ఒకప్పుడైతే ఒక హీరో, ఒక హీరోయిన్ కలిసి వరుసబెట్టి సినిమాలు చేసేవాళ్లు. పది, ఇరవై సినిమాలు కూడా కలిసి చేసిన జోడీలు ఉన్నాయి. రాధ, సుహాసిని, రాధిక లాంటి హీరోయిన్లు ఒక్కొక్కరితో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశారు. మిగతా ఇండస్ట్రీల్లో ఇలా హిట్ పెయిర్లను రిపీట్ చేసేవాళ్లు. కానీ గత 20 ఏళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంత హిట్ కాంబినేషన్ అయినా సరే.. ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడుకు మించి సినిమాలు చేయట్లేదు.
వాటిలోనూ మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటుున్నారు. ఇలాంటి టైంలో ఒకప్పటి టాలీవుడ్ టాప్ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటున్న రకుల్ ప్రీత్.. ఒక సీనియర్ హీరోతో రెండేళ్ల వ్యవధిలో మూడో సినిమాలో నటించబోతుండటం.. అందులో రెండు సినిమాలు నెల వ్యవధిలో అనౌన్స్ కావడం విశేషం. ఆమె అలా జోడీ కడుతున్న హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగణ్.
అజయ్, రకుల్ తొలిసారిగా ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అందులో అజయ్ మధ్య వయస్కుడిగా కనిపిస్తే.. అతడితో ప్రేమలో పడే యువతిగా రకుల్ నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించి.. వీరిని హిట్ పెయిర్గా మార్చింది. రకుల్ పెర్ఫామెన్స్కు ఇంప్రెస్ అయిన అజయ్.. తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న ‘మే డే’లో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ మధ్యే ఆ చిత్రం హైదరాబాద్లో మొదలైంది. ఇంతలో అజయ్, రకుల్ కాంబినేషన్లో మూడో సినిమా అనౌన్స్ కావడం విశేషం.
ఆ సినిమా పేరు.. థ్యాంగ్ గాడ్. ఇందులో అజయ్, రకుల్లతో పాటు సిద్దార్థ్ మల్హోత్రా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఐతే రకుల్ ఇందులో ఎవరితో జోడీ కడుతోందో తెలియట్లేదు. ఇంద్రకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మించనుంది. ఈ నెల 21నే ‘థ్యాంక్ గాడ్’ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఇంకతుముందు రకుల్.. సిద్దార్థ్తో ‘అయ్యారీ’లోనూ నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 7, 2021 4:39 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…