2021లో అత్యధిక అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. బాహుబలితో తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో దీనికి మంచి హైపే ఉంది. బాహుబలి తర్వాత సాహో డిజాస్టర్ అయినప్పటికీ ప్రభాస్ ఇమేజ్కు పెద్ద దెబ్బేమీ పడలేదని అతడి సినిమాల లైనప్ చూస్తేనే అర్థమవుతుంది.
రాధేశ్యామ్ విషయానికి వస్తే తన ఇమేజ్కు భిన్నంగా క్లాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఇప్పటిదాకా పెద్దగా రివీల్ చేసిందేమీ లేదు. సినిమా పోస్టర్లు చూస్తే ఇదొక వింటేజ్ లవ్ స్టోరీ అని మాత్రమే అర్థమవుతోంది. టీజర్ వస్తే కథాకథనాలపై ఓ అంచనా వస్తుందేమో. ఐతే ఈ సినిమా చిత్రీకరణ ఏ దశలో ఉంది, ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలోనూ క్లారిటీ లేదు. వేసవి విడుదల అన్నది మాత్రమే తెలుసు.
ఐతే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధేశ్యామ్కు సంబంధించి కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఇప్పటిదాకా ప్రేక్షకులకు తెలియని ఓ రాధేశ్యామ్ సీక్రెట్ను కృష్ణంరాజు పంచుకున్నారు. ఈ చిత్రంలో కృష్ణం రాజు కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారట. ఆ పాత్ర పేరు పరమహంస అని, తాను ఓ మహాజ్ఞానిలా కనిపిస్తానని.. ఈ పాత్ర కోసం గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ ట్రై చేశానని.. ప్రభాస్, తన కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇంకా చిత్రీకరించాల్సి ఉందని కృష్ణం రాజు వెల్లడించారు.
ఇక సినిమా ఎలా ఉంటుందని అడిగితే.. రెండేళ్ల పాటు ఆలోచించి చేసిన సినిమా ఇదని, అభిమానుల అంచనాలకు తగ్గని విధంగా ఉంటుందని అన్నారు. రాధేశ్యామ్ను ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు కూడా కృష్ణంరాజు వెల్లడించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్తో కలిసి కృష్ణంరాజే నిర్మిస్తుండటం విశేషం.
This post was last modified on January 21, 2021 9:26 am
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…