ఏదో పూనకం వచ్చినట్లుగా వరుసబెట్టి కొత్త సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించారు టాలీవుడ్ నిర్మాతలు. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా రోజుకు ఐదారు చెప్పొను వరుసబెట్టి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో 25కు పైగానే కొత్త సినిమాల రిలీజ్ డేట్లు వెల్లడయ్యాయి. ఈ మ్యాడ్ రష్ ఏంటి బాబోయ్ అన్నట్లు ఆశ్చర్యపోయి చూశారు ప్రేక్షకులు.
ఒకరిని చూసి ఒకరు, ఆలస్యమైతే ఎక్కడ బెర్తు దొరకదో అన్నట్లు ప్రకటనలు ఇచ్చేశారు. వీరిలో చాలామందికి తమ సినిమాలను ఆ తేదీకి విడుదల చేస్తామన్న కాన్ఫిడెన్స్ లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయినా సరే.. కర్చీఫ్ వేసి పెడితే పోయేదేముంది అన్నట్లు డేట్లు ప్రకటించేశారు. వేరే నిర్మాతలతో సంప్రదింపులు లేకుండా ఎవరికి వాళ్లు డేట్లు ఇచ్చేయడంతో కొన్ని పేరున్న సినిమాల మధ్య క్లాష్ అనివార్యం అయింది. ఇది మంచి సంప్రదాయం కాదని, దీని వల్ల ఎవరికీ మంచి కాదని ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.
హడావుడిగా డేట్లు ప్రకటించేశాక ఇప్పుడు తీరిగ్గా తప్పొప్పులు, ప్రతికూల పరిణామాల గురించి చర్చిస్తున్నారట టాలీవుడ్ నిర్మాతలు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతుండటంతో రిలీజ్ డేట్ల రీషెడ్యూల్ దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ నాని సినిమా ‘టక్ జగదీష్’ డేట్ మారినట్లు తెలుస్తోంది. ‘లవ్ స్టోరి’ పోటీకి రావడం, ముందు వారం ‘వకీల్ సాబ్’ రాబోతుండటంతో ఏప్రిల్ 16న విడుదల మంచిది కాదని 23వ తేదీకి సినిమాను వాయిదా వేసుకున్నారట. తన సినిమాకు ‘లవ్ స్టోరి’ని పోటీగా నిలపడం మీద ముందు నాని కినుక వహించినప్పటికీ.. వెనక్కి వెళ్లడమే తన సినిమాకు మంచిదని నిర్ణయించుకున్నాడట.
మరోవైపు మే 14న ‘నారప్ప’ రావడమూ డౌటే అంటున్నారు. ‘ఆచార్య’తో పోటీ మంచిది కాదని డిస్ట్రిబ్యూటర్లు గట్టిగా చెప్పడంతో ముందు వారానికి కానీ, తర్వాతి వారానికి కానీ సినిమా రిలీజ్ డేట్ మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అలాగే ఏప్రిల్ 2న రావాల్సిన సీటీ మార్, 30కి అనుకున్న ‘విరాటపర్వం’ డేట్ల మార్పు విషయంలోనూ సమాచాలోచనలు జరుగుతున్నాయట.
This post was last modified on February 2, 2021 3:38 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…