నాలుగేళ్ల కిందట టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందింది రకుల్ ప్రీత్. కానీ తర్వాత రెండేళ్లు గడిచేసరికి ఆమెకు తెలుగులో అవకాశాలు కరువైపోయాయి. వరుస ఫ్లాపుల వల్ల ఆమె డౌన్ అయిపోయింది. ఒక దశలో టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితి వచ్చింది. అలాగని ఆమె కెరీర్ పూర్తిగా ఏమీ పాడైపోలేదు.
తెలుగులో జోరు తగ్గించినా హిందీలో ఆమెకు మంచి మంచి అవకాశాలే వచ్చాయి. అజయ్ దేవగణ్ లాంటి పెద్ద హీరో సరసన చేసిన ‘దే దే ప్యార్ దే’ సినిమా హిట్టయి అక్కడ బిజీ అయ్యేలా చేసింది.
అజయ్ స్వీయ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘మే డే’లో రకులే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అజయ్ నటించబోయే మరో సినిమాలోనూ ఆమె అవకాశం దక్కించుకుంది. ఇవి కాక హిందీలో ఇంకో మూడు సినిమాల్లో నటిస్తోంది రకుల్. తెలుగులోనూ ఆమె ‘చెక్’తో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ రెండు చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి.
ఇప్పుడు హిందీలో ఆమెకు మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కింది.
గత కొన్నేళ్లలో వరుస హిట్లతో స్టార్గా ఎదిగిన ఆయుష్మాన్ ఖురానాతో రకుల్ జోడీ కట్టబోతోంది. అతను హీరోగా ‘డాక్టర్ జి’ సినిమాలో రకుల్ కథానాయికగా నటించనుంది. ఇందులో ఆమె డాక్టర్ ఫాతిమా అనే పాత్రలో కనిపించనుంది. నిజానికి ఈ పాత్రను ‘సూపర్ 30’ భామ మృణాల్ ఠాకూర్ చేయాల్సింది. ఏవో కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత కొన్ని పేర్లను పరిశీలించి రకుల్ను ఓకే చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మించనుంది.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…