Movie News

పూజా.. అక్కడా పాగా వేయబోతోందా?

పూజా హెగ్డే ఊపు మామూలుగా లేదిప్పుడు. తెలుగులో ఇప్పుడు ఆమే నంబర్ వన్ హీరోయిన్ అనడంలో మరో మాట లేదు. తెలుగులో చివరగా విడుదలైన ఆమె సినిమా ‘అల వైకుంఠపురములో’ నాన్ బాహుబలి హిట్‌గా నిలిచింది.

అంతకుముందు మహేష్ బాబుతో ‘మహర్షి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ లాంటి హిట్లు ఇచ్చిందామె. ప్రస్తుతం ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో ‘రాధేశ్యామ్’ చేస్తోంది. హిందీలో సైతం ఆమెకు భారీ ఆఫర్లే ఉన్నాయి. ఇప్పుడు ఆమె తమిళంలో కూడా పాగా వేయడానికి చూస్తున్నట్లు సమాచారం.

పూజాకు కోలీవుడ్లో ఒక భారీ ఆఫరే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ సరసన పూజా నటించబోతోందట. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేయబోయే సినిమాలో పూజానే హీరోయిన్ అంటున్నారు.

నిజానికి ‘మాస్టర్’ తర్వాత విజయ్.. మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వాళ్లకు సినిమా చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి మురుగ తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి కోలమావు కోకిల (తెలుగులో కో కో కోకిల) లాంటి వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నెల్సన్ దిలీప్ కుమార్ వచ్చాడు.

అతను ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయింది. త్వరలోనే విజయ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. అతడి సరసన హీరోయిన్‌గా పలు పేర్లను పరిశీలించి తమిళ ప్రేక్షకులకు కొంచెం ఫ్రెష్‌గా ఉంటుందని పూజాను తీసుకోవాలని నిర్ణయించారట. పూజాను తీసుకుంటే తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది.

పూజా బాలీవుడ్లోనూ ఫేమస్ కాబట్టి అదీ కలిసొచ్చేదే. ఐతే పూజాకు తెలుగులో ఇదే తొలి సినిమా కాదు. ఆమె స్టార్ స్టేటస్ తెచ్చుకోవడానికి ముందే తమిళంలో జీవా సరసన ‘మాస్క్’ అనే సినిమా చేసింది. అది ఆడలేదు. మళ్లీ ఇంత కాలానికి తమిళంలో భారీ చిత్రంతో అక్కడ పాగా వేయడానికి సిద్ధమవుతోందన్నమాట.

This post was last modified on January 19, 2021 1:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pooja Hegde

Recent Posts

కోర్ట్ దర్శకుడు…సీతారామం హీరో !

ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…

1 hour ago

భయంకర ఉగ్రవాదికి నష్టపరిహారమా..?

ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…

3 hours ago

అనంత‌పురంలో కియాను మించిన మ‌రో పరిశ్ర‌మ‌!

మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల వేట‌లో కీల‌క‌మైన రెన్యూ ఎన‌ర్జీ ఒక‌టి. 2014-17 మ‌ధ్య కాలంలో కియా కార్ల…

3 hours ago

కొడాలి నానికి అందరూ దూరమవుతున్నారు

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్‌బ్రాండ్‌.. కొడాలి నానికి రాజ‌కీయంగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో గట్టి ప‌ట్టుంది. ఆయ‌న వ‌రుస విజ‌యాలు…

3 hours ago

మొత్తానికి పాక్ చెర నుంచి విడుదలైన బీఎస్ఎఫ్ జవాన్

పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…

3 hours ago

కింగ్ డమ్ ఫిక్స్ – తమ్ముడు తప్పుకున్నట్టేనా

మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…

4 hours ago