బాలీవుడ్ ఇప్పుడు భారతీయ ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటోంది. బాయ్కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తోంది ప్రస్తుతం. ఇందుక్కారణం.. పదే పదే బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో హిందూ దేవుళ్లను కించపరిచేు ప్రయత్నం జరుగుతుండటమే. ‘పీకే’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్ సహా చాలా సినిమాల్లో హిందూ దేవుళ్లను, హిందువుల మత ఆచారాలను తక్కువ చేసి చూపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ‘తాండవ్’ వెబ్ సిరీస్లో హిందూ దేవుళ్లను తమాషా చేసే ప్రయత్నం జరిగింది.
ఇంతకుముందు ‘పాతాళ్ లోక్’ సహా కొన్ని వెబ్ సిరీస్ల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. ఇక బాలీవుడ్ సినిమల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వేరే మతాలకు చెందిన దేవుళ్లు, ఆచారాల గురించి ఏ చిన్న చర్చకు కూడా అవకాశం ఇవ్వని బాలీవుడ్ ఫిలిం మేకర్లు.. హిందూ దేవుళ్లు, మత ఆచారాలను మాత్రం అదే పనిగా కించపరచడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నట్నుంచి ట్విట్టర్లో ‘బాయ్ కాట్ బాలీవుడ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
‘పీకే’ మూవీ నుంచి ‘తాండవ్’ వెబ్ సిరీస్ వరకు హిందూ దేవుళ్లను తక్కువ చేసి చూపించిన సన్నివేశాల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టి బాలీవుడ్ ఫిలిం మేకర్లను దునుమాడుతున్నారు నెటిజన్లు. అదే సమయంలో సౌత్ సినిమాను, ఇక్కడి ఫిలిం మేకర్లను పొగుడుతుండటం విశేషం. దక్షిణాది సినిమాల్లో ఎప్పుడూ హిందూ దేవుళ్లను, హిందువుల మతాచారాలను గొప్పగా చూపిస్తుంటారని.. అదే సమయంలో వేరే మతాల్ని కించపరిచే ప్రయత్నం ఎప్పుడూ జరగదని పేర్కొంటూ ఇక్కడి సినిమాల తాలూకు స్క్రీన్ షాట్లను పెడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’ సహా పలు సినిమాల స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ అవతారంలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 17, 2021 9:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…