Movie Reviews

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌పై తీవ్ర అభ్యంతరం

సస్పెన్సుకు తెరదించుతూ అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది జక్కన్న అండ్ టీం. దీని గురించి ఘనంగా ప్రకటన చేశారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చిన నేపథ్యంలో ఈసారి మాత్రం పక్కాగా ఆ తేదీకే సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ సినిమాకు దసరా వీకెండ్‌ను ఎంచుకోవడం ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాతకు అస్సలు రుచించలేదు. ఆయనెవరో కాదు.. శ్రీదేవి భర్త బోనీకపూర్.

ప్రస్తుతం తెలుగులో దిల్ రాజుతో కలిసి ‘వకీల్ సాబ్’ను నిర్మిస్తున్న బోనీ.. హిందీలో ‘మైదాన్’ అనే భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్లో సినిమా మొదలైనపుడే రిలీజ్ డేట్ ఖరారు చేస్తుంటారు. ‘మైదాన్’కు కూడా అలాగే అక్టోబరు 15ను విడుదల తేదీగా ఎంచుకున్నారు.

ఐతే ఆ విషయం తెలిసీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను దసరా వీకెండ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించడం పట్ల బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని పేరు సంపాదించిన రాజమౌళి నుంచి తర్వాత రాబోయే సినిమాకు హాలిడే వీకెండ్ అవసరం లేదని, ఏ డేట్ ఎంచుకున్నా పర్వాలేదని.. తమ సినిమా దసరా వీకెండ్లో రాబోతోందని తెలిసి కూడా ‘ఆర్ఆర్ఆర్’ను దానికి పోటీగా నిలపడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణే ‘మైదాన్’లో హీరో. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి పోటీ పడటం కూడా సరి కాదని బోనీ అభిప్రాయం.

పైగా ‘మైదాన్’ అజయ్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ వల్ల దానికి ఇబ్బంది ఎదురైతే అజయ్ ఎలా ఊరుకుంటాడని బోనీ ఉద్దేశం. అజయ్‌కు తెలియకుండానే ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ డేట్ ఇచ్చి ఉంటుందని, దీనిపై అతను కినుక వహించాడని, అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ గురించి ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టలేదని అంటున్నారు.

This post was last modified on January 27, 2021 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago