బాలీవుడ్ ఇప్పుడు భారతీయ ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటోంది. బాయ్కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తోంది ప్రస్తుతం. ఇందుక్కారణం.. పదే పదే బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో హిందూ దేవుళ్లను కించపరిచేు ప్రయత్నం జరుగుతుండటమే. ‘పీకే’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్ సహా చాలా సినిమాల్లో హిందూ దేవుళ్లను, హిందువుల మత ఆచారాలను తక్కువ చేసి చూపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ‘తాండవ్’ వెబ్ సిరీస్లో హిందూ దేవుళ్లను తమాషా చేసే ప్రయత్నం జరిగింది.
ఇంతకుముందు ‘పాతాళ్ లోక్’ సహా కొన్ని వెబ్ సిరీస్ల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. ఇక బాలీవుడ్ సినిమల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వేరే మతాలకు చెందిన దేవుళ్లు, ఆచారాల గురించి ఏ చిన్న చర్చకు కూడా అవకాశం ఇవ్వని బాలీవుడ్ ఫిలిం మేకర్లు.. హిందూ దేవుళ్లు, మత ఆచారాలను మాత్రం అదే పనిగా కించపరచడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నట్నుంచి ట్విట్టర్లో ‘బాయ్ కాట్ బాలీవుడ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
‘పీకే’ మూవీ నుంచి ‘తాండవ్’ వెబ్ సిరీస్ వరకు హిందూ దేవుళ్లను తక్కువ చేసి చూపించిన సన్నివేశాల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టి బాలీవుడ్ ఫిలిం మేకర్లను దునుమాడుతున్నారు నెటిజన్లు. అదే సమయంలో సౌత్ సినిమాను, ఇక్కడి ఫిలిం మేకర్లను పొగుడుతుండటం విశేషం. దక్షిణాది సినిమాల్లో ఎప్పుడూ హిందూ దేవుళ్లను, హిందువుల మతాచారాలను గొప్పగా చూపిస్తుంటారని.. అదే సమయంలో వేరే మతాల్ని కించపరిచే ప్రయత్నం ఎప్పుడూ జరగదని పేర్కొంటూ ఇక్కడి సినిమాల తాలూకు స్క్రీన్ షాట్లను పెడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’ సహా పలు సినిమాల స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ అవతారంలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 17, 2021 9:06 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…