్యాయి. పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు అరుదైపోయాయి. కొన్నేళ్ల కిందట ‘రంగస్థలం’ సినిమా వస్తే అది కొత్తగా అనిపించడమే కాక, మన సినిమా అనే ఫీలింగ్ కలిగింది. ఈ నేపథ్యంలో చిరు చెప్పిన విషయాన్ని సీరియస్గా ఆలోచించిన మన రచయితలు, దర్శకులు గ్రామీణ నేపథ్యంలో మనవైన కథలతో సినిమాలు తీస్తే బెటర్.
This post was last modified on February 8, 2021 11:23 am
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…