Movie News

సినిమా రిలీజ్‌పై నిర్మాత‌ల‌తో హీరోకు గొడ‌వ‌?


త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన జ‌గ‌మే తంత్రం సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నార‌ని, నెట్‌ఫ్లిక్స్ వాళ్ల‌తో డీల్ ఓకే అయిపోయింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ధ‌నుష్ అభిమానులకు ఎంత‌మాత్రం రుచించ‌డం లేదు. ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేయాలంటూ వాళ్లు గొడ‌వ గొడ‌వ చేస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింట్లోనూ వారి ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఐతే దీనిపై చిత్ర బృందం నుంచి ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌ట్లేదు కొన్ని రోజులుగా.

ఓటీటీ రిలీజ్ ప్ర‌చారాన్ని ఖండించ‌ట్లేదంటే జ‌గ‌మేతంత్రం థియేట‌ర్ల‌లో రాద‌ని అంతా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అదే స‌మ‌యంలో ధ‌నుష్ న‌టించిన మ‌రో సినిమా క‌ర్ణ‌న్‌ను ఏప్రిల్లో థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వ‌చ్చిన ప్ర‌క‌ట‌న అభిమానుల‌కు మ‌రింత ఆగ్ర‌హం తెప్పించింది. జ‌గ‌మే తంత్రంను మాత్రం ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు మ‌రింత‌గా ఉత్ప‌న్న‌మ‌య్యాయి.


ఇలాంటి స‌మ‌యంలో ధ‌నుష్ ట్విట్ట‌ర్లోకి వ‌చ్చి జ‌గ‌మే తంత్రం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు, త‌న శ్రేయోభిలాషులు, అభిమానుల్లాగే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల‌ని తాను కూడా కోరుకుంటున్నాన‌ని, అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆశిద్దామ‌ని ఒక ట్వీట్ వేసి వెళ్లిపోయాడు. ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటో చాలామందికి అర్థం కాలేదు.

ఐతే ధ‌నుష్ అభీష్టానికి వ్య‌తిరేకంగా నిర్మాత జ‌గ‌మే తంత్రం సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఒప్పందం చేసుకున్నాడ‌ని, ఈ విష‌యంలో నిర్మాణ సంస్థ వైనాట్ స్టూడియోస్ అధినేత శ‌శికాంత్‌కు, ధ‌నుష్‌కు విభేదాలు నెల‌కొన్నాయ‌ని కోలీవుడ్లో ప్ర‌చారం సాగుతోంది. త‌న సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డంలో త‌న త‌ప్పేమీ లేద‌ని, తాను కూడా థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల‌నే కోరుకుంటున్నాన‌ని అభిమానుల‌కు చెప్ప‌డం కోసం ధ‌నుష్ ఈ ట్వీట్ చేసిన‌ట్లుంది కానీ.. ఇది నిర్మాత‌ను ఇరికించేదే. ఈ నేప‌థ్యంలో సినిమా విడుద‌ల విష‌యంలో నిర్మాత నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందో?

This post was last modified on February 3, 2021 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago