ఇంకొక్క రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మాస్టర్’ సినిమా. తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ హీరోగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఐతే విడుదల దగ్గర పడ్డ సమయంలో ఈ సినిమాలోంచి కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన క్లిప్స్ లీక్ అయినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్లోని వాళ్లే కొన్ని సన్నివేశాల తాలూకు వీడియోలు లీక్ చేయడం షాక్కు గురి చేస్తోంది.
టెలిగ్రామ్ సహా కొన్ని వెబ్ సైట్లలో ‘మాస్టర్’ వీడియోలు పెట్టేశారట. ఇది చిత్ర దర్శక నిర్మాతలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వెంటనే అన్ని వెబ్ సైట్ల నుంచి ‘మాస్టర్’ వీడియోలను తీయించడానికి గట్టి ప్రయత్నం జరిగింది. అన్నీ డెలీట్ అయ్యాయనే అంటున్నారు. ఈ వీడియోలు ఎవరు లీక్ చేశారన్నది ఇప్పటికే కనుక్కొన్నారట. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నిజానికి ‘మాస్టర్’ లీక్స్ గురించి ముందు జనాలకు పెద్దగా తెలియలేదు. కానీ దర్శకుడు లోకేష్ కనకరాజ్.. పరోక్షంగా ఈ లీక్స్ గురించి ప్రస్తావిస్తూ, తమ కష్టాన్ని దోచుకోకండి అంటూ ఎమోషనల్గా ట్వీట్ వేశాడు. అలాగే నిర్మాణ సంస్థ కూడా ఇదే తరహాలో ట్వీట్ వేసింది. దీంతో విషయం ఏంటని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
అభిమానులను అలెర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ట్వీట్లు వేసి ఉండొచ్చు కానీ.. ఈ ట్వీట్ల వల్లే ఎక్కువమందికి లీక్స్ గురించి తెలిసి వాటి కోసం వెతికే పనిలో పడ్డారు. దీని వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అంటున్నారు. అసలే కరోనా దెబ్బకు ఏడాది పాటు సినిమాను ఆపుకుని ఎట్టకేలకు రిలీజ్ చేస్తుంటే.. ఇలాంటి సమయంలో లీక్స్, పైరసీ అంటే నిర్మాతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘మాస్టర్’ అంచనాలను అందుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుని నిర్మాతల టెన్షన్ తీర్చేస్తుందేమో చూద్దాం.
This post was last modified on January 12, 2021 11:27 am
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…