కొన్ని సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఆడతాయని ధీమాగా చెప్పేయొచ్చు. ‘జెర్సీ’ అలాంటి సినిమానే. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. దీని కథాంశం సార్వజనీనమైంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్టోరీ దేశంలో అన్ని భాషల వాళ్లకూ కనెక్ట్ అయ్యేదే.
నిజానికి తెలుగులో ఈ చిత్రం ఇంకా మంచి విజయం సాధించాల్సిందనే అభిప్రాయం ఉంది. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. దీన్ని హిందీలో పునర్నిర్మించబోతున్నారని సమాచారం బయటికొచ్చినపుడే ఇది అక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం కలిగింది. నిజానికి తెలుగు వెర్షన్ బాలీవుడ్ చిత్రాల స్టయిల్లోనే సాగుతుంది. ఆ తరహా నరేషన్ అక్కడి వాళ్లకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది.
ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్తో భారీ విజయాన్నందుకున్న షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేస్తుండటంతో ఇది స్యూర్ షాట్ హిట్ అనే అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు వెర్షన్ను రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ వెర్షన్కు కూడా దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాణ సంస్థ సితా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని హిందీకి తీసుకెళ్తున్నాడు. వీరికి కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత తోడయ్యాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘జెర్సీ’కి రిలీజ్ డేట్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్కు బాగా టైం తీసుకుని, కరోనా ప్రభావం బాగా తగ్గే సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీపావళి కానుకగా నవంబరు 5న ‘జెర్సీ’ థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రం ‘కబీర్’ సింగ్’ తరహాలోనే సంచనలాలు రేపడం ఖాయమనే ధీమా అందరిలోనూ ఉంది.
తెలుగులో శ్రద్ధ శ్రీనాథ్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ను హిందీలో మృణాల్ ఠాకూర్ చేస్తుండగా.. సత్యరాజ్ చేసిన కోచ్ పాత్రలో పంకజ్ కపూర్ నటించాడు. మరి హిందీలో ‘జెర్సీ’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 3:52 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…