దర్శకుడు కావాలన్న లక్ష్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా హీరోలైన వాళ్లు చాలామందే కనిపిస్తారు టాలీవుడ్లో. అల్లరి నరేష్, నాని, రాజ్ తరుణ్, సప్తగిరి ఈ కోవలోని వాళ్లే. వీరి కంటే ముందు ఓ సీనియర్ నటుడు పూర్వాశ్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఆయనే.. మాస్ రాజా రవితేజ. దర్శకుడవుదామన్న కోరికతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్నేళ్ల పాటు ఆ విభాగంలో పని చేశాడు రవితేజ.
ఐతే అనుకోకుండా నటుడిగా అవకాశాలు రావడం.. ఇంకొన్నేళ్లకు హీరోగా అరంగేట్రం చేయడం.. ఆ తర్వాత స్టార్ ఇమేజ్ సంపాదించడంతో మెగా ఫోన్ గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. ఐతే ఒకసారి దర్శకత్వం చేయాలని కోరిక పుట్టాక ఆ పురుగు తొలుస్తూనే ఉంటుంది. రవితేజకు సైతం ఆ కోరిక లేకపోలేదట. భవిష్యత్తులో తాను దర్శకత్వం చేపట్టే అవకాశాలున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రవితేజే క్లారిటీ ఇచ్చాడు.
తన కొత్త సినిమా ‘క్రాక్’ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూలో రవితేజ దర్శకత్వం చేపట్టడం గురించి మాట్లాడాడు. ముందుగా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటి అని ఇంటర్వ్యూయర్ అడిగితే.. గోపీచంద్ అందుకుని.. డైరెక్షన్ చేయగలరు, భవిష్యత్తులో ఆయన దర్శకత్వం చేస్తారు అన్నాడు. ఇంతలో రవితేజ అందుకుని.. భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశాలున్నాయి.. చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నాడు.
దీన్ని బట్టి రవితేజకు మెగా ఫోన్ పట్టే ఆశలు ఉన్నాయనే అనుకోవచ్చు. ఆ ఆలోచన లేకుండా అయితే ఈ మాట అనడు కాబట్టి ఫ్యూచర్లో ‘కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వ: రవితేజ’ అనే కార్డ్ చూస్తామేమో. ప్రస్తుతానికైతే రవితేజ కొన్నేళ్ల వరకు ఖాళీ లేకుండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మంచి డిమాండ్ ఉన్న ఈ టైంలో దర్శకత్వం చేసే సాహసాలకు దిగకపోవచ్చు.
This post was last modified on January 9, 2021 5:09 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…