తమిళంలో ఈ సంక్రాంతికి తక్కువ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఈశ్వరన్. పండక్కి తమిళ ప్రేక్షకుల దృష్టంతా విజయ్ మూవీ మాస్టర్ మీదే ఉండటంతో.. ఈ చిత్రాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆకాశాన్నంటే అంచనాల మధ్య విడుదలవుతున్న మాస్టర్ ధాటికి శింబు సినిమా అసలు నిలవగలదా.. అది రేసు నుంచి తప్పుకుంటే మంచిదేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఐతే పల్నాడు, జయసూర్య లాంటి థ్రిల్లర్లతో ఆకట్టుకున్న సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈశ్వరన్పై చిత్ర బృందం నమ్మకం పెట్టింది. ధైర్యంగా సంక్రాంతి రేసులో ఈ చిత్రాన్ని నిలబెట్టింది. వారి నమ్మకానికి మంచి ఫలితమే దక్కింది.
మాస్టర్ ధాటికి పచ్చడైపోతుందేమో అనుకుంటే.. ఇప్పుడు మాస్టర్నే దెబ్బ కొడుతోంది ఈశ్వరన్. టాక్, రివ్యూల పరంగా మాస్టర్పై ఈ సినిమా స్పష్టమైన పైచేయి సాధించింది. రూరల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన సినిమా కావడంతో బి, సి సెంటర్లలో ఈశ్వరన్కు భారీ వసూళ్లు దక్కుతున్నాయి. సిటీల్లో కూడా బాగానే ఆడుతోందీ చిత్రం. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ నేపథ్యంలో మొత్తం థియేటర్లను తమ సినిమాతోనే నింపేసి సోలోగా బాక్సాఫీస్ను దున్నుకుందామనుకున్న మాస్టర్ నిర్మాతలకు ఈశ్వరన్ ఝలక్ ఇచ్చింది.
ఈశ్వరన్ రూపంలో మంచి సినిమా కనిపిస్తుండటంతో జనాలు అటు మళ్లుతున్నారు. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి వారాంతం వరకు మాస్టర్ మంచి వసూళ్లే సాధించినా.. ఆ తర్వాత సినిమా నిలబడ్డం కష్టంగా ఉంది. ఫుల్ రన్లో మాస్టర్ మీద ఈశ్వరన్దే పైచేయిగా కనిపిస్తోంది. ఈ చిత్రంతోనే ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ తమిళంలో అడుగు పెట్టింది. ఆమెకు ఈ సినిమా అక్కడ శుభారంభాన్నే అందించింది. ఈశ్వరన్ను తెలుగులోనూ త్వరలో విడుదల చేయబోతున్నారు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…