ఒకప్పుడైతే ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వరుసబెట్టి సినిమాలు చేసేవాళ్లు. పది, ఇరవై సినిమాలు కూడా కలిసి చేసిన జోడీలు ఉన్నాయి. రాధ, సుహాసిని, రాధిక లాంటి హీరోయిన్లు ఒక్కొక్కరితో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశారు. మిగతా ఇండస్ట్రీల్లో ఇలా హిట్ పెయిర్లను రిపీట్ చేసేవాళ్లు. కానీ గత 20 ఏళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంత హిట్ కాంబినేషన్ అయినా సరే.. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడుకు మించి సినిమాలు చేయట్లేదు.
వాటిలోనూ మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుున్నారు. ఇలాంటి టైంలో ఒకప్పటి టాలీవుడ్ టాప్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటున్న రకుల్ ప్రీత్.. ఒక సీనియర్ హీరోతో రెండేళ్ల వ్యవధిలో మూడో సినిమాలో నటించబోతుండటం.. అందులో రెండు సినిమాలు నెల వ్యవధిలో అనౌన్స్ కావడం విశేషం. ఆమె అలా జోడీ కడుతున్న హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగణ్.
అజయ్, రకుల్ తొలిసారిగా ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో అజయ్ మధ్య వయస్కుడిగా కనిపిస్తే.. అతడితో ప్రేమలో పడే యువతిగా రకుల్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి.. వీరిని హిట్ పెయిర్గా మార్చింది. రకుల్ పెర్ఫామెన్స్కు ఇంప్రెస్ అయిన అజయ్.. తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న ‘మే డే’లో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యే ఆ చిత్రం హైదరాబాద్లో మొదలైంది. ఇంతలో అజయ్, రకుల్ కాంబినేషన్లో మూడో సినిమా అనౌన్స్ కావడం విశేషం.
ఆ సినిమా పేరు.. థ్యాంగ్ గాడ్. ఇందులో అజయ్, రకుల్లతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐతే రకుల్ ఇందులో ఎవరితో జోడీ కడుతోందో తెలియట్లేదు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించనుంది. ఈ నెల 21నే ‘థ్యాంక్ గాడ్’ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇంకతుముందు రకుల్.. సిద్దార్థ్తో ‘అయ్యారీ’లోనూ నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 7, 2021 4:39 pm
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…
హైదరాబాద్ నగరంలోని అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…
విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…