దర్శకుడు కావాలన్న లక్ష్యంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనుకోకుండా హీరోలైన వాళ్లు చాలామందే కనిపిస్తారు టాలీవుడ్లో. అల్లరి నరేష్, నాని, రాజ్ తరుణ్, సప్తగిరి ఈ కోవలోని వాళ్లే. వీరి కంటే ముందు ఓ సీనియర్ నటుడు పూర్వాశ్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఆయనే.. మాస్ రాజా రవితేజ. దర్శకుడవుదామన్న కోరికతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్నేళ్ల పాటు ఆ విభాగంలో పని చేశాడు రవితేజ.
ఐతే అనుకోకుండా నటుడిగా అవకాశాలు రావడం.. ఇంకొన్నేళ్లకు హీరోగా అరంగేట్రం చేయడం.. ఆ తర్వాత స్టార్ ఇమేజ్ సంపాదించడంతో మెగా ఫోన్ గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. ఐతే ఒకసారి దర్శకత్వం చేయాలని కోరిక పుట్టాక ఆ పురుగు తొలుస్తూనే ఉంటుంది. రవితేజకు సైతం ఆ కోరిక లేకపోలేదట. భవిష్యత్తులో తాను దర్శకత్వం చేపట్టే అవకాశాలున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రవితేజే క్లారిటీ ఇచ్చాడు.
తన కొత్త సినిమా ‘క్రాక్’ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఇచ్చిన ఓ వీడియో ఇంటర్వ్యూలో రవితేజ దర్శకత్వం చేపట్టడం గురించి మాట్లాడాడు. ముందుగా మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటి అని ఇంటర్వ్యూయర్ అడిగితే.. గోపీచంద్ అందుకుని.. డైరెక్షన్ చేయగలరు, భవిష్యత్తులో ఆయన దర్శకత్వం చేస్తారు అన్నాడు. ఇంతలో రవితేజ అందుకుని.. భవిష్యత్తులో డైరెక్షన్ చేసే అవకాశాలున్నాయి.. చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నాడు.
దీన్ని బట్టి రవితేజకు మెగా ఫోన్ పట్టే ఆశలు ఉన్నాయనే అనుకోవచ్చు. ఆ ఆలోచన లేకుండా అయితే ఈ మాట అనడు కాబట్టి ఫ్యూచర్లో ‘కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వ: రవితేజ’ అనే కార్డ్ చూస్తామేమో. ప్రస్తుతానికైతే రవితేజ కొన్నేళ్ల వరకు ఖాళీ లేకుండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మంచి డిమాండ్ ఉన్న ఈ టైంలో దర్శకత్వం చేసే సాహసాలకు దిగకపోవచ్చు.
This post was last modified on January 9, 2021 5:09 pm
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…
షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…