కొన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఆడతాయని ధీమాగా చెప్పేయొచ్చు. ‘జెర్సీ’ అలాంటి సినిమానే. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. దీని కథాంశం సార్వజనీనమైంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్టోరీ దేశంలో అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అయ్యేదే.
నిజానికి తెలుగులో ఈ చిత్రం ఇంకా మంచి విజయం సాధించాల్సిందనే అభిప్రాయం ఉంది. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. దీన్ని హిందీలో పునర్నిర్మించబోతున్నారని సమాచారం బయటికొచ్చినపుడే ఇది అక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం కలిగింది. నిజానికి తెలుగు వెర్షన్ బాలీవుడ్ చిత్రాల స్టయిల్లోనే సాగుతుంది. ఆ తరహా నరేషన్ అక్కడి వాళ్లకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది.
ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్తో భారీ విజయాన్నందుకున్న షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తుండటంతో ఇది స్యూర్ షాట్ హిట్ అనే అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు వెర్షన్ను రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్కు కూడా దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాణ సంస్థ సితా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని హిందీకి తీసుకెళ్తున్నాడు. వీరికి కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత తోడయ్యాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘జెర్సీ’కి రిలీజ్ డేట్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్కు బాగా టైం తీసుకుని, కరోనా ప్రభావం బాగా తగ్గే సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీపావళి కానుకగా నవంబరు 5న ‘జెర్సీ’ థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రం ‘కబీర్’ సింగ్’ తరహాలోనే సంచనలాలు రేపడం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉంది.
తెలుగులో శ్రద్ధ శ్రీనాథ్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ను హిందీలో మృణాల్ ఠాకూర్ చేస్తుండగా.. సత్యరాజ్ చేసిన కోచ్ పాత్రలో పంకజ్ కపూర్ నటించాడు. మరి హిందీలో ‘జెర్సీ’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 3:52 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…