ఐదు రోజుల ముందు తమిళ సినీ పరిశ్రమకు ఎక్కడ లేని ఉత్సాహాన్నిస్తూ తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. హమ్మయ్య థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని సంతోషించారు అక్కడి జనాలు. కానీ ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంబంధిత జీవోను వెనక్కి తీసుకోవాలని.. 100 శాతం ఆక్యుపెన్సీ సాధ్యం కాదని తేల్చేసింది. కేంద్రం ఉద్దేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకునే పరిస్థితి లేదక్కడ. సంక్రాంతి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలకు కూడా షాకే.
తమిళనాట అనుమతులొచ్చాయి.. మా సంగతేంటి అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు వెళ్లాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో మన దగ్గరా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవబోతున్నాయని.. సంక్రాంతి సినిమాలే ఈ ఆఫర్ దక్కబోతోందని.. వసూళ్లు రెట్టింపు అవుతాయని ఆశలు పెట్టుకున్నారు నిర్మాతలు.
కానీ ఇంతలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి షాకిచ్చింది. దీంతో మన దగ్గరా పరిస్థితి మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చినా.. కేంద్రం ఇదే తరహాలో బ్రేక్ వేస్తుందని అర్థమవుతోంది కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే లేవు.
కేంద్రాన్ని కాదని పరిశ్రమ కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ధైర్యం చేయకపోవచ్చు. కాబట్టి సంక్రాంతి సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీ మీద ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. ఐతే ఇంకొన్ని రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలవుతోంది కాబట్టి రెండు నెలల్లో పరిస్థితిలో మార్పు రావచ్చు. వేసవి సమయానికి కేంద్రం దేశవ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించవచ్చు.
సంక్రాంతి అంటే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు మాత్రమే కీలకం. కానీ వేసవి అంటే అన్ని చోట్లా భారీ చిత్రాలు విడుదలవుతాయి. వ్యాక్సినేషన్కు తోడు వేసవిలో వాతావరణం కూడా కరోనా ప్రభావాన్ని తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అప్పటికి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చే అవకాశాలే ఎక్కువ.
This post was last modified on January 8, 2021 10:24 pm
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…