కంగనా రనౌత్ ఇప్పుడు బాలీవుడ్లో సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తోంది. ఆమెకంటూ అక్కడ వర్గం తయారైంది. ఆ వర్గంలోని వాళ్లు మాత్రమే ఆమెతో సినిమాలు చేస్తారు. మిగతా వాళ్లందరూ ఆమెకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్లో టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు చాలా వరకు కంగనాకు దూరమే. ఎందుకంటే ఆమెతో పని చేస్తే ఎప్పుడే వివాదంలో చిక్కుకుంటామో.. తమ మీద ఏం ఆరోపణలు చేస్తుందో తెలియని పరిస్థితి.
హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆలియా భట్, మహేష్ భట్.. ఇలా కంగనా నుంచి తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ సెలబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్య అయితే పరోక్షంగా రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టేసిన కంగనా కోరి వివాదాలు తెచ్చుకుంటోంది. ఫైర్ బ్రాండ్ అన్న గుర్తింపు ఏమో కానీ.. ఇంతటి వివాదాస్పద వ్యక్తితో తమకెందుకు అన్నట్లు ఇటు ఫీచర్ ఫిలిం మేకర్లే కాదు.. యాడ్ ఫిలిం మేకర్లు కూడా దండం పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది.
తన మీద అడ్వర్టైజ్మెంట్ రంగంలోనూ ఒక రకమైన వివక్ష నడుస్తోందని.. తాను వద్దనుకున్న బ్రాండ్లు చాలానే ఉండగా, తన చేతిలో ఉన్న బ్రాండ్లు కూడా చేజారి పోతున్నాయని కంగనా తాజాగా వ్యాఖ్యానించింది. తాను మామూలుగానే ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ చేయనని, కోట్లు ఆఫర్ చేసినా వాటిని తిరస్కరించానని.. ఇక సినిమాల్లో ఐటెం సాంగ్స్కు తాను దూరమని, వేరే షోస్ కూడా ఏవీ చేయనని కంగనా చెప్పుకొచ్చింది.
అలాగే పెద్ద హీరోలతోనూ తాను సినిమాలు చేయట్లేదని.. ఇంతకుముందు తనతో కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని, వాటిని తర్వాత రద్దు చేసుకున్నాయని.. ప్రస్తుతం తన చేతిలో ఒక్క బ్రాండ్ కూడా లేదని కంగనా చెప్పింది. దీని వల్ల తాను చాలా ఆదాయం కోల్పోయానని.. అయినా అధైర్య పడలేదని.. తనకు ఉన్న దాంట్లో ఇప్పటికీ చాలామందికి సాయం చేస్తూ వెళ్తున్నానని.. దాని ద్వారా తనకు దక్కే ఆనందమే వేరని కంగనా వ్యాఖ్యానించింది.
This post was last modified on February 7, 2021 8:04 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…