కరోనా విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాంచి స్పీడు మీదున్నారు. గత నెలలోనే మళ్లీ ఆచార్య సెట్లోకి అడుగు పెట్టిన ఆయన.. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో లూసిఫర్ రీమేక్ను చిరు మొదలుపెట్టబోతున్నారు. ఈ చిత్రాన్ని మూణ్నాలుగు నెలల్లోనే చిరు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ కూడా ఖరారైంది. అది పక్కాగా ఎప్పుడు మొదలవుతుందన్నదే తేలాల్సి ఉంది. కాగా పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ చిత్రాల దర్శకుడు బాబీతోనూ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్న చిరు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఐతే చాలా రోజులుగా లూసిఫర్, వేదాళం రీమేక్ల హడావుడే కనిపిస్తోంది.. వాటి అప్ డేట్లే బయటికి వస్తున్నాయి తప్ప.. బాబీతో చిరు సినిమాపై చప్పుడు లేదు. చిరు కూడా ఎక్కడా దాని గురించి మాట్లాడట్లేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఎప్పుడు మొదలెడతారో ఏంటో కానీ.. ముందు అయితే ముహూర్త కార్యక్రమం జరిపించేయబోతున్నారట.
సంక్రాంతి ముంగిట ఈ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. చిరు ఓ కథను ఓకే చేశారని.. ఐతే పూర్తి స్క్రిప్టు రెడీ చేసే పనిలో బాబీ బిజీగా ఉన్నాడని.. అతను ప్రశాంతంగా పని చేసుకోవడం కోసం ముహూర్తం జరిపించేసి.. మిగతా సినిమాల పనిలో చిరు పడిపోతారని.. అంతా ఓకే అనుకున్నాక, తనకు కుదిరినపుడు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలన్నది చిరు ప్రణాళిక అని అంటున్నారు.
This post was last modified on January 3, 2021 12:32 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…