Movie News

రాజ‌మౌళిపై బోనీ క‌పూర్ ఇంకాస్త ఘాటుగా..


మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి శ్రీదేవి కుటుంబంతో చిన్న వివాదం ఉన్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగితే ఆమె అల‌విమాలిన డిమాండ్లు చేశార‌ని.. ఒక హోట‌ల్ ఫ్లోర్ మొత్తం త‌మ కోసం బుక్ చేయాల‌ని, త‌న‌తో పాటు వ‌చ్చే టీంకు బిజినెస్ క్లాస్ టికెట్లు ఇవ్వాల‌ని, అలాగే భారీ పారితోష‌కం కూడా డిమాండ్ చేశార‌ని ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి చెప్ప‌డం అప్ప‌ట్లో దుమారం రేపింది. దీనిపై ఆ త‌ర్వాత శ్రీదేవి స్పందించ‌డం, రాజ‌మౌళి వ్యాఖ్య‌ల్ని ఖండిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం తెలిసిన సంగ‌తే. ఈ వివాదాన్ని అంత‌టితో ముగిద్దాం అంటూ తదుప‌రి ఏ వ్యాఖ్య‌లూ చేయ‌లేదు రాజ‌మౌళి. అంత‌టితో ఆ క‌థ ముగిసింది.

కానీ ఇప్పుడు రాజ‌మౌళికి.. శ్రీదేవి భ‌ర్త బోనీ క‌పూర్‌తో అనుకోని వివాదం త‌లెత్తింది. ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మైదాన్ సినిమాను ఆల్రెడీ ద‌స‌రా రోజు రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించ‌గా.. రెండు రోజుల ముందు ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది జ‌క్క‌న్న టీం. దీనిపై ఇప్ప‌టికే బోనీ విమ‌ర్శ‌లు చేశారు. రాజ‌మౌళికి నైతిక‌త లేద‌ని పెద్ద కామెంట్ చేశారు కూడా.

అంత‌టితో ఆగ‌కుండా త‌న భార్యతో రాజ‌మౌళికి ఉన్న పాత వివాదాన్ని బ‌య‌టికి తీశారు బోనీ. శ్రీదేవి అన్ ప్రొఫెష‌న‌ల్ అంటూ అప్ప‌ట్లో రాజ‌మౌళి వ్యాఖ్యానించాడ‌ని.. కానీ నిజానికి రాజ‌మౌళే అన్ ప్రొఫెష‌న‌ల్ అని ఆయ‌న తాజాగా ఓ మీడియా సంస్థ‌తో వ్యాఖ్యానించారు.

అప్ప‌టి వివాదంపై ఆయ‌న స్పందిస్తూ.. రాజ‌మౌళి ముంబయికి వచ్చి శ్రీదేవికి కథ చెప్పారని, కానీ ఆమె అంత ఆసక్తి చూపలేదని, ఐతే త‌నే ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాలను చూపించి.. రాజమౌళి లాంటి అగ్ర ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌మ‌ని సిఫార‌సు చేశాన‌ని బోనీ వెల్ల‌డించాడు. దీంతో సినిమా చేయ‌డానికి సుముఖ‌త వ్య‌క్తం చేసిన శ్రీదేవి.. తొలి న‌రేష‌న్ త‌ర్వాత కొన్ని ఇన్‌పుట్స్ కూడా ఇచ్చార‌ని.. అవి రాజ‌మౌళికి కూడా న‌చ్చాయ‌ని, త‌న అభిమానిగా ఆమెపై ఇంకా గౌర‌వం పెరిగింద‌ని చెప్పాడ‌ని.. అందుకే శ్రీదేవి ఆ సినిమా చేయ‌లేద‌ని బోనీ అన్నారు. అప్పుడు ఆ విష‌యం గురించి తాము ఏమీ మాట్లాడ‌లేద‌ని.. కానీ ఇప్పుడు ఆలోచిస్తే రాజమౌళి టోటల్లీ అన్‌ప్రొఫెషనల్‌ అని.. సీనియర్ల పట్ల గౌరవం లేదని అనిపిస్తోందని బోనీ వ్యాఖ్యానించాడు.

This post was last modified on February 1, 2021 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago