ఒకప్పుడైతే ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వరుసబెట్టి సినిమాలు చేసేవాళ్లు. పది, ఇరవై సినిమాలు కూడా కలిసి చేసిన జోడీలు ఉన్నాయి. రాధ, సుహాసిని, రాధిక లాంటి హీరోయిన్లు ఒక్కొక్కరితో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశారు. మిగతా ఇండస్ట్రీల్లో ఇలా హిట్ పెయిర్లను రిపీట్ చేసేవాళ్లు. కానీ గత 20 ఏళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంత హిట్ కాంబినేషన్ అయినా సరే.. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడుకు మించి సినిమాలు చేయట్లేదు.
వాటిలోనూ మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుున్నారు. ఇలాంటి టైంలో ఒకప్పటి టాలీవుడ్ టాప్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటున్న రకుల్ ప్రీత్.. ఒక సీనియర్ హీరోతో రెండేళ్ల వ్యవధిలో మూడో సినిమాలో నటించబోతుండటం.. అందులో రెండు సినిమాలు నెల వ్యవధిలో అనౌన్స్ కావడం విశేషం. ఆమె అలా జోడీ కడుతున్న హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగణ్.
అజయ్, రకుల్ తొలిసారిగా ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో అజయ్ మధ్య వయస్కుడిగా కనిపిస్తే.. అతడితో ప్రేమలో పడే యువతిగా రకుల్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి.. వీరిని హిట్ పెయిర్గా మార్చింది. రకుల్ పెర్ఫామెన్స్కు ఇంప్రెస్ అయిన అజయ్.. తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న ‘మే డే’లో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యే ఆ చిత్రం హైదరాబాద్లో మొదలైంది. ఇంతలో అజయ్, రకుల్ కాంబినేషన్లో మూడో సినిమా అనౌన్స్ కావడం విశేషం.
ఆ సినిమా పేరు.. థ్యాంగ్ గాడ్. ఇందులో అజయ్, రకుల్లతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐతే రకుల్ ఇందులో ఎవరితో జోడీ కడుతోందో తెలియట్లేదు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించనుంది. ఈ నెల 21నే ‘థ్యాంక్ గాడ్’ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇంకతుముందు రకుల్.. సిద్దార్థ్తో ‘అయ్యారీ’లోనూ నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 7, 2021 4:39 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…