Movie News

బాబీతో చిరు.. ముహూర్తం కుదిరిందా?

క‌రోనా విరామం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి మాంచి స్పీడు మీదున్నారు. గ‌త నెల‌లోనే మ‌ళ్లీ ఆచార్య సెట్లోకి అడుగు పెట్టిన ఆయ‌న‌.. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమాను ముగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నెల చివ‌ర్లో లేదా ఫిబ్ర‌వ‌రి ఆరంభంలో లూసిఫ‌ర్ రీమేక్‌ను చిరు మొద‌లుపెట్ట‌బోతున్నారు. ఈ చిత్రాన్ని మూణ్నాలుగు నెల‌ల్లోనే చిరు పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

దీని త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ కూడా ఖ‌రారైంది. అది ప‌క్కాగా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న‌దే తేలాల్సి ఉంది. కాగా ప‌వ‌ర్, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, జై ల‌వ‌కుశ చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీతోనూ ఓ సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్న చిరు ఇంత‌కుముందే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఐతే చాలా రోజులుగా లూసిఫ‌ర్‌, వేదాళం రీమేక్‌ల హ‌డావుడే క‌నిపిస్తోంది.. వాటి అప్ డేట్లే బ‌య‌టికి వ‌స్తున్నాయి త‌ప్ప‌.. బాబీతో చిరు సినిమాపై చ‌ప్పుడు లేదు. చిరు కూడా ఎక్క‌డా దాని గురించి మాట్లాడ‌ట్లేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. ఐతే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ సినిమా ఎప్పుడు మొద‌లెడ‌తారో ఏంటో కానీ.. ముందు అయితే ముహూర్త కార్య‌క్ర‌మం జ‌రిపించేయ‌బోతున్నార‌ట‌.

సంక్రాంతి ముంగిట ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని అంటున్నారు. చిరు ఓ క‌థ‌ను ఓకే చేశార‌ని.. ఐతే పూర్తి స్క్రిప్టు రెడీ చేసే ప‌నిలో బాబీ బిజీగా ఉన్నాడ‌ని.. అత‌ను ప్ర‌శాంతంగా ప‌ని చేసుకోవ‌డం కోసం ముహూర్తం జ‌రిపించేసి.. మిగ‌తా సినిమాల ప‌నిలో చిరు ప‌డిపోతార‌ని.. అంతా ఓకే అనుకున్నాక‌, త‌న‌కు కుదిరిన‌పుడు ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాల‌న్న‌ది చిరు ప్ర‌ణాళిక అని అంటున్నారు.

This post was last modified on January 3, 2021 12:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago