మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఈ బేనర్ చుట్టూనే తిరుగుతోంది. తెలుగులో ప్రస్తుతం ఈ సంస్థ ఉన్నంత దూకుడు మీద, అంత బిజీగా మరే బేనర్ కూడా లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి బేనర్లు కూడా జోరుగా సినిమాలు నిర్మిస్తున్నాయి. భారీ చిత్రాలను లైన్లో పెట్టాయి. కానీ మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ దూకుడు ముందు అవి వెనుకే ఉంటాయి.
ఇటు స్టార్ హీరోలు, అటు స్టార్ డైరెక్టర్లలో మెజారిటీకి మైత్రీతో కమిట్మెంట్లున్నాయి. ఓవైపు మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ.. మరోవైపు పవర్ స్టార్తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దానికి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో ఓ సినిమాను దక్కించుకుంది మైత్రీ. ఈ సినిమా గురించి ‘ఉప్పెన’ ఆడియో వేడుకలో చిరునే స్వయంగా వెల్లడించాడు.
ఇప్పటికే రామ్ చరణ్తో ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ.. జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా కమిట్మెంట్ తీసుకుంది. కొంచెం ఆలస్యం అయితే కావచ్చు కానీ.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్లో ఓ సినిమాను మైత్రీ ప్రొడ్యూస్ చేయడం ఖాయం. అల్లు అర్జున్, సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ను నిర్మిస్తున్నదీ మైత్రీనే అన్న సంగతి తెలిసిందే. తాజాగా ‘క్రాక్’తో బ్లాక్బస్టర్ అందుకున్న గోపీచంద్నూ తమతో సినిమాకు కమిట్ చేయించింది మైత్రీ.
గోపీచంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘క్రాక్’ సీక్వెల్ను ఈ సంస్థ నిర్మించే అవకాశాలున్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ‘అనిమల్’ తీశాక మైత్రీలోనే ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించొచ్చని అంటున్నారు. ఇంకా మరిందరు టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకుల నుంచి కమిట్మెంట్లు తీసుకున్న మైత్రీ.. రాబోయే మూణ్నాలుగేళ్లలో తిరుగులేని స్థాయిని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on February 7, 2021 6:01 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…