Movie News

థియేటర్ల వివాదంపై ‘మాస్టర్’ నిర్మాత ఏమన్నాడంటే..

బాగా ఆడుతున్న ‘క్రాక్’ సినిమాకు థియేటర్లు తగ్గించేశారని.. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ సినిమాకు పనికి రాని థియేటర్లను కేటాయించి, మంచి థియేటర్లను డబ్బింగ్ సినిమా అయిన ‘మాస్టర్’కు కేటాయించారని ఇటీవల డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రధానంగా అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును లక్ష్యంగా చేసుకుని అతను ఆరోపణలు గుప్పించాడు. తాను నైజాం డిస్ట్రిబ్యూషన్లో పోటీగా మారుతున్నాననే కోపంతోనే రాజు ఉద్దేశపూర్వకంగా తన సినిమాల్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడని అతను ఆరోపించాడు.
గతంలో డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రాజు.. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని అతనన్నాడు. ఈ ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై దిల్ రాజు ఏమంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే రాజు మాట్లాడట్లేదు కానీ.. ఆయన తరఫున వేరే నిర్మాతలు ఒక్కొక్కరుగా లైన్లోకి వస్తున్నారు.

‘అల్లుడు అదుర్స్’ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్.. రాజుకు మద్దతుగా మాట్లాడటం, శ్రీనును టార్గెట్ చేయడం తెలిసిందే. అలాగే ‘మాస్టర్’ నిర్మాత అయిన మహేష్ కోనేరు సైతం ఈ వివాదంపై స్పందించాడు. ప్రధానంగా తన చిత్రాన్ని శ్రీను టార్గెట్ చేసిన నేపథ్యంలో మహేష్ మాట్లాడాడు.

‘మాస్టర్’ పాన్ ఇండియా సినిమా అని.. ఇలాంటి సినిమాల్ని ఒక్కో చోట ఒక్కో తేదీకి విడుదల చేయడం సాధ్యపడదని, అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాల్సి ఉంటుందని.. మన ‘బాహుబలి’ని అలా రిలీజ్ చేసినప్పుడు అన్ని భాషల డిస్ట్రిబ్యూటర్లూ సహకరించి థియేటర్లు ఇచ్చారని.. ‘కేజీఎఫ్’ విషయంలోనూ అలాగే జరిగిందని, రేప్పొద్దున ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అలాగే ఉంటుందని.. ‘మాస్టర్’కు మనం కూడా అలాగే సహకరించాలని అతను అన్నాడు.

‘మాస్టర్’ అనువాద చిత్రమే అయినా.. దాని వల్ల డబ్బులు చూస్తోంది తాను, ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లే అని అతను చెప్పాడు. ‘క్రాక్’ సినిమాకు నైజాంలో 350 దాకా థియేటర్లు ఇచ్చాయని.. నాలుగు రోజుల పాటు ఆ సినిమా సోలోగా రన్ అయిందని.. తమ చిత్రానికి నైజాంలో దక్కింది 150 థియేటర్లే అని.. సంక్రాంతి రోజు ఇంకో రెండు సినిమాలు కూడా రావడంతో రెండో రోజుకు తన సినిమాకు సగం థియేటర్లు కోత విధించారని.. కానీ ‘క్రాక్’ అప్పుడు కూడా వందకు పైగా థియేటర్లలో కొనసాగిందని, దానికి థియేటర్లు తగ్గించలేదని.. ఇలా పండుగ సమయంలో అందరూ కలిసి థియేటర్లు పంచుకోక తప్పదని.. ఇందులో వివాదం చేయాల్సిన విషయం ఏమీ లేదని మహేష్ స్పష్టం చేశాడు.

This post was last modified on January 17, 2021 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభిమానులు కోరేవి వేరే ఉన్నాయి

అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న…

4 hours ago

`వ‌స్తావా.. రేటెంత‌..` అర్ధ‌రాత్రి మ‌హిళా ఐపీఎస్‌కు వేధింపులు!

భాగ్య‌న‌గ‌రం హైద‌రాబాద్‌లో మ‌హిళ‌ల దుస్థితి ఎలా ఉందో.. ఒంట‌రి మ‌హిళ‌ల ప‌ట్ల స‌మాజం ఎలా వ్య‌వ‌హరిస్తోందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన…

4 hours ago

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

7 hours ago

ఏపీ హైకోర్టులో జడ్జి వర్సెస్ లాయర్.. సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వివాదం!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక యువ…

8 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

9 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

9 hours ago