భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఒరిజినల్స్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. మన ఆడియన్స్ను ఓటీటీల వైపు మళ్లించిన సిరీస్ల్లో కూడా ఇదొకటిగా చెప్పుకోవాలి. ఈ సిరీస్ చూసేందుకే ఎంతోమంది అమేజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. తెలుగు వాళ్లే అయిన రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్లో మనోజ్ బాజ్పేయి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ప్రియమణి కూడా ఆకట్టుకుంది. ఇక టెర్రరిస్టుల ఆపరేషన్లు.. వాటిని అడ్డుకుంనేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పడే కష్టాల నేపథ్యంలో సాగే కథాకథనాలు ఉత్కంఠభరితంగా సాగి ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించింది.
తొలి సీజన్ విడుదలైన ఏడాదిన్నర తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్ విడుదలకు ముహూర్తం చూసుకుంది అమేజాన్ ప్రైమ్. కరోనా విరామం వల్ల రెండో సీజన్ ఆలస్యం కాగా.. ఫిబ్రవరి 12న దీని ప్రిమియర్స్ వేయాలని నిర్ణయించారు. ట్రైలర్కు కూడా రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ సిరీస్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. కానీ వారి ఉత్సాహానికి బ్రేకులు వేస్తూ ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది అమేజాన్ ప్రైమ్. వాయిదా అంటే ఒక డేట్ నుంచి మరో డేట్కు మార్చడం కాదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నారట. విడుదలపై స్పష్టత లేదట. ఇప్పుడిప్పుడే ఈ సిరీస్ రిలీజ్ కాదట.
అమేజాన్ ప్రైమ్ గత కొన్ని నెలల్లో రిలీజ్ చేసిన మీర్జాపూర్-2, తాండవ్ సిరీస్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉత్తరప్రదేశ్ను చాలా చెడుగా చూపించారని ‘మీర్జాపూర్-2’ మీద, హిందువుల సెంటిమెంట్లు దెబ్బ తీసేలా దేవుళ్లను తప్పుగా చిత్రీకరించారని ‘తాండవ్’ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేసులు కూడా పెట్టారు. కోర్టులు కూడా అమేజాన్ ప్రైమ్, ఆయా సిరీస్ మేకర్స్ మీద సీరియస్ అయ్యాయి. ఇవి అనుకున్న దాని కంటే పెద్ద వివాదాలయ్యాయి. కేసులు ప్రైమ్ వాళ్ల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. వీటి సెగ ‘ఫ్యామిలీ మ్యాన్-2’కు తాకింది.
ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆ సిరీస్ను రిలీజ్ చేయొద్దని ప్రైమ్ వాళ్లు నిర్ణయించుకున్నారు. నిజానికి ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ విషయంలోనూ గతంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ప్రస్తుత వివాదాల నేపథ్యంలో అందులోనే ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే ప్రైమ్ వాళ్లు మరింతగా ఇరుక్కుపోతారు. అందుకే ప్రస్తుత వివాదాలు చల్లబడే వరకు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను రిలీజ్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on January 31, 2021 3:05 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…