Kangana Ranaut
కంగనా రనౌత్ ఇప్పుడు బాలీవుడ్లో సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తోంది. ఆమెకంటూ అక్కడ వర్గం తయారైంది. ఆ వర్గంలోని వాళ్లు మాత్రమే ఆమెతో సినిమాలు చేస్తారు. మిగతా వాళ్లందరూ ఆమెకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్లో టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు చాలా వరకు కంగనాకు దూరమే. ఎందుకంటే ఆమెతో పని చేస్తే ఎప్పుడే వివాదంలో చిక్కుకుంటామో.. తమ మీద ఏం ఆరోపణలు చేస్తుందో తెలియని పరిస్థితి.
హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆలియా భట్, మహేష్ భట్.. ఇలా కంగనా నుంచి తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ సెలబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్య అయితే పరోక్షంగా రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టేసిన కంగనా కోరి వివాదాలు తెచ్చుకుంటోంది. ఫైర్ బ్రాండ్ అన్న గుర్తింపు ఏమో కానీ.. ఇంతటి వివాదాస్పద వ్యక్తితో తమకెందుకు అన్నట్లు ఇటు ఫీచర్ ఫిలిం మేకర్లే కాదు.. యాడ్ ఫిలిం మేకర్లు కూడా దండం పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది.
తన మీద అడ్వర్టైజ్మెంట్ రంగంలోనూ ఒక రకమైన వివక్ష నడుస్తోందని.. తాను వద్దనుకున్న బ్రాండ్లు చాలానే ఉండగా, తన చేతిలో ఉన్న బ్రాండ్లు కూడా చేజారి పోతున్నాయని కంగనా తాజాగా వ్యాఖ్యానించింది. తాను మామూలుగానే ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ చేయనని, కోట్లు ఆఫర్ చేసినా వాటిని తిరస్కరించానని.. ఇక సినిమాల్లో ఐటెం సాంగ్స్కు తాను దూరమని, వేరే షోస్ కూడా ఏవీ చేయనని కంగనా చెప్పుకొచ్చింది.
అలాగే పెద్ద హీరోలతోనూ తాను సినిమాలు చేయట్లేదని.. ఇంతకుముందు తనతో కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని, వాటిని తర్వాత రద్దు చేసుకున్నాయని.. ప్రస్తుతం తన చేతిలో ఒక్క బ్రాండ్ కూడా లేదని కంగనా చెప్పింది. దీని వల్ల తాను చాలా ఆదాయం కోల్పోయానని.. అయినా అధైర్య పడలేదని.. తనకు ఉన్న దాంట్లో ఇప్పటికీ చాలామందికి సాయం చేస్తూ వెళ్తున్నానని.. దాని ద్వారా తనకు దక్కే ఆనందమే వేరని కంగనా వ్యాఖ్యానించింది.
This post was last modified on February 7, 2021 8:04 am
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…