Movie News

భ‌విష్య‌త్‌లోకి వెళ్ల‌బోతున్న‌ ప్ర‌భాస్

రాధేశ్యామ్ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మూడు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఈ మూడింట్లో చాలా కొత్త‌గా ఉంటుంద‌నే ఆశ రేకెత్తిస్తున్న సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయేదే. మ‌హాన‌టితో ఔరా అనిపించిన నాగ్ అశ్విన్ ప్ర‌భాస్‌తో ఒక వినూత్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌నే సంకేతాలు ముందు నుంచి అందుతున్నాయి.

ఇది ఆదిత్య 369 సినిమాకు మోడ‌ర్న్ వెర్ష‌న్ అనే ప్ర‌చారం ఎప్ప‌ట్నుంచో న‌డుస్తున్నాయి. అందులో మాదిరి ఫాంట‌సీ ట‌చ్ ఉంటుందో లేదో క‌చ్చితంగా చెప్ప‌లేం కానీ.. ఇదొక సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అనేది మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ముందు నుంచి ఈ దిశ‌గా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. ఆదిత్య 369 ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఈ చిత్రానికి మెంటార్‌తో పెట్టుకోవ‌డం కూడా ఈ ప్ర‌చారానికి ఊపునిస్తున్న‌దే.

తాజాగా ప్ర‌భాస్‌-నాగ్ అశ్విన్ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌ను ఛాయాగ్రాహ‌కుడిగా, మిక్కీ జే మేయ‌ర్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఖ‌రారు చేశారు. మ‌హాన‌టిలో అద్భుత ప‌నిత‌నం చూపిన వీళ్లిద్ద‌రినీ ప్ర‌భాస్‌తో చేయ‌బోయే భారీ చిత్రానికి కూడా ఎంచుకున్నాడు అశ్విన్. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ అత‌ను చేసిన కామెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. మ‌హాన‌టితో గ‌తం తాలూకు క‌థ‌ను వెండితెర‌పైకి తెచ్చామ‌ని.. ఈసారి భ‌విష్య‌త్తులోకి ప్ర‌యాణించ‌బోతున్నామ‌ని అత‌ను వ్యాఖ్యానించాడు.

దీన్ని బ‌ట్టి ప్ర‌భాస్‌తో అత‌ను చేయ‌బోయేది సైంటిఫిక్ థ్రిల్ల‌రే అని.. ఆదిత్య 369లో మాదిరే ఇందులోనూ భ‌విష్య‌త్‌లోకి ప్ర‌యాణం ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇలాంటి క‌థ‌లో ప్ర‌భాస్ న‌టించ‌డం అన్న‌ది ఎంతో ఎగ్జైట్ చేసే విష‌య‌మే. మ‌రి యంగ్ రెబ‌ల్ స్టార్‌ను అశ్విన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే క‌థానాయిక కాగా.. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర చేయ‌నున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ.400 కోట్ల బ‌డ్జెట్లో ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.

This post was last modified on January 30, 2021 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago