Movie News

భ‌విష్య‌త్‌లోకి వెళ్ల‌బోతున్న‌ ప్ర‌భాస్

రాధేశ్యామ్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మూడు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఈ మూడింట్లో చాలా కొత్త‌గా ఉంటుంద‌నే ఆశ రేకెత్తిస్తున్న సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయేదే. మ‌హాన‌టితో ఔరా అనిపించిన నాగ్ అశ్విన్ ప్ర‌భాస్‌తో ఒక వినూత్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌నే సంకేతాలు ముందు నుంచి అందుతున్నాయి.

ఇది ఆదిత్య 369 సినిమాకు మోడ‌ర్న్ వెర్ష‌న్ అనే ప్ర‌చారం ఎప్ప‌ట్నుంచో న‌డుస్తున్నాయి. అందులో మాదిరి ఫాంట‌సీ ట‌చ్ ఉంటుందో లేదో క‌చ్చితంగా చెప్ప‌లేం కానీ.. ఇదొక సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అనేది మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ముందు నుంచి ఈ దిశ‌గా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. ఆదిత్య 369 ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఈ చిత్రానికి మెంటార్‌తో పెట్టుకోవ‌డం కూడా ఈ ప్ర‌చారానికి ఊపునిస్తున్న‌దే.

తాజాగా ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌ను ఛాయాగ్రాహ‌కుడిగా, మిక్కీ జే మేయ‌ర్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు చేశారు. మ‌హాన‌టిలో అద్భుత ప‌నిత‌నం చూపిన వీళ్లిద్ద‌రినీ ప్ర‌భాస్‌తో చేయ‌బోయే భారీ చిత్రానికి కూడా ఎంచుకున్నాడు అశ్విన్. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ అత‌ను చేసిన కామెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. మ‌హాన‌టితో గ‌తం తాలూకు క‌థ‌ను వెండితెర‌పైకి తెచ్చామ‌ని.. ఈసారి భ‌విష్య‌త్తులోకి ప్ర‌యాణించ‌బోతున్నామ‌ని అత‌ను వ్యాఖ్యానించాడు.

దీన్ని బ‌ట్టి ప్ర‌భాస్‌తో అత‌ను చేయ‌బోయేది సైంటిఫిక్ థ్రిల్ల‌రే అని.. ఆదిత్య 369లో మాదిరే ఇందులోనూ భ‌విష్య‌త్‌లోకి ప్ర‌యాణం ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలాంటి క‌థ‌లో ప్ర‌భాస్ న‌టించ‌డం అన్న‌ది ఎంతో ఎగ్జైట్ చేసే విష‌య‌మే. మ‌రి యంగ్ రెబ‌ల్ స్టార్‌ను అశ్విన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే క‌థానాయిక కాగా.. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర చేయ‌నున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ.400 కోట్ల బ‌డ్జెట్లో ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.

This post was last modified on January 30, 2021 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

43 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago