థియేటర్లు పున:ప్రారంభం అయితే అయ్యాయి కానీ.. ఇంకా పెద్ద సినిమాలను ఇప్పుడే విడుదల చేయడానికి నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. ఇంకా కరోనా ప్రభావం కొనసాగుతుండటం, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తుండటంతో ఇలాంటి సమయంలో రిలీజ్ చేసి రెవెన్యూను ఎందుకు తగ్గించుకోవడం అని చూస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అన్ని చోట్లా మీడియం రేంజ్ సినిమాలనే నడిపిస్తూ వచ్చారు తప్ప పెద్ద సినిమాలు మాత్రం రేసులోకి రాలేదు.
కానీ ఒక్క తమిళంలో మాత్రం సంక్రాంతికి ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రాన్ని ధైర్యం చేసి రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచినపుడే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తమిళనాట డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వచ్చి వేడుకోవడంతో ‘మాస్టర్’ టీం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేసింది.
ఐతే ఈ సినిమాకు ఆశించిన టాక్ అయితే రాలేదు. తమిళంలోనే కాక మిగతా భాషల్లోనూ ‘మాస్టర్’ పట్ల మిశ్రమ స్పందనే వ్యక్తమైంది. ఐతే టాక్ ఇలా ఉన్నా.. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నా.. ‘మాస్టర్’ బాక్సాఫీస్ దగ్గర గట్టి ప్రభావంమే చూపుతోంది. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు.. ఆ తర్వాతి రోజుల్లో కూడా వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఆదివారం వరకు ఈ ఊపు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒక్క తమిళనాడులోనే ‘మాస్టర్’ ఇప్పటిదాకా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ ఈ చిత్రం బాగా ఆడుతోంది. ఇక్కడ రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ అయింది. ఇండియాలోని మిగతా రాష్ట్రాలు, ఓవర్సీస్.. అన్ని వసూళ్లను కలిపితే ‘మాస్టర్’ రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ అంటే విజయ్ స్టార్ డమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on January 16, 2021 9:18 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…