కరోనా విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాంచి స్పీడు మీదున్నారు. గత నెలలోనే మళ్లీ ఆచార్య సెట్లోకి అడుగు పెట్టిన ఆయన.. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నెల చివర్లో లేదా ఫిబ్రవరి ఆరంభంలో లూసిఫర్ రీమేక్ను చిరు మొదలుపెట్టబోతున్నారు. ఈ చిత్రాన్ని మూణ్నాలుగు నెలల్లోనే చిరు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ కూడా ఖరారైంది. అది పక్కాగా ఎప్పుడు మొదలవుతుందన్నదే తేలాల్సి ఉంది. కాగా పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ చిత్రాల దర్శకుడు బాబీతోనూ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్న చిరు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఐతే చాలా రోజులుగా లూసిఫర్, వేదాళం రీమేక్ల హడావుడే కనిపిస్తోంది.. వాటి అప్ డేట్లే బయటికి వస్తున్నాయి తప్ప.. బాబీతో చిరు సినిమాపై చప్పుడు లేదు. చిరు కూడా ఎక్కడా దాని గురించి మాట్లాడట్లేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఎప్పుడు మొదలెడతారో ఏంటో కానీ.. ముందు అయితే ముహూర్త కార్యక్రమం జరిపించేయబోతున్నారట.
సంక్రాంతి ముంగిట ఈ కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. చిరు ఓ కథను ఓకే చేశారని.. ఐతే పూర్తి స్క్రిప్టు రెడీ చేసే పనిలో బాబీ బిజీగా ఉన్నాడని.. అతను ప్రశాంతంగా పని చేసుకోవడం కోసం ముహూర్తం జరిపించేసి.. మిగతా సినిమాల పనిలో చిరు పడిపోతారని.. అంతా ఓకే అనుకున్నాక, తనకు కుదిరినపుడు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలన్నది చిరు ప్రణాళిక అని అంటున్నారు.
పెద్ద హీరోల కొడుకులు ఆటోమేటిగ్గా హీరోలు అయిపోతుంటారు. ఇందుకు ఇండియాలో ఏ ఫిలిం ఇండస్ట్రీ మినహాయింపు కాదు. ముఖ్యంగా తెలుగు,…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…