కరోనా విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాంచి స్పీడు మీదున్నారు. గత నెలలోనే మళ్లీ ఆచార్య సెట్లోకి అడుగు పెట్టిన ఆయన.. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో లూసిఫర్ రీమేక్ను చిరు మొదలుపెట్టబోతున్నారు. ఈ చిత్రాన్ని మూణ్నాలుగు నెలల్లోనే చిరు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ కూడా ఖరారైంది. అది పక్కాగా ఎప్పుడు మొదలవుతుందన్నదే తేలాల్సి ఉంది. కాగా పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ చిత్రాల దర్శకుడు బాబీతోనూ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్న చిరు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఐతే చాలా రోజులుగా లూసిఫర్, వేదాళం రీమేక్ల హడావుడే కనిపిస్తోంది.. వాటి అప్ డేట్లే బయటికి వస్తున్నాయి తప్ప.. బాబీతో చిరు సినిమాపై చప్పుడు లేదు. చిరు కూడా ఎక్కడా దాని గురించి మాట్లాడట్లేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఎప్పుడు మొదలెడతారో ఏంటో కానీ.. ముందు అయితే ముహూర్త కార్యక్రమం జరిపించేయబోతున్నారట.
సంక్రాంతి ముంగిట ఈ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. చిరు ఓ కథను ఓకే చేశారని.. ఐతే పూర్తి స్క్రిప్టు రెడీ చేసే పనిలో బాబీ బిజీగా ఉన్నాడని.. అతను ప్రశాంతంగా పని చేసుకోవడం కోసం ముహూర్తం జరిపించేసి.. మిగతా సినిమాల పనిలో చిరు పడిపోతారని.. అంతా ఓకే అనుకున్నాక, తనకు కుదిరినపుడు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలన్నది చిరు ప్రణాళిక అని అంటున్నారు.
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…