బాలీవుడ్ ఇప్పుడు భారతీయ ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటోంది. బాయ్కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తోంది ప్రస్తుతం. ఇందుక్కారణం.. పదే పదే బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ల్లో హిందూ దేవుళ్లను కించపరిచేు ప్రయత్నం జరుగుతుండటమే. ‘పీకే’ లాంటి ఆల్ టైం బ్లాక్బస్టర్ సహా చాలా సినిమాల్లో హిందూ దేవుళ్లను, హిందువుల మత ఆచారాలను తక్కువ చేసి చూపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ‘తాండవ్’ వెబ్ సిరీస్లో హిందూ దేవుళ్లను తమాషా చేసే ప్రయత్నం జరిగింది.
ఇంతకుముందు ‘పాతాళ్ లోక్’ సహా కొన్ని వెబ్ సిరీస్ల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. ఇక బాలీవుడ్ సినిమల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వేరే మతాలకు చెందిన దేవుళ్లు, ఆచారాల గురించి ఏ చిన్న చర్చకు కూడా అవకాశం ఇవ్వని బాలీవుడ్ ఫిలిం మేకర్లు.. హిందూ దేవుళ్లు, మత ఆచారాలను మాత్రం అదే పనిగా కించపరచడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నట్నుంచి ట్విట్టర్లో ‘బాయ్ కాట్ బాలీవుడ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
‘పీకే’ మూవీ నుంచి ‘తాండవ్’ వెబ్ సిరీస్ వరకు హిందూ దేవుళ్లను తక్కువ చేసి చూపించిన సన్నివేశాల తాలూకు స్క్రీన్ షాట్లు పెట్టి బాలీవుడ్ ఫిలిం మేకర్లను దునుమాడుతున్నారు నెటిజన్లు. అదే సమయంలో సౌత్ సినిమాను, ఇక్కడి ఫిలిం మేకర్లను పొగుడుతుండటం విశేషం. దక్షిణాది సినిమాల్లో ఎప్పుడూ హిందూ దేవుళ్లను, హిందువుల మతాచారాలను గొప్పగా చూపిస్తుంటారని.. అదే సమయంలో వేరే మతాల్ని కించపరిచే ప్రయత్నం ఎప్పుడూ జరగదని పేర్కొంటూ ఇక్కడి సినిమాల తాలూకు స్క్రీన్ షాట్లను పెడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’ సహా పలు సినిమాల స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో అల్లు అర్జున్ సంప్రదాయ అవతారంలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 17, 2021 9:06 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…