Movie News

సినిమా రిలీజ్‌పై నిర్మాత‌ల‌తో హీరోకు గొడ‌వ‌?


త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన జ‌గ‌మే తంత్రం సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నార‌ని, నెట్‌ఫ్లిక్స్ వాళ్ల‌తో డీల్ ఓకే అయిపోయింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ధ‌నుష్ అభిమానులకు ఎంత‌మాత్రం రుచించ‌డం లేదు. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాలంటూ వాళ్లు గొడ‌వ గొడ‌వ చేస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింట్లోనూ వారి ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఐతే దీనిపై చిత్ర బృందం నుంచి ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌ట్లేదు కొన్ని రోజులుగా.

ఓటీటీ రిలీజ్ ప్ర‌చారాన్ని ఖండించ‌ట్లేదంటే జ‌గ‌మేతంత్రం థియేట‌ర్ల‌లో రాద‌ని అంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అదే స‌మ‌యంలో ధ‌నుష్ న‌టించిన మ‌రో సినిమా క‌ర్ణ‌న్‌ను ఏప్రిల్లో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వ‌చ్చిన ప్ర‌క‌ట‌న అభిమానుల‌కు మ‌రింత ఆగ్ర‌హం తెప్పించింది. జ‌గ‌మే తంత్రంను మాత్రం ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు మ‌రింత‌గా ఉత్ప‌న్న‌మ‌య్యాయి.


ఇలాంటి స‌మ‌యంలో ధ‌నుష్ ట్విట్ట‌ర్లోకి వ‌చ్చి జ‌గ‌మే తంత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు, త‌న శ్రేయోభిలాషులు, అభిమానుల్లాగే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల‌ని తాను కూడా కోరుకుంటున్నాన‌ని, అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆశిద్దామ‌ని ఒక ట్వీట్ వేసి వెళ్లిపోయాడు. ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటో చాలామందికి అర్థం కాలేదు.

ఐతే ధ‌నుష్ అభీష్టానికి వ్య‌తిరేకంగా నిర్మాత జ‌గ‌మే తంత్రం సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఒప్పందం చేసుకున్నాడ‌ని, ఈ విష‌యంలో నిర్మాణ సంస్థ వైనాట్ స్టూడియోస్ అధినేత శ‌శికాంత్‌కు, ధ‌నుష్‌కు విభేదాలు నెల‌కొన్నాయ‌ని కోలీవుడ్లో ప్ర‌చారం సాగుతోంది. త‌న సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డంలో త‌న త‌ప్పేమీ లేద‌ని, తాను కూడా థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల‌నే కోరుకుంటున్నాన‌ని అభిమానుల‌కు చెప్ప‌డం కోసం ధ‌నుష్ ఈ ట్వీట్ చేసిన‌ట్లుంది కానీ.. ఇది నిర్మాత‌ను ఇరికించేదే. ఈ నేప‌థ్యంలో సినిమా విడుద‌ల విష‌యంలో నిర్మాత నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందో?

This post was last modified on February 3, 2021 11:01 am

Share

Recent Posts

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

42 minutes ago

భారత్‌పై 100 శాతం టారిఫ్.. ఇప్పుడు ట్రంప్ చేతిలోనే!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు అమెరికా నుంచి మరో టారిఫ్ ముప్పు దగ్గరైంది. రష్యాపై మరింత ఆర్థిక…

45 minutes ago

సుబ్బులక్ష్మిని తలచుకుని నిర్మలమ్మ కంటతడి

ప్రముఖ కర్ణాటక సంగీత విదుషి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి స్మారక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భావోద్వేగానికి గురయ్యారు.…

1 hour ago

500 కోట్ల.. శ్రీదేవి ఆస్తి వివాదం.. చివ‌ర‌కు ఏమైదంటే!

ఆలిండియా నెంబ‌ర్ 1 హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీదేవికి చెందిన భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ…

4 hours ago

కుటుంబాన్ని పోషించుకోలేక‌పోతున్నా.. ఐబొమ్మ ర‌వి ఆవేద‌న‌

ఐ బొమ్మ ర‌వి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమాల‌ను ఫాలో అయ్యే వాళ్లంద‌రికీ ఈ పేరు ప‌రిచ‌య‌మే.…

6 hours ago

తిరుమల వెళ్తున్నారా? ఇది మాత్రం మిస్ అవ్వకండి!

తిరుమ‌ల తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేవారికి శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం.. మొక్కులు చెల్లించుకోవ‌డం.. స్వామి వారి ప్ర‌సాదాన్ని స్వీక‌రించ‌డం గొప్ప అనుభూతి. శ్రీవారిని…

10 hours ago