ఒకప్పుడైతే ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వరుసబెట్టి సినిమాలు చేసేవాళ్లు. పది, ఇరవై సినిమాలు కూడా కలిసి చేసిన జోడీలు ఉన్నాయి. రాధ, సుహాసిని, రాధిక లాంటి హీరోయిన్లు ఒక్కొక్కరితో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశారు. మిగతా ఇండస్ట్రీల్లో ఇలా హిట్ పెయిర్లను రిపీట్ చేసేవాళ్లు. కానీ గత 20 ఏళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంత హిట్ కాంబినేషన్ అయినా సరే.. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడుకు మించి సినిమాలు చేయట్లేదు.
వాటిలోనూ మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుున్నారు. ఇలాంటి టైంలో ఒకప్పటి టాలీవుడ్ టాప్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటున్న రకుల్ ప్రీత్.. ఒక సీనియర్ హీరోతో రెండేళ్ల వ్యవధిలో మూడో సినిమాలో నటించబోతుండటం.. అందులో రెండు సినిమాలు నెల వ్యవధిలో అనౌన్స్ కావడం విశేషం. ఆమె అలా జోడీ కడుతున్న హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగణ్.
అజయ్, రకుల్ తొలిసారిగా ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో అజయ్ మధ్య వయస్కుడిగా కనిపిస్తే.. అతడితో ప్రేమలో పడే యువతిగా రకుల్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి.. వీరిని హిట్ పెయిర్గా మార్చింది. రకుల్ పెర్ఫామెన్స్కు ఇంప్రెస్ అయిన అజయ్.. తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న ‘మే డే’లో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యే ఆ చిత్రం హైదరాబాద్లో మొదలైంది. ఇంతలో అజయ్, రకుల్ కాంబినేషన్లో మూడో సినిమా అనౌన్స్ కావడం విశేషం.
ఆ సినిమా పేరు.. థ్యాంగ్ గాడ్. ఇందులో అజయ్, రకుల్లతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐతే రకుల్ ఇందులో ఎవరితో జోడీ కడుతోందో తెలియట్లేదు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించనుంది. ఈ నెల 21నే ‘థ్యాంక్ గాడ్’ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇంకతుముందు రకుల్.. సిద్దార్థ్తో ‘అయ్యారీ’లోనూ నటించిన సంగతి తెలిసిందే.
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…