Movie News

పూజా.. అక్కడా పాగా వేయబోతోందా?

పూజా హెగ్డే ఊపు మామూలుగా లేదిప్పుడు. తెలుగులో ఇప్పుడు ఆమే నంబర్ వన్ హీరోయిన్ అనడంలో మరో మాట లేదు. తెలుగులో చివరగా విడుదలైన ఆమె సినిమా ‘అల వైకుంఠపురములో’ నాన్ బాహుబలి హిట్‌గా నిలిచింది.

అంతకుముందు మహేష్ బాబుతో ‘మహర్షి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ లాంటి హిట్లు ఇచ్చిందామె. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. హిందీలో సైతం ఆమెకు భారీ ఆఫర్లే ఉన్నాయి. ఇప్పుడు ఆమె తమిళంలో కూడా పాగా వేయడానికి చూస్తున్నట్లు సమాచారం.

పూజాకు కోలీవుడ్లో ఒక భారీ ఆఫరే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ సరసన పూజా నటించబోతోందట. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమాలో పూజానే హీరోయిన్ అంటున్నారు.

నిజానికి ‘మాస్టర్’ తర్వాత విజయ్.. మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వాళ్లకు సినిమా చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి మురుగ తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి కోలమావు కోకిల (తెలుగులో కో కో కోకిల) లాంటి వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నెల్సన్ దిలీప్ కుమార్ వచ్చాడు.

అతను ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయింది. త్వరలోనే విజయ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. అతడి సరసన హీరోయిన్‌గా పలు పేర్లను పరిశీలించి తమిళ ప్రేక్షకులకు కొంచెం ఫ్రెష్‌గా ఉంటుందని పూజాను తీసుకోవాలని నిర్ణయించారట. పూజాను తీసుకుంటే తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది.

పూజా బాలీవుడ్లోనూ ఫేమస్ కాబట్టి అదీ కలిసొచ్చేదే. ఐతే పూజాకు తెలుగులో ఇదే తొలి సినిమా కాదు. ఆమె స్టార్ స్టేటస్ తెచ్చుకోవడానికి ముందే తమిళంలో జీవా సరసన ‘మాస్క్’ అనే సినిమా చేసింది. అది ఆడలేదు. మళ్లీ ఇంత కాలానికి తమిళంలో భారీ చిత్రంతో అక్కడ పాగా వేయడానికి సిద్ధమవుతోందన్నమాట.

This post was last modified on January 19, 2021 1:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pooja Hegde

Recent Posts

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

7 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

54 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago