దర్శకుడు కావాలన్న లక్ష్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా హీరోలైన వాళ్లు చాలామందే కనిపిస్తారు టాలీవుడ్లో. అల్లరి నరేష్, నాని, రాజ్ తరుణ్, సప్తగిరి ఈ కోవలోని వాళ్లే. వీరి కంటే ముందు ఓ సీనియర్ నటుడు పూర్వాశ్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఆయనే.. మాస్ రాజా రవితేజ. దర్శకుడవుదామన్న కోరికతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్నేళ్ల పాటు ఆ విభాగంలో పని చేశాడు రవితేజ.
ఐతే అనుకోకుండా నటుడిగా అవకాశాలు రావడం.. ఇంకొన్నేళ్లకు హీరోగా అరంగేట్రం చేయడం.. ఆ తర్వాత స్టార్ ఇమేజ్ సంపాదించడంతో మెగా ఫోన్ గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. ఐతే ఒకసారి దర్శకత్వం చేయాలని కోరిక పుట్టాక ఆ పురుగు తొలుస్తూనే ఉంటుంది. రవితేజకు సైతం ఆ కోరిక లేకపోలేదట. భవిష్యత్తులో తాను దర్శకత్వం చేపట్టే అవకాశాలున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రవితేజే క్లారిటీ ఇచ్చాడు.
తన కొత్త సినిమా ‘క్రాక్’ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూలో రవితేజ దర్శకత్వం చేపట్టడం గురించి మాట్లాడాడు. ముందుగా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటి అని ఇంటర్వ్యూయర్ అడిగితే.. గోపీచంద్ అందుకుని.. డైరెక్షన్ చేయగలరు, భవిష్యత్తులో ఆయన దర్శకత్వం చేస్తారు అన్నాడు. ఇంతలో రవితేజ అందుకుని.. భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశాలున్నాయి.. చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నాడు.
దీన్ని బట్టి రవితేజకు మెగా ఫోన్ పట్టే ఆశలు ఉన్నాయనే అనుకోవచ్చు. ఆ ఆలోచన లేకుండా అయితే ఈ మాట అనడు కాబట్టి ఫ్యూచర్లో ‘కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వ: రవితేజ’ అనే కార్డ్ చూస్తామేమో. ప్రస్తుతానికైతే రవితేజ కొన్నేళ్ల వరకు ఖాళీ లేకుండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మంచి డిమాండ్ ఉన్న ఈ టైంలో దర్శకత్వం చేసే సాహసాలకు దిగకపోవచ్చు.
This post was last modified on January 9, 2021 5:09 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…