ఈ తరం తెలుగు ప్రేక్షకులకు నమిత గురించి పెద్దగా తెలియదు కానీ.. 2000-2010 మధ్య ఆమె దక్షిణాదిన పెద్ద సెన్సేషన్. తెలుగులో ‘సొంతం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ఉత్తరాది భామ.. విక్టరీ వెంకటేష్ సరసన ‘జెమిని’తో పాటు బాలయ్యతో ‘సింహా’లోనూ నటించింది. మరికొందరు స్టార్లతోనూ జోడీ కట్టింది.
ఐతే మొదట్లో మామూలుగానే కనిపించింది కానీ.. తమిళంలోకి అడుగు పెట్టాక మాత్రం ఆమె రూటు మార్చేసింది. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే భారీగా తయారైన నమిత.. కొన్ని సినిమాల్లో వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేసి షాకిచ్చింది. ఆమె భారీ అందాలు తమిళ అభిమానులకు మత్తెక్కించాయి. ఐతే ఒక దశ దాటాక నమిత మరీ బరువెక్కిపోయి చూడ్డానికి ఎబ్బెట్టుగా తయారైంది. ఆమె మద్యం, సిగరెట్కు బానిస అయిపోయిందని.. ఈ క్రమంలోనే బరువు విపరీతంగా పెరిగిపోయాయని వార్తలొచ్చాయి. ఇలా ఉండగానే నమిత పెళ్లి కూడా చేసుకుంది.
ఆ తర్వాత వార్తల్లో లేకుండా పోయిన నమిత.. ఇటీవల ఉన్నట్లుండి బాగా బరువు తగ్గి హీరోయిన్ అయిన కొత్తలో మాదిరి తయారై షాకిచ్చింది. బాగా బరువు తగ్గిన నమిత జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియో కూడా ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడిన నమిత.. తన గురించి ఒక సమయంలో విపరీతమైన దుష్ప్రచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బరువు పెరగడానికి అందరూ అనుకున్నట్లు సిగరెట్, మద్యం లాంటి దురలవాట్లు కారణం కాదని ఆమె చెప్పింది. తనకు అలాంటి అలవాట్లు లేవంది.
తాను డిప్రెషన్ కారణంగా ఐదున్నరేళ్ల పాటు నరకం చూశానని చెప్పింది. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, బాగా నిద్ర పోవడం కోసం అతిగా తినేసేదాన్నని, జంక్ ఫుడ్ బాగా అలవాటైందని, అలాగే థైరాయిడ్ సమస్య కూడా ఉండటంతో తన బరువు అదుపు తప్పిందని నమిత చెప్పింది. ఇవన్నీ తెలియక తన గురించి తప్పుడు ప్రచారాలు చేశారని నమిత వాపోయింది. ఇప్పుడు తన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోయాయని, కష్టపడి వర్కవుట్లు చేసి మునుపటి షేప్లోకి వచ్చానని ఆమె వెల్లడించింది.
This post was last modified on February 3, 2021 4:02 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…