2020లో తెలుగు సినిమాలకు మామూలు ఆరంభం దక్కలేదు. ఓవైపు అల వైకుంఠపురములో, మరోవైపు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతికి వసూళ్ల మోత మోగించి కొత్త ఏడాదికి అదిరే ఆరంభాన్ని అందించాయి. దీంతో 2020 మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. కానీ కరోనా వచ్చి ఆ ఏడాది ప్రణాళికలన్నింటినీ ఛిద్రం చేసేసింది. సినీ రంగంపై వైరస్ చూపించిన ప్రభావం అలాంటిలాంటిది కాదు. వేసవి నుంచి అన్ని సీజన్లూ వెలవెలబోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడెనిమిది నెలల పాటు థియేటర్లు మూతపడి ఉన్నాయి.
ఏడాది చివర్లో థియేటర్లు పున:ప్రారంభం కాగా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మినహా పేరున్న సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. దానిక మంచి స్పందనే రావడంతో కొత్త ఏడాదిపై ఆశలు రేకెత్తాయి. ఇప్పటికీ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నప్పటికీ సంక్రాంతికి నాలుగు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.
అందులో మొదటి చిత్రం ‘క్రాక్’ సంక్రాంతి పండక్కి ఐదు రోజుల ముందే.. శనివారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొత్త ఏడాదికి ఈ సినిమా ఎలాంటి ఆరంభాన్నిస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. డాన్ శీను, బలుపు లాంటి హిట్ల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేనిల నుంచి వస్తున్న చిత్రమిది. రవితేజ నుంచి చివరగా వచ్చిన మూడు సినిమాలూ డిజాస్టర్లే. గోపీచంద్ కెరీర్ కూడా ఏమంత బాగా లేదు. చివరగా అతను తీసిన ‘విన్నర్’ డిజాస్టర్ అయింది. ఆపై మూడేళ్ల విరామం తర్వాత అతడి నుంచి వస్తున్న సినిమా ఇది. కానీ హీరో, దర్శకుడి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ‘క్రాక్’కు విడుదల ముంగిట మంచి హైపే వచ్చింది. సోలో రిలీజ్ కావడంతో ఈ చిత్రానికి పెద్ద సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. బుకింగ్స్ పర్వాలేదు.
ఐతే సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నదే కీలకం. ఐదు రోజుల పాటు ఆ సినిమాను మెజారిటీ థియేటర్లలో ఆడించబోతున్నారు. టాక్ బాగుంటే మంచి వసూళ్లే రాబట్టే అవకాశముంది. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో రప్పించదగ్గ క్యాలిబర్ ఉన్న సినిమానే ఇది. కాకపోతే పాజిటివ్ టాక్ అనేది కీలకం. మరి శనివారం మార్నింగ్ షో తర్వాత ఈ చిత్రం గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారో.. రివ్యూలెలా వస్తాయో చూడాలి.
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు…
వచ్చే నెల 9 జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' విడుదలవుతోంది. మహేష్ బాబు ముఖ్యఅతిథిగా వచ్చే వారం…
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం. ఇది…