దిశా పఠాని ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేసింది. సౌత్లో చేసిన ఏకైక సినిమా ‘లోఫర్’ డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో ఆమెకొచ్చిన గుర్తింపు పెద్దగా ఏమీ లేదు. కానీ సౌత్ కుర్రాళ్లు ఇక్కడి స్టార్ హీరోయిన్లను మించి దిశాను అభిమానిస్తారు. ఆమెకు ఇక్కడున్న గుర్తింపే వేరు. సౌత్ అనే కాదు.. దేశవ్యాప్తంగా దిశకు యూత్లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇదంతా ఆమె సోషల్ మీడియా ద్వారా చేసే అందాల విందు పుణ్యమే.
ప్రస్తుతం ఇండియాలోనే బెస్ట్ ఫిగర్ ఉన్న హీరోయిన్లలో దిశ ఒకరు. ఆ ఫిగర్ను ఎంతమాత్రం వృథా చేయకుండా ఫొటో షూట్లు చేసి తన సోషల్ మీడియా ఫాలోవర్లను రంజింపజేస్తూ ఉంటుంది దిశ. ముఖ్యంగా ఆమె ఇన్నర్ వేర్తో చేసే ఫొటో షూట్లకు కోట్లల్లో అభిమానులున్నారు. ఇక క్లీవేజ్ షోలతో దిశ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏ షూట్ చేసినా ఎలా కుర్రాళ్లను కవ్వించాలో దిశకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఈ విషయంలో దిశకు పోటీ వచ్చే వాళ్లే ఉండరు.
తాజాగా దిశ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక మత్తెక్కించే ఫొటో పెట్టింది. పువ్వు చేత్తో పట్టుకుని ఎద అందాలతో రసిక ప్రియులకు గాలం వేసిందామె. చూడ్డానికి సింపుల్గా అనిపిస్తూనే ఇవ్వాల్సినంత కిక్కు ఇచ్చేసింది దిశ. ఈ ఫొటో చూసి కొంటె కుర్రాళ్లందరూ కవులైపోతున్నారు. మేమంటే నీకెందుకింత ప్రేమ.. అంటూ ఆమె మీద తమ అభిమానాన్ని కురిపిస్తున్నారు. ఇలా తరచుగా అభిమానులకు అందాల కానుకలు ఇస్తుంటుంది కాబట్టే దిశకు ఇన్స్టాగ్రామ్లో 42 మిలియన్లు, ట్విట్టర్లో 6 మిలియన్లు, ఫేస్ బుక్లో 4 మిలియన్ల దాకా ఫాలోవర్లు ఉన్నారు మరి.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…