ఐదు రోజుల ముందు తమిళ సినీ పరిశ్రమకు ఎక్కడ లేని ఉత్సాహాన్నిస్తూ తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. హమ్మయ్య థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని సంతోషించారు అక్కడి జనాలు. కానీ ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటే అయింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంబంధిత జీవోను వెనక్కి తీసుకోవాలని.. 100 శాతం ఆక్యుపెన్సీ సాధ్యం కాదని తేల్చేసింది. కేంద్రం ఉద్దేశాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకునే పరిస్థితి లేదక్కడ. సంక్రాంతి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమలకు కూడా షాకే.
తమిళనాట అనుమతులొచ్చాయి.. మా సంగతేంటి అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు వెళ్లాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో మన దగ్గరా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవబోతున్నాయని.. సంక్రాంతి సినిమాలే ఈ ఆఫర్ దక్కబోతోందని.. వసూళ్లు రెట్టింపు అవుతాయని ఆశలు పెట్టుకున్నారు నిర్మాతలు.
కానీ ఇంతలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి షాకిచ్చింది. దీంతో మన దగ్గరా పరిస్థితి మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చినా.. కేంద్రం ఇదే తరహాలో బ్రేక్ వేస్తుందని అర్థమవుతోంది కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే లేవు.
కేంద్రాన్ని కాదని పరిశ్రమ కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ధైర్యం చేయకపోవచ్చు. కాబట్టి సంక్రాంతి సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీ మీద ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. ఐతే ఇంకొన్ని రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మొదలవుతోంది కాబట్టి రెండు నెలల్లో పరిస్థితిలో మార్పు రావచ్చు. వేసవి సమయానికి కేంద్రం దేశవ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీకి అవకాశం కల్పించవచ్చు.
సంక్రాంతి అంటే తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు మాత్రమే కీలకం. కానీ వేసవి అంటే అన్ని చోట్లా భారీ చిత్రాలు విడుదలవుతాయి. వ్యాక్సినేషన్కు తోడు వేసవిలో వాతావరణం కూడా కరోనా ప్రభావాన్ని తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అప్పటికి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చే అవకాశాలే ఎక్కువ.
This post was last modified on January 8, 2021 10:24 pm
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…