సంక్రాంతికి సినిమాను అనౌన్స్ చేసి.. మూడు వారాలు తిరక్కుండానే ట్రైలర్ రిలీజ్ చేసి పెద్ద షాకే ఇచ్చింది ‘పవర్ ప్లే’ టీమ్. రాజ్ తరుణ్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’; ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాల దర్శకుడు విజయ్ కుమార్ రూపొందించిన థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ లుక్ చూసినప్పుడే ఇది సీరియస్ థ్రిల్లర్ మూవీ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు ట్రైలర్ కూడా సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లే సాగింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ట్రైలర్లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం గమనార్హం.
డైలాగ్స్ లేకపోవడం వల్ల కథేంటన్నది అర్థం కాలేదు కానీ.. ఇది వయొలెన్స్తో ముడిపడ్డ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనేది మాత్రం అర్థమవుతోంది. ట్రైలర్ ఆరంభం నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగానే సాగింది. ట్రైలర్ అంతా కూడా హీరో ఉరుకులు పరుగుల మీదే కనిపించాడు.
ట్రైలర్ ఆరంభంలోనే ఒక హత్యకు సంబంధించి క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్న షాట్ పడింది. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీ పోస్టర్, ఏటీఎం, డబ్బులు, పబ్, పోలీసు వాహనాలకు సంబంధించిన షాట్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. ఇది ఒక క్రైమ్ చుట్టూ నడిచే కథ అన్న క్లారిటీ చాలా త్వరగానే వచ్చేస్తుంది.
రాజ్ తరుణ్ కొంచెం భిన్నమైన లుక్లో కనిపించాడు. హేమల్ అనే కొత్తమ్మాయి అతడికి జోడీగా నటించింది. తనతో ఒక హాట్ లిప్ లాక్ కూడా చేశాడు రాజ్. హీరోయిన్ని మించి ఇందులో పూర్ణది కీలక పాత్రలా కనిపిస్తోంది. ట్రైలర్లో ఆమె బాగానే హైలైట్ అయింది. కోట శ్రీనివాసరావు పొలిటీషియన్గా, మధునందన్ పోలీసుగా దర్శనమిచ్చారు. అజయ్ కీలక పాత్రే చేసినట్లు కనిపిస్తున్నాడు. నంద్యాల రవి ఈ చిత్రానికి కథ అందించగా.. మహిధర్, దేవేష్ అనే కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేశారు. త్వరలోనే ‘పవర్ ప్లే’ రిలీజ్ అంటున్నారు కానీ.. థియేటర్లలోనా, ఓటీటీలోనా అన్నదే చెప్పట్లేదు. ఏదో ఒక ఓటీటీలోనే సినిమా రిలీజవుతుందని తెలుస్తోంది.
This post was last modified on February 4, 2021 3:59 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…